NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu

    భారతదేశం బిజినెస్ అంతర్జాతీయం క్రీడలు టెక్నాలజీ సినిమా ఆటోమొబైల్స్ లైఫ్-స్టైల్ కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
     
    హోమ్ / వార్తలు / క్రీడలు వార్తలు / పాకిస్థాన్ తో అక్టోబర్ 15న తలపడనున్న టీమిండియా 
    పాకిస్థాన్ తో అక్టోబర్ 15న తలపడనున్న టీమిండియా 
    క్రీడలు

    పాకిస్థాన్ తో అక్టోబర్ 15న తలపడనున్న టీమిండియా 

    వ్రాసిన వారు Jayachandra Akuri
    May 10, 2023 | 07:23 pm 0 నిమి చదవండి
    పాకిస్థాన్ తో అక్టోబర్ 15న తలపడనున్న టీమిండియా 
    ఆస్ట్రేలియాతో తొలి మ్యాచ్ ఆడనున్న టీమిండియా

    వరల్డ్ కప్ లో భాగంగా ఇండియా తొలి మ్యాచ్ ఆస్ట్రేలియాతో జరిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇక ఎన్నో ఏళ్ల నుంచి ఎదురుచూస్తున్న దాయాది పాకిస్థాన్ తో మ్యాచ్ అక్టోబర్ 15న తలపడే అవకాశం ఉన్నట్లు క్రిక్ బజ్ రిపోర్టు వెల్లడించింది. వరల్డ్ కప్ లో భాగంగా హైదారాబాద్ లోనూ పాకిస్థాన్ టీమ్ మ్యాచ్ లు ఆడనుంది. దీనిపై అధికారిక షెడ్యూల్ ఇంకా వెలువడాల్సి ఉంది. అక్టోబర్ 5 నుంచి నుంచి ఇండియాలో వరల్డ్ కప్ ప్రారంభం కానుంది. ఇక ఈ టోర్నీలో తొలి మ్యాచ్ ఇంగ్లండ్, న్యూజిలాండ్ మధ్య అక్టోబర్ 5న అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరగనుంది. దీనికి సంబంధించి అధికారిక షెడ్యుల్ త్వరలోనే ప్రకటించనున్నారు.

    నవంబర్ 19న ఫైనల్ మ్యాచ్  

    వరల్డ్ కప్ లో ఆడటానికి పాకిస్థాన్ అంగీకరించినట్లు కూడా బోర్డు వర్గాలు చెప్పినట్లు క్రికెజబ్ స్పష్టం చేసింది. ఇండియాలో మ్యాచ్ ను అహ్మదాబాద్ లో నిర్వహించడంపై పాక్ బోర్డు అభ్యంతరం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. పాకిస్థాన్ తన మ్యాచ్ లను హైదరాబాద్, అహ్మదాబాద్, చైన్నై, బెంగళూర్ లలో ఆడనుంది. కోల్‌కతా, ఢిల్లీ, ఇండోర్, ధర్మశాల, గువాహటి, రాజ్‌కోట్, రాయ్‌పూర్, ముంబైలలోనూ వరల్డ్ కప్ మ్యాచ్ లు జరగనున్నాయి. వరల్డ్ కప్ లో మొత్తం 10 జట్లు ఆడనున్నాయి. మొత్తం వారి మధ్య 48 మ్యాచ్ లు జరగనున్నాయి.

    ఈ టైమ్ లైన్ ని షేర్ చేయండి
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    టీమిండియా
    క్రికెట్

    టీమిండియా

    సౌతాఫ్రికాకు తొలగిన అడ్డంకి.. వరల్డ్ కప్ కు క్వాలిఫై అయిన సఫారీలు! క్రికెట్
    కేఎల్ రాహుల్ గాయంపై కీలక అప్డేట్.. సర్జరీ సక్సెస్  క్రికెట్
    బీసీసీఐ దెబ్బకు పాక్ నుంచి ఆసియా కప్ తరలింపు.. శ్రీలంకకి ఆతిథ్యం ఛాన్స్? పాకిస్థాన్
    భారత్-పాకిస్థాన్ జట్ల మధ్య వరల్డ్ కప్ మ్యాచ్.. ఎప్పుడు, ఎక్కడంటే? పాకిస్థాన్

    క్రికెట్

    క్రికెట్ ప్రపంచంలో బీసీసీఐనే నెంబర్ వన్.. ఏడాదికి ఐసీసీ నుంచే 1900 కోట్ల ఆదాయం బీసీసీఐ
    అండర్ 16 ఆటగాళ్లతో ముచ్చటించిన రిషబ్ పంత్ రిషబ్ పంత్
    అంతర్జాతీయ క్రికెట్ కు షబ్మిమ్ ఇస్మాయిల్ గుడ్‌బై దక్షిణ ఆఫ్రికా
    టీ20ల్లోనూ టీమిండియానే అగ్రస్థానం టీమిండియా
    తదుపరి వార్తా కథనం

    క్రీడలు వార్తలను ఇష్టపడుతున్నారా?

    అప్ డేట్ గా ఉండటానికి సబ్ స్క్రయిబ్ చేయండి.

    Sports Thumbnail
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2023