Page Loader
Bus Accident: నార్త్ మేరీల్యాండ్‌లో బస్సు ప్రమాదం.. ఒకరు మృతి,23 మందికి గాయాలు
నార్త్ మేరీల్యాండ్‌లో బస్సు ప్రమాదం.. ఒకరు మృతి,23 మందికి గాయాలు

Bus Accident: నార్త్ మేరీల్యాండ్‌లో బస్సు ప్రమాదం.. ఒకరు మృతి,23 మందికి గాయాలు

వ్రాసిన వారు Sirish Praharaju
May 06, 2024
09:45 am

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికాలోని నార్త్ మేరీల్యాండ్‌లోని ఇంటర్‌స్టేట్ 95లో ఆదివారం జరిగిన బస్సు ప్రమాదంలో ఒకరు మరణించారు. అలాగే ఈ ప్రమాదంలో మరో 23 మంది గాయపడ్డారు. బస్సులో 24 మంది ప్రయాణిస్తున్నట్లు మేరీల్యాండ్ స్టేట్ పోలీసులు తెలిపారు. ఉదయం 6 గంటల సమయంలో, హార్ఫోర్డ్ కౌంటీలోని I-95లో అదుపు తప్పి గార్డ్‌రైల్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఓ ప్రయాణికుడు అక్కడికక్కడే మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. గాయపడిన డ్రైవర్‌తో పాటు మరో 22 మంది ప్రయాణికులను ఆసుపత్రికి తరలించారు. విచారణ కోసం I-95 నార్త్‌బౌండ్ లేన్‌లు మూసివేశారు.అయితే మళ్ళీ ఆ లేన్ పోలీసులు తెలిపారు. ఇప్పటివరకు ఎటువంటి అభియోగాలు నమోదు చేయలేదు.

Details 

సౌత్ కరోలినా రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం

మేరీల్యాండ్ స్టేట్ పోలీస్ క్రాష్ టీమ్ విచారణకు నాయకత్వం వహిస్తోంది.బస్సు ఎక్కడి నుంచి వచ్చింది, ఎక్కడికి వెళుతోంది అనే అంశాలతో పాటు ప్రమాదంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. బాల్టిమోర్‌కు ఉత్తరాన దాదాపు 55ను తెరిచినట్లు కిలోమీటర్ల దూరంలో హార్‌ఫోర్డ్ కౌంటీ ఉంది. ఏప్రిల్ 27న అమెరికాలోని సౌత్ కరోలినా రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఇందులో ముగ్గురు భారతీయ మహిళలు మరణించారు. సమాచారం ప్రకారం, ప్రమాదంలో మరణించిన ముగ్గురు మహిళలు గుజరాత్‌లోని ఆనంద్ జిల్లాకు చెందినవారు. వారిని రేఖాబెన్ పటేల్, సంగీతాబెన్ పటేల్, మనీషాబెన్ పటేల్‌గా గుర్తించారు. ముగ్గురు మహిళలు ఎస్‌యూవీలో అత్యంత వేగంతో ప్రయాణిస్తున్న భారతీయులే.