Loading...
Football: మ్యాచ్ మధ్యలో పిడుగు బీభత్సం.. ఫుట్‌బాల్ ఆటగాడు మృతి
మ్యాచ్ మధ్యలో పిడుగు బీభత్సం.. ఫుట్‌బాల్ ఆటగాడు మృతి

Football: మ్యాచ్ మధ్యలో పిడుగు బీభత్సం.. ఫుట్‌బాల్ ఆటగాడు మృతి

వ్రాసిన వారు Moogati Shabari
Aug 06, 2026
03:18 pm

ఈ వార్తాకథనం ఏంటి

దక్షిణ థాయ్‌లాండ్‌లో నిర్వహిస్తున్న ఫుట్‌ బాల్ టోర్నీలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. గోలోక్ ఎఫ్‌ఏ కప్-2026 సెమీఫైనల్ మ్యాచ్ జరుగుతున్న సమయంలో ఒక్కసారిగా మైదానంపై పిడుగు పడింది. ఈ ప్రమాదంలో 24 ఏళ్ల ఫుట్‌బాల్ క్రీడాకారుడు సోఫ్వాన్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరో 12 మంది ఆటగాళ్లు తీవ్ర గాయాలపాలయ్యారు. ఈ షాకింగ్ ఘటన మొత్తం కెమెరాల్లో రికార్డు కావడంతో, సంబంధిత వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అవుతోంది.

వివరాలు

మైదానంలో కుప్పకూలిన ప్లేయర్..

పిడుగు తాకిడికి సోఫ్వాన్ మైదానంలోనే కుప్పకూలడంతో వైద్య సిబ్బంది వెంటనే అతడికి సీపీఆర్ అందించి ప్రాణాలు కాపాడేందుకు ప్రయత్నించారు.

అయినప్పటికీ అప్పటికే అతడు మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.

గాయపడిన మిగతా ఆటగాళ్లను వెంటనే సమీప ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు.

దక్షిణ థాయ్‌లాండ్ సరిహద్దు ప్రాంతంలో జరిగే ఫుట్‌బాల్ టోర్నీల్లో గోలోక్ ఎఫ్‌ఏ కప్‌ను అతిపెద్ద పోటీలలో ఒకటిగా పరిగణిస్తారు.

వివరాలు

హెచ్చరిక లేకుండానే మైదానంపై పిడుగుపాటు..

ఈ టోర్నీలో థాయ్‌లాండ్‌తో పాటు మలేషియాకు చెందిన జట్లు, ఆటగాళ్లు కూడా పాల్గొంటారు.

మ్యాచ్ ప్రారంభానికి ముందు భారీ వర్షం కురిసిందని స్థానికులు తెలిపారు.

వర్షం తగ్గిన తర్వాతే మ్యాచ్ నిర్వహించినట్లు నిర్వాహకులు వెల్లడించారు.

అయితే ఎలాంటి హెచ్చరిక లేకుండానే మైదానంపై పిడుగు పడుతుందని ఊహించలేకపోయామని, తమ సహచర ఆటగాడు సోఫ్వాన్‌ను కోల్పోవడం తీవ్ర విషాదమని గోలోక్ క్లబ్ నిర్వాహకులు ఆవేదన వ్యక్తం చేశారు.

ADVERTISEMENT