IND Vs PAK: పాకిస్థాన్ పై టీమిండియా అద్భుత విజయం
ఆసియా కప్-4 మ్యాచులో పాకిస్థాన్ పై టీమిండియా అద్భుత విజయాన్ని నమోదు చేసింది. చిరకాల ప్రత్యర్థిని 228 పరుగుల తేడాతో భారత జట్టు చిత్తు చేసింది. బౌలింగ్, ఫీల్డింగ్ లో తేలిపోయిన పాక్ జట్టు 357 పరుగల భారీ పరుగుల లక్ష్య చేధనలో చేతులెత్తేసింది. భారత్ తొలుత 32 ఓవర్లలో 356/2 స్కోరు చేయగా, పాక్ 32 ఓవర్లలో 128 పరుగులకు 8 వికెట్లను కోల్పోయింది. గాయం కారణంగా నసీమ్ షా, హరీస్ రౌఫ్ బ్యాటింగ్ కు రాకపోవడంతో భారత విజయం ఖరారైంది. టీమిండియా బౌలర్లో కుల్దీప్ యాదవ్ 5 వికెట్లతో విజృంభించాడు. ఇక 94 బంతుల్లో 122 పరుగులు చేసిన విరాట్ కోహ్లీకి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.