NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / అంతర్జాతీయం వార్తలు / నేపాల్‌ విమాన ప్రమాదం: ఐదుగురు భారతీయులు సహా 15మంది విదేశీ ప్రయాణికులు దుర్మరణం
    తదుపరి వార్తా కథనం
    నేపాల్‌ విమాన ప్రమాదం: ఐదుగురు భారతీయులు సహా 15మంది విదేశీ ప్రయాణికులు దుర్మరణం
    ఐదుగురు భారతీయులు సహా 15మంది విదేశీ ప్రయాణికులు దుర్మరణం

    నేపాల్‌ విమాన ప్రమాదం: ఐదుగురు భారతీయులు సహా 15మంది విదేశీ ప్రయాణికులు దుర్మరణం

    వ్రాసిన వారు Stalin
    Jan 16, 2023
    09:45 am

    ఈ వార్తాకథనం ఏంటి

    నేపాల్‌లో ఘోర విమాన ప్రమాదం జరిగింది. 72మంది ప్రయాణిస్తున్న నేపాల్ రాజధాని ఖాట్మండు నుంచి పొఖారాకు వెళ్తున్న యతి ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం కుప్పకూలింది. అయితే ఈ ప్రమాదంలో ఐదుగురు భారతీయులు సహా 15మంది విదశీయులు మరణించినట్లు నేపాల్ పౌర విమానయాన అథారిటీ ధృవీకరించింది.

    విమానంలో ఉన్న 72మందిలో ఇప్పటి వరకు మృతి చెందిన వారి సంఖ్య 68కి చేరినట్లు పేర్కొంది. విమాన ప్రమాదం నుంచి ఎవరైనా ప్రాణాలతో బయట పడ్డారా? లేదా? అనే దానిపై ఇంకా స్పష్టత లేదని యతి ఎయిర్‌లైన్స్‌ పేర్కొంది.

    నేపాల్

    సోమవారం జాతీయ సంతాప దినంగా ప్రకటించిన నేపాల్

    విమాన ప్రమాదం నేపథ్యంలో సహాయక చర్యలను ముమ్మరం చేశారు. ఈ ఘటనపై నేపాల్ ప్రభుత్వం తీవ్ర విచారం వ్యక్తం చేసింది. సోమవారాన్ని జాతీయ సంతాప దినంగా ప్రకటించింది. ఈ ప్రమాదంపై విచారణ జరిపించేందుకు నేపాల్ ప్రభుత్వం ఒక కమిటీని కూడా వేసింది.

    మరో 5 నిమిషాల్లో గమ్యం చేరనున్న క్రమంలో విమానం ప్రమాదానికి గురికావడం బాధాకరం. అయితే విమానం కూలే క్రమంలో రికార్డు అయినట్లుగా చెబుతున్న ఓ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. నియంత్రణ కోల్పోయి.. గాలిలో తిరుగుతూ.. అది భూమిని తాకడంతో భారీ శబ్ధం వచ్చినట్లు ఆ వీడియోలో వినబడుతుంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    విమానం

    తాజా

    Shashi Tharoor: చైనా ఎంత కాపాడినా.. టీఆర్‌ఎఫ్‌ను వదిలిపెట్టం: శశిథరూర్‌ శశిథరూర్
    Pakistan Spy: పంజాబ్‌లో పాకిస్తాన్ గూఢచారి అరెస్ట్.. ఆపరేషన్ సిందూర్ సమయంలో సున్నిత సమాచారం చేరవేత.. పంజాబ్
    Canara Bank: కర్ణాటకలో కెనరా బ్యాంకులో భారీ దోపిడీ.. 59 కిలోల బంగారం గల్లంతు! కర్ణాటక
    Stock Market : నష్టాల్లో ట్రేడవుతున్న దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు స్టాక్ మార్కెట్

    విమానం

    NOTAMలో సమస్య వలన అమెరికా అంతటా ఆగిపోయిన కొన్ని వేల విమానాలు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా/ యూఎస్ఏ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025