ODI World Cup: వన్డే ప్రపంచ కప్ జట్టును ప్రకటించిన నెదర్లాండ్స్.. తెలుగోడికి చోటు!
భారత్ వేదికగా అక్టోబర్ 5న వన్డే ప్రపంచ కప్ సమరం మొదలు కానుంది. ఈ మెగా టోర్నీ కోసం ఇప్పటికే చాలా జట్లు 15 మందితో కూడిన జట్లను ప్రకటించాయి. తాజాగా నెదర్లాండ్స్ క్రికెట్ బోర్డు గురువారం వరల్డ్ కప్ స్క్వాడ్ను ప్రకటించింది. ఈ మెగా ఈవెంట్ ఆడే 15 మంది సభ్యుల పేర్లను వెల్లడించింది. స్కాట్ ఎడ్వర్డ్స్ నెదర్లాండ్ జట్టుకు నాయకత్వం వహించనున్నాడు. ఇక నెదర్లాండ్ జట్టులో భారత సంతతికి చెందిన తేజ నిడమానూరుకి చోటు లభించింది. ఈ మధ్య ముగిసిన వరల్డ్ కప్ క్వాలిఫయర్స్లో తేజ అదరొట్టిన విషయం తెలిసిందే. వరల్డ్ కప్ టోర్నీలో అక్టోబర్ 6న తొలి మ్యాచులో నెదర్లాండ్ జట్టు పాకిస్థాన్తో తలపడనుంది.