Page Loader
Virat Kohli: మెల్‌బోర్న్ కేఫ్‌లో విరుష్క జంట.. వీడియో వైరల్ 
మెల్‌బోర్న్ కేఫ్‌లో విరుష్క జంట.. వీడియో వైరల్

Virat Kohli: మెల్‌బోర్న్ కేఫ్‌లో విరుష్క జంట.. వీడియో వైరల్ 

వ్రాసిన వారు Jayachandra Akuri
Dec 25, 2024
12:24 pm

ఈ వార్తాకథనం ఏంటి

స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ ప్రస్తుతం ఆస్ట్రేలియాలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఆస్ట్రేలియా‌తో జరుగుతున్న బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ సిరీస్ కోసం విరాట్ అక్కడ ఉన్నారు. ఆయన భార్య అనుష్క శర్మ, పిల్లలు వామిక, అకాయ్ కూడా అతణ్ణితో ఉన్నారు. ఈ సమయంలో విరాట్ తన కుటుంబంతో సమయం గడుపుతున్నారు. తాజాగా విరాట్‌-అనుష్క జంట మెల్‌బోర్న్ వీధుల్లో కలిసి సరదాగా గడిపారు. ఇద్దరూ అక్కడ కాసేపు అనందంగా చక్కర్లు కొట్టారు. మెల్‌బోర్న్‌లోని కేఫ్‌లో బ్రేక్‌ఫాస్ట్‌ను ఆస్వాదించారు. అనంతరం కేఫ్‌ కిచెన్‌ను సందర్శించిన విరాట్, అద్భుతమైన ఫుడ్‌ అందించిన చెఫ్‌కు ధన్యవాదాలు చెప్పారు.

Details

రేపటి నుంచి నాలుగో టెస్టు

ఈ సన్నివేశానికి సంబంధించిన వీడియో, ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. బోర్డర్-గవాస్కర్ సిరీస్‌లో భాగంగా గురువారం నుంచి ఆస్ట్రేలియా-భారత్ మధ్య నాలుగో టెస్ట్ మ్యాచ్ మొదలవుతోంది. మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్‌లో జరుగబోయే ఈ మ్యాచ్‌లో జట్లు విజయాన్ని సాధించి, సిరీస్‌లో పైచేయి సాధించాలని ఇరు జట్లు భావిస్తున్నాయి. ఎంసీజీలో జరిగిన మూడు టెస్టుల్లో భారత్ రెండు సార్లు గెలిచింది. ఒకటిని డ్రా చేసుకుంది. ఇప్పుడు ఎంసీజీలో నాలుగో సారి ఆతిథ్య జట్టును మట్టికరిపించాలని టీమిండియా ఆశిస్తోంది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

వైరల్ అవుతున్న వీడియో