'జూమ్ జో పఠాన్' పాటకు స్టెప్పులేసిన విరాట్ కోహ్లీ, షారుక్ ఖాన్
ఐపీఎల్లో కోల్కతా నైట్ రైడర్స్ మొదటి విజయాన్ని నమోదు చేసింది. ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్కతా ఆర్సీబీపై 81 పరుగుల తేడాతో గెలిచింది. ఈ మ్యాచ్ను వీక్షించేందుకు బాలీవుడ్ సూపర్ స్టార్ షారుక్ ఖాన్, తన కుమార్తె సహానా ఖాన్ కూడా వచ్చారు. అయితే ఆర్సీబీపై విజయం సాధించిన తర్వాత కేకేఆర్ జట్టును అభినందించేందుకు షారూక్ మైదాంనలోకి దిగాడు. ఈ నేపథ్యంలో కోహ్లీని చూసిన షారూక్ పరిగెత్తుకుంటూ వెళ్లి అతన్ని కౌగిలించుకున్నాడు. మైదానంలో ఇద్దరు సరదాగా మాట్లాడుకుంటూ కొద్దిసేపు సందడి చేశారు. దీంతో షారూక్, కోహ్లీ అంటూ ప్రేక్షకులు నినాదాలతో స్టేడియాన్ని హోరెత్తించారు.
81 పరుగుల తేడాతో కోల్కతా విజయం
షారుక్ తన సూపర్ హిట్ మూవీ పఠాన్లోని 'జుమ్ జో పఠాన్' పాటకు కోహ్లీకి స్టెప్లను నేర్పించాడు. కోహ్లీని షారుక్ అనుకరిస్తూ స్టెప్లేయడంతో ఫ్యాన్స్ జోష్తో ఊగిపోయారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయింది. మ్యాచ్ విషయానికొస్తే..205 పరుగుల లక్ష్యానికి దిగిన ఆర్సీబీ కేవలం 123 పరుగులకే కుప్పకూలింది. కేకేఆర్ బౌలర్లలో వరుణ్ చక్రవర్తి నాలుగు వికెట్లు, సూయాష్ శర్మ మూడు, నరైన్ రెండు, శార్ధుల్ ఠాకూర్ ఒక వికెట్ తీశారు.