LOADING...
Team India: టీమిండియా సెమీస్‌కు చేరదు.. పాక్ ప్లేయర్ వ్యాఖ్యలపై టీమిండియా ఫ్యాన్స్ ఫైర్!
టీమిండియా సెమీస్‌కు చేరదు.. పాక్ ప్లేయర్ వ్యాఖ్యలపై టీమిండియా ఫ్యాన్స్ ఫైర్!

Team India: టీమిండియా సెమీస్‌కు చేరదు.. పాక్ ప్లేయర్ వ్యాఖ్యలపై టీమిండియా ఫ్యాన్స్ ఫైర్!

వ్రాసిన వారు Jayachandra Akuri
Feb 20, 2026
05:16 pm

ఈ వార్తాకథనం ఏంటి

పాకిస్థాన్ మాజీ క్రికెటర్‌ మొహమ్మద్‌ ఆమిర్‌ టీ20 ప్రపంచకప్ 2026 టోర్నీలో టీమిండియా సెమీస్‌కి చేరే అవకాశాలు లేవని సూటిగా వ్యాఖ్యానించారు. వరల్డ్‌కప్‌ ఈవెంట్‌లో గ్రూప్‌-ఎ నుంచి భారత్‌ మరియు పాకిస్తాన్‌ టాపర్‌గా సూపర్‌-8కు ప్రవేశించాయి. లీగ్‌ దశలో భారత్‌ అమెరికా, నమీబియా, పాకిస్తాన్‌, నెదర్లాండ్స్‌లను ఓడించి అజేయంగా నిలిచింది. పాకిస్తాన్‌ కూడా నెదర్లాండ్స్‌, అమెరికా, నమీబియాలను ఓడించగా.. భారత్‌ చేతిలో మరోసారి ఓటమిపాలైంది. ఈ విధంగా టీ20 వరల్డ్‌కప్‌ టోర్నీలో భారత్‌ పాక్‌పై ఆధిపత్యం 8-1కి పెరిగింది. గ్రూప్‌ దశలో నమీబియాను సులువుగా ఓడించినప్పటికీ, అమెరికా మరియు నెదర్లాండ్స్‌ భారత్‌, పాక్‌కి కఠిన పోటీని ఇచ్చిన జట్లుగా నిలిచాయి.

Details

సౌతాఫ్రికా, వెస్టిండీస్ అద్భుతంగా అడుతున్నాయి

ముఖ్యంగా అమెరికా.. ఆ జట్లకు గట్టి సవాలు విసిరింది. పాక్‌ సూపర్‌-8 చేరే క్రమంలో గట్టిపోటీ ఎదుర్కొంది. సూపర్‌-8లో భారత్‌ దక్షిణాఫ్రికా, జింబాబ్వే, వెస్టిండీస్‌లతో తలపడనుంది, పాకిస్తాన్‌ న్యూజిలాండ్‌, ఇంగ్లండ్‌, శ్రీలంక జట్లను ఎదుర్కొననుంది. ఈ నేపథ్యంలో మొహమ్మద్‌ ఆమిర్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పాక్‌తో మ్యాచ్‌ తప్ప, లీగ్‌ దశలో ప్రతి మ్యాచ్‌లో టీమిండియా బ్యాటింగ్‌ లైన్‌ కుప్పకూలింది. కాబట్టి ఆ జట్టుకు సెమీస్‌కి అవకాశాలు లేవు. సౌతాఫ్రికా, వెస్టిండీస్‌ అద్భుతంగా ఆడుతున్నాయి. ఏ జట్టునైనా ఓడించగల సామర్థ్యం ఉంది.

Details

ఆమిర్‌ వ్యాఖ్యలపై కౌంటర్

అందుకే సెమీస్‌కి అవకాశం ఆ జట్లకే ఉంది. ఆమిర్‌ వ్యాఖ్యలపై టీమిండియా అభిమానులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ముందుగా మీ (పాక్‌) జట్టుపై దృష్టి పెట్టండి. గత ఎడిషన్‌లో అమెరికా చేతిలో ఓడిన సంగతిని మర్చిపోకండి అని గట్టి కౌంటర్ ఇస్తున్నారు. సూపర్‌-8లో గ్రూప్‌-1 నుంచి భారత్‌, జింబాబ్వే, సౌతాఫ్రికా, వెస్టిండీస్‌ పోటీగా ఉన్నాయి. గ్రూప్‌-2 నుంచి న్యూజిలాండ్‌, ఇంగ్లండ్‌, శ్రీలంక, పాకిస్తాన్‌ పాల్గొంటున్నారు. 2024లో టీ20 వరల్డ్‌కప్‌ గెలిచిన టీమిండియా.. ఆ తర్వాత ద్వైపాక్షిక సిరీస్‌లలోనూ విజయాల పథంలో కొనసాగింది. డిఫెండింగ్‌ చాంపియన్‌ హోదాలో 2026 వరల్డ్‌కప్‌లో టీమిండియా హాట్‌ ఫేవరెట్‌గా ప్రవేశించింది.

Advertisement