NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / క్రీడలు వార్తలు / IPL 2025: మాకు అన్యాయం జరిగింది... ఐపీఎల్ అధికారులపై మండిపడ్డ కోల్‌కతా
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    IPL 2025: మాకు అన్యాయం జరిగింది... ఐపీఎల్ అధికారులపై మండిపడ్డ కోల్‌కతా
    మాకు అన్యాయం జరిగింది... ఐపీఎల్ అధికారులపై మండిపడ్డ కోల్‌కతా

    IPL 2025: మాకు అన్యాయం జరిగింది... ఐపీఎల్ అధికారులపై మండిపడ్డ కోల్‌కతా

    వ్రాసిన వారు Jayachandra Akuri
    May 21, 2025
    05:05 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ప్లే ఆఫ్స్ నేపథ్యంలో ఐపీఎల్ మ్యాచ్‌లకు అదనపు గంట సమయం కేటాయించిన విషయం తెలిసిందే. వర్షం వల్ల కీలకమైన మ్యాచ్‌లు రద్దుకాకుండా ఉండేందుకే బీసీసీఐ ఈ కొత్త నిబంధన తీసుకొచ్చింది.

    అయితే ఈ నిర్ణయం ఆలస్యంగా తీసుకున్నందుపైన కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది.

    ఐపీఎల్ పునఃప్రారంభం సమయంలోనే ఈ మార్పు ఎందుకు చేయలేకపోయారని కోల్‌కతా సీఈఓ వెంకీ మైసూర్ ప్రశ్నించారు.

    ఈ అంశంపై ఐపీఎల్ సీఓఓ హేమంగ్ అమిన్‌కు వెంకీ మైసూర్ ఈమెయిల్ పంపారు. "నిబంధనల మార్పు సమయానికి తీసుకురావాల్సింది.

    సీజన్ మధ్యలో మార్పులు అవసరమవచ్చు కానీ స్థిరత్వం అవసరమని ఆయన పేర్కొన్నారు.

    Details

    ఆర్సీబీ-కోల్‌కతా మ్యాచ్ రద్దు 

    భారత్-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతల కారణంగా వాయిదా పడిన ఐపీఎల్ మే 17 నుంచి తిరిగి ప్రారంభమైంది.

    అదే రోజు కోల్‌కతా, ఆర్సీబీ మధ్య చిన్నస్వామి స్టేడియంలో జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దు అయింది.

    వర్షం తీవ్రతతో టాస్ కూడా పడకుండానే మ్యాచ్ రద్దయింది.

    కనీసం ఐదు ఓవర్లు కూడా జరగలేదని పేర్కొన్న వెంకీ.. అప్పుడే అదనపు గంట సమయం ఉండే నిబంధన అమలులో ఉండి ఉంటే, మ్యాచ్ పూర్తికావచ్చుందని అభిప్రాయపడ్డారు.

    Details

    ఎక్స్‌ట్రా టైమ్ నిర్ణయం ఆలస్యమా?

    మే 15నుంచి వర్ష సూచన ఉందని తెలిసినప్పటికీ బీసీసీఐ ముందస్తుగా స్పందించలేదు. మా మ్యాచ్ ఆర్సీబీతో ప్లే ఆఫ్స్‌ రేసులో కీలకమైనది.

    వర్షం కారణంగా అది రద్దయ్యింది. మే 20 నుంచి ఎక్స్‌ట్రా టైమ్ అమలులోకి తెచ్చారు. అదే ముందే అమలు చేసినా మా నష్టం తలాలేదేమో" అంటూ వెంకీ అసహనం వ్యక్తం చేశారు.

    Details

    ఇతర జట్ల నుంచి కూడా వ్యతిరేకత

    కేవలం కోల్‌కతా మాత్రమే కాకుండా, మరికొన్ని జట్లు కూడా ఈ సీజన్ మధ్యలో తీసుకొచ్చిన నిబంధనల మార్పుపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి.

    ఈ వివాదం నేపథ్యంలో నిబంధనలపై స్పష్టత, సమచిత సమయాన నిర్ణయాలపై బీసీసీఐపై ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది.

    కోల్‌కతా జట్టు తమ చివరి లీగ్ మ్యాచ్‌లో మే 25న సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను ఎదుర్కోనుంది.

    ప్లే ఆఫ్స్ ఆశలు ముగిసినప్పటికీ.. ఈ వివాదం మరికొన్ని రోజులు చర్చనీయాంశంగా ఉండేలా కనిపిస్తోంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఐపీఎల్

    తాజా

    IPL 2025: మాకు అన్యాయం జరిగింది... ఐపీఎల్ అధికారులపై మండిపడ్డ కోల్‌కతా ఐపీఎల్
    Bengaluru: బెంగళూరులో దారుణం.. సూట్‌కేస్‌లో మహిళ మృతదేహం లభ్యం.. బెంగళూరు
    Team india: ఇంగ్లాండ్ టూర్‌కు ముందు కీలక నిర్ణయం.. కెప్టెన్ ఎవరో తేలేది ఆ రోజే! భారత జట్టు
    Nambala Kesava Rao: ఛత్తీస్‌గఢ్‌లో ఎన్‌కౌంటర్.. మావోయిస్టు అగ్ర నేత నంబాల కేశవరావు మృతి  ఛత్తీస్‌గఢ్

    ఐపీఎల్

    CSK vs PBKS : చెన్నై వర్సెస్ పంజాబ్.. ఇవాళ 5 రికార్డులు బద్దలయ్యే అవకాశం! చైన్నై సూపర్ కింగ్స్
    IPL 2025: ప్లేఆఫ్స్ రేసు.. ఎవరు ముందో, వెనుకో తెలుసా? ముంబయి ఇండియన్స్
    Maxwell: పంజాబ్ కింగ్స్‌కు గట్టి ఎదురుదెబ్బ.. ఐపీఎల్‌కు మాక్స్‌వెల్  దూరం  క్రీడలు
    GT vs SRH: గుజరాత్ గెలుపు.. సన్‌రైజర్స్‌కు ఏడో ఓటమి క్రీడలు
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025