LOADING...
Vaibhav Sooryavanshi Controversy: అది అవుటా.. నాటౌటా? వైభవ్ వికెట్‌పై అప్గాన్ ప్లేయర్ల ఆగ్రహం!
అది అవుటా.. నాటౌటా? వైభవ్ వికెట్‌పై అప్గాన్ ప్లేయర్ల ఆగ్రహం!

Vaibhav Sooryavanshi Controversy: అది అవుటా.. నాటౌటా? వైభవ్ వికెట్‌పై అప్గాన్ ప్లేయర్ల ఆగ్రహం!

వ్రాసిన వారు Jayachandra Akuri
Jun 17, 2026
04:26 pm

ఈ వార్తాకథనం ఏంటి

ట్రై సిరీస్-2026లో భాగంగా భారత్-ఎ, అఫ్గానిస్థాన్-ఎ జట్ల మధ్య జరిగిన వన్డే మ్యాచ్‌లో యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ మరోసారి వార్తల్లో నిలిచాడు. అయితే ఈసారి అతడి బ్యాటింగ్ కంటే థర్డ్ అంపైర్ ఇచ్చిన వివాదాస్పద నిర్ణయమే చర్చనీయాంశమైంది. రీప్లేల్లో స్పష్టంగా క్యాచ్ పట్టినట్లుగా కనిపించినప్పటికీ, థర్డ్ అంపైర్ వైభవ్‌ను నాటౌట్‌గా ప్రకటించడంతో అఫ్గానిస్థాన్-ఎ ఆటగాళ్లు అసంతృప్తి వ్యక్తం చేశారు.

వివరాలు

క్యాచ్ పట్టినా నాటౌట్

ఇన్నింగ్స్ ప్రారంభంలోనే వైభవ్ సూర్యవంశీ ఆడిన షాట్‌ను అఫ్గానిస్థాన్-ఎ ఫీల్డర్ అద్భుతంగా క్యాచ్ అందుకున్నాడు. క్యాచ్ క్లీనుగా పట్టినట్లే కనిపించడంతో వైభవ్ కూడా తాను ఔటయ్యానని భావించి మైదానాన్ని వీడి డ్రెస్సింగ్‌రూమ్ వైపు వెళ్లిపోయాడు. అయితే క్యాచ్ విషయంలో సందేహం వ్యక్తం చేసిన ఫీల్డ్ అంపైర్, నిర్ణయాన్ని థర్డ్ అంపైర్‌కు అప్పగించాడు. పలు కోణాల్లో రీప్లేలను పరిశీలించిన అనంతరం థర్డ్ అంపైర్ బంతి కొంత భాగం నేలను తాకినట్లు కనిపిస్తోందని అభిప్రాయపడ్డాడు. దీంతో క్యాచ్ చెల్లదని తేల్చి వైభవ్‌ను నాటౌట్‌గా ప్రకటించాడు. ఆ తర్వాత వైభవ్ తిరిగి క్రీజులోకి వచ్చాడు.

వివరాలు

అఫ్గాన్ ఆటగాళ్ల అసంతృప్తి

థర్డ్ అంపైర్ నిర్ణయం అఫ్గానిస్థాన్-ఎ ఆటగాళ్లను ఆశ్చర్యానికి గురిచేసింది. క్యాచ్ స్పష్టంగా పట్టినట్లే కనిపిస్తోందని భావించిన వారు ఫీల్డ్ అంపైర్ల వద్దకు వెళ్లి వివరణ కోరారు. బంతి నేలను తాకినట్లు కనిపించడమే నాటౌట్ నిర్ణయానికి కారణమని అంపైర్లు వెల్లడించారు. దీంతో అఫ్గాన్ ఆటగాళ్లు నిరాశ వ్యక్తం చేస్తూ తమ స్థానాలకు వెళ్లిపోయారు. ఈ ఘటన అనంతరం సోషల్ మీడియాలో కూడా తీవ్ర చర్చ మొదలైంది. చాలామంది అభిమానులు థర్డ్ అంపైర్ నిర్ణయాన్ని తప్పుబడుతూ పోస్టులు చేయగా, మరికొందరు మాత్రం వీడియోలో స్పష్టత లేకపోవడంతో బ్యాటర్‌కు అనుకూలంగా నిర్ణయం ఇవ్వడం సహజమని అభిప్రాయపడ్డారు.

Advertisement

వివరాలు

రెండు లైఫ్‌లు దక్కినా...

ఈ వివాదాస్పద నిర్ణయంతో వైభవ్ సూర్యవంశీకి కీలకమైన తొలి లైఫ్ లభించింది. అప్పటికి అతడు ఖాతా కూడా తెరవలేదు. అనంతరం మరోసారి అదృష్టం కలిసిరావడంతో రెండో అవకాశం కూడా దక్కింది. అయితే వచ్చిన రెండు అవకాశాలను పూర్తిగా సద్వినియోగం చేసుకోలేకపోయిన వైభవ్, 38 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఔటయ్యాడు. ఫరీదూన్ దావూద్జాయ్ బౌలింగ్‌లో షాట్ ఆడిన అతడు, ఖాలిద్ తనీవాల్‌కు సులభ క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు.

Advertisement

వివరాలు

వైభవ్‌పై భారీ అంచనాలు

కేవలం 15 ఏళ్ల వయసులోనే వైభవ్ సూర్యవంశీ భారత క్రికెట్‌లో సంచలనంగా మారాడు. ఐపీఎల్-2026 సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ తరఫున 776 పరుగులు సాధించి దేశవ్యాప్తంగా గుర్తింపు పొందాడు. ప్రపంచ స్థాయి బౌలర్లను ధైర్యంగా ఎదుర్కొంటూ తన ప్రతిభను చాటడంతో అతడి ప్రతి ఇన్నింగ్స్‌పై అభిమానుల్లో భారీ ఆసక్తి నెలకొంది. ఇటీవల శ్రీలంక-ఎతో జరిగిన మ్యాచ్ అనంతరం ఓ శ్రీలంక ఆటగాడితో జరిగిన ఘర్షణ కారణంగా కూడా వైభవ్ వార్తల్లో నిలిచాడు. ఇప్పుడు థర్డ్ అంపైర్ వివాదం మరోసారి అతడిని సోషల్ మీడియా, క్రికెట్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మార్చింది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

వైరల్ అవుతున్న వీడియో ఇదే

Advertisement