Virat Kohli: వన్డే సిరీస్ కోసం శ్రీలంక చేరుకున్న విరాట్ కోహ్లీ .. సెల్ఫీల కోసం ఎగబడ్డ అభిమానులు
టీ20 ప్రపంచకప్ 2024 ఫైనల్ తర్వాత భారత బ్యాట్స్మెన్ విరాట్ కోహ్లీ తొలిసారిగా అంతర్జాతీయ క్రికెట్లో కనిపించనున్నాడు. నెల రోజుల విరామం తర్వాత విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ కూడా T20 ప్రపంచ కప్ తర్వాత మొదటిసారి అంతర్జాతీయ క్రికెట్ ఆడనున్నాడు. వన్డే సిరీస్ కోసం రోహిత్ శర్మ, ఇతర ఆటగాళ్లు ఇప్పటికే శ్రీలంక చేరుకోగా, విరాట్ కోహ్లీ సోమవారం, అర్ద రాత్రి కొలంబో చేరుకున్నాడు. విరాట్ కోహ్లీ కొలంబో విమానాశ్రయానికి చేరుకోగానే అతనితో సెల్ఫీలు దిగడానికి అభిమానులు క్యూ కట్టారు. విరాట్ కోహ్లి ఎక్కడికి వెళ్లినా అతడితో కలిసి ఫోటోలు దిగేందుకు అభిమానులు ఉత్సాహం చూపుతున్నారు. విమానాశ్రయంలో కూడా అలాంటి దృశ్యమే కనిపించింది.
ICC ఛాంపియన్స్ ట్రోఫీ 2025కి ముందు 6 ODI ఇంటర్నేషనల్ మ్యాచ్లు
T20 ప్రపంచ కప్ 2024 తర్వాత,విరాట్ కోహ్లీ తన భార్య అనుష్క, కుమార్తె వామిక,కుమారుడు అకేతో కలిసి లండన్లో ఒక నెల పాటు సెలవులో ఉన్న విషయం తెలిసిందే. రోహిత్ శర్మ, శ్రేయాస్ అయ్యర్, హర్షిత్ రాణా, మరికొందరు క్రికెటర్లు ఆదివారం శ్రీలంకకు బయలుదేరారు. అయితే, వర్షం కారణంగా విరాట్ మొదటి నెట్ సెషన్ సోమవారం జరగలేదు.అదే సమయంలో మంగళవారం అంటే ఈరోజు జూలై 30న జరిగే నెట్ సెషన్స్లో విరాట్ కోహ్లీ పాల్గొనవచ్చు. వన్డే సిరీస్ ఆగస్ట్ 2 నుండి ప్రారంభమవుతుంది.ఇది కాకుండా,ICC ఛాంపియన్స్ ట్రోఫీ 2025కి ముందు టీమ్ ఇండియా కేవలం 6 ODI ఇంటర్నేషనల్ మ్యాచ్లు మాత్రమే ఆడాలి,కాబట్టి ఈ మ్యాచ్లు విరాట్ కోహ్లీ. రోహిత్ శర్మలకు ముఖ్యమైనవి.