NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / క్రీడలు వార్తలు / SA vs IND: గెబేహాలో వర్షం ముప్పు.. రెండో టీ20 మ్యాచ్‌పై ప్రభావం
    తదుపరి వార్తా కథనం
    SA vs IND: గెబేహాలో వర్షం ముప్పు.. రెండో టీ20 మ్యాచ్‌పై ప్రభావం
    గెబేహాలో వర్షం ముప్పు.. రెండో టీ20 మ్యాచ్‌పై ప్రభావం

    SA vs IND: గెబేహాలో వర్షం ముప్పు.. రెండో టీ20 మ్యాచ్‌పై ప్రభావం

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Nov 10, 2024
    11:06 am

    ఈ వార్తాకథనం ఏంటి

    భారత జట్టు దక్షిణాఫ్రికాతో జరుగుతున్న టీ20 సిరీస్‌ను ఘనంగా ప్రారంభించింది.

    డర్బన్‌ వేదికగా జరిగిన తొలి మ్యాచ్‌లో 61 పరుగుల తేడాతో గెలుపొందింది. ప్రస్తుతం రెండో టీ20 మ్యాచ్‌ కోసం సిద్ధమైంది.

    ఇక స్వదేశంలో ఘోర ఓటమిని ఎదుర్కొన్న సఫారీ జట్టు ప్రతీకారం తీర్చుకోవాలని గట్టి పట్టుదలగా ఉంది. అయితే ఈ మ్యాచ్‌కు వర్షం ముప్పు పొంచి ఉందని వాతావరణ శాఖ సూచిస్తోంది.

    రెండో టీ20 మ్యాచ్‌ గెబేహాలో జరగనుంది. మ్యాచ్‌ భారత కాలమానం ప్రకారం రాత్రి 7.30 గంటలకు ప్రారంభం కానుంది.

    గెబేహాలో మాత్రం టైమ్‌ మధ్యాహ్నం 4 గంటల సమయం ఉంటుంది. మ్యాచ్‌ ప్రారంభానికి ముందే వర్షం ఇబ్బంది పెడితే, టాస్‌ కూడా ఆలస్యమయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.

    Details

    వర్షం వల్ల ఆట కొనసాగకపోతే రద్దు చేసే అవకాశం

    వర్షం కారణంగా మొదటి ఇన్నింగ్స్‌లో ఆటకు అంతరాయం ఏర్పడితే, గేమ్‌ను తిరిగి పునఃప్రారంభించడానికి సమయం క్రమంగా తగ్గిపోతుంది.

    ఒకటి లేదా రెండు గంటలు వర్షం ఆగినా, మైదానం సిద్ధం చేయడానికి మరింత సమయం పడుతుంది. ఆ సమయంలో వర్షం మళ్ళీ కురుస్తే, మ్యాచ్‌ను కొనసాగించడం కష్టమే.

    అయితే, వర్షం వల్ల పూర్తిగా మ్యాచ్‌ నిర్వహించలేకపోతే కనీసం 5 ఓవర్ల ఆటను నిర్వహిస్తారు. దాని తరువాత కూడా ఆట సాగకపోతే, మ్యాచ్‌ రద్దు చేస్తారు.

    ఇలాంటి తరుణంలో భారత్‌ 1-0 ఆధిక్యంలో ఉన్నందున, మిగిలిన రెండు మ్యాచుల్లో ఏదొకటి గెలిస్తే సిరీస్‌ భారత్‌కే సొంతమవుతుంది.

    Details

    అభిషేక్ శర్మ ఆడతాడా? 

    టీమిండియా తొలి మ్యాచ్‌లో 200 పైగానే పరుగులు చేసినప్పటికీ, 250+ స్కోర్‌ సాధించడంలో విఫలమైంది. సూర్య, తిలక్, సంజు ఔటైన తరువాత బ్యాటర్లు కొంత ఇబ్బంది పడ్డారు.

    అభిషేక్ శర్మను ఓపెనర్‌గా ఆడించినప్పటికీ, అతడి ఆరంభం మెరుపుగా ఉండకపోవడంతో, రెండో టీ20లో అతనికి అవకాశం ఇవ్వాలని టీమ్‌ఇండియా మేనేజ్‌మెంట్ అనుకుంటుందా అన్నది ఆసక్తికరంగా మారింది.

    కొత్త కుర్రాళ్లు రమణ్‌దీప్‌, విజయ్‌కుమార్‌ వైశాక్‌కు తొలి టీ20లో అవకాశం ఇవ్వకపోయినా, సిరీస్‌లో ఆధిక్యంలోకి వెళ్లిన తరువాత వారికి అవకాశాలు ఇవ్వాలని మేనేజ్‌మెంట్‌ చూస్తున్నట్లు క్రికెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    దక్షిణాఫ్రికా క్రికెట్ టీం
    భారత జట్టు

    తాజా

    GT vs LSG: గుజరాత్ టైటాన్స్‌పై లఖ్‌నవూ సూపర్‌ జెయింట్స్ 33 పరుగుల తేడాతో విజయం ఐపీఎల్
    RCB: ఆర్సీబీ జట్టులో అనుకోని మార్పు.. ఇంగ్లండ్ ఆటగాడు జాకబ్ బెతెల్ ప్లేఆఫ్స్‌కు దూరం  రాయల్ చాలెంజర్స్ బెంగళూరు
    Jammu Kashmir: జమ్ముకశ్మీర్‌లోని కిష్త్వార్‌లో ఉగ్రవాదులతో ఎన్‌కౌంటర్‌.. జవాన్ వీరమరణం  జమ్ముకశ్మీర్
    All party delegations: ఉగ్రవాదంపై పోరులో భారత్‌కు మద్దతుగా యూఏఈ, జపాన్‌ ఆపరేషన్‌ సిందూర్‌

    దక్షిణాఫ్రికా క్రికెట్ టీం

    Anrich Nortje: వరల్డ్ కప్‌కు ముందు సౌతాఫ్రికాకు భారీ షాక్.. గాయంతో స్టార్ పేసర్ ఔట్! ఆస్ట్రేలియా
    విధ్వంసం సృష్టించిన ఆస్ట్రేలియన్ బ్యాటర్‌.. ఏబీ డివిలియర్స్‌ ఫాస్టెస్ట్‌ సెంచరీ రికార్డు బద్దలు క్రికెట్
    ICC Cricket World Cup: సౌతాఫ్రికా వర్సెస్ నెదర్లాండ్స్‌.. సఫారీల జోరు కొనసాగుతుందా?  ప్రపంచ కప్
    IND vs SA Preview: నువ్వా? నేనా?.. టీమిండియా జోరుకు దక్షిణాఫ్రికా బ్రేక్ వేస్తుందా? బర్త్ డే భాయ్ కోహ్లీపై ఫోకస్  వన్డే వరల్డ్ కప్ 2023

    భారత జట్టు

    అర్ష్‌దీప్‌పై గవాస్కర్ ఘాటు వ్యాఖ్యలు క్రికెట్
    సెలక్షన్ కమిటీని తొలగించిన DDCA చీఫ్ క్రికెట్
    శ్రీలంకతో జరిగే మొదటి వన్డేలో అదే ఫామ్ కొనసాగేనా..! క్రికెట్
    భారత్ బ్యాట్‌మెన్స్ రాణించకపోతే కష్టమే క్రికెట్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025