LOADING...
US Strikes: ఒకప్పుడు 290 మంది.. ఇప్పుడు ముగ్గురు భారతీయులు.. గల్ఫ్‌లో అమెరికా చర్యలపై పెరుగుతున్న ఆందోళన
ఒకప్పుడు 290 మంది.. ఇప్పుడు ముగ్గురు భారతీయులు.. గల్ఫ్‌లో అమెరికా చర్యలపై పెరుగుతున్న ఆందోళన

US Strikes: ఒకప్పుడు 290 మంది.. ఇప్పుడు ముగ్గురు భారతీయులు.. గల్ఫ్‌లో అమెరికా చర్యలపై పెరుగుతున్న ఆందోళన

వ్రాసిన వారు Moogati Shabari
Jun 13, 2026
12:29 pm

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికా దాడుల్లో ముగ్గురు భారతీయులు మృతి.. 1988లో ఆకాశం నుంచి కూలిపోయిన విమానంలో మరో 290 మంది ప్రాణాలు కోల్పోయిన ఘటన మళ్లీ చర్చలోకి వచ్చింది. 1988 జూలైలో పర్షియన్ గల్ఫ్ ప్రాంతం యుద్ధ వాతావరణంలో ఉంది. హోర్ముజ్ జలసంధి సమీపంలో అమెరికా నౌకాదళానికి చెందిన ఓ యుద్ధ నౌక, ఇరాన్ గన్‌బోట్లతో కాల్పుల్లో నిమగ్నమై ఉంది. అదే సమయంలో రాడార్ స్క్రీన్‌పై ఒక కొత్త విమానం కనిపించింది. ఆ విమానం వేగంగా సమీపిస్తోంది. అది మిత్రదేశానికి చెందినదా? శత్రు విమానమా? ప్రయాణికుల విమానమా? లేక యుద్ధ విమానమా? అనే విషయంలో నిర్ణయం తీసుకోవడానికి ఆపరేటర్లకు కేవలం కొన్ని నిమిషాల సమయం మాత్రమే ఉంది.

వివరాలు

ఆ ఘటనలో 290 మంది మృతి..

హెచ్చరికలు పంపించినప్పటికీ ఆ విమానం తన ప్రయాణాన్ని కొనసాగించింది. దూరం మరింత తగ్గింది. చివరికి ఆదేశాలు జారీ అయ్యాయి. అమెరికా నౌకాదళానికి చెందిన యూఎస్‌ఎస్ విన్సెన్స్ (USS Vincennes) నుంచి రెండు క్షిపణులు ప్రయోగించబడ్డాయి. కొద్ది క్షణాల్లోనే ఇరాన్ ఎయిర్ ఫ్లైట్ 655లో ప్రయాణిస్తున్న 290 మంది ప్రాణాలు కోల్పోయారు. దాదాపు నాలుగు దశాబ్దాల తర్వాత, గల్ఫ్ ప్రాంత జలాలు మరోసారి అమెరికా సైన్యం, మధ్యలో చిక్కుకున్న సాధారణ పౌరులతో కూడిన ఘర్షణలకు వేదికగా మారాయి.

వివరాలు

అమాయకుల ప్రాణాలు బలి..

ఈ వారం ఒమన్ తీరానికి సమీపంలో భారతీయ సిబ్బందితో ప్రయాణిస్తున్న మూడు వాణిజ్య నౌకలపై అమెరికా నౌకాదళం దాడులు జరిపిందని భారత్ బహిరంగంగా ఆరోపించింది. ఈ ఘటనల్లో ముగ్గురు భారతీయ నావికులు మరణించగా, మరో ట్యాంకర్ పనిచేయకుండా పోయింది. ఈ విషయంపై న్యూఢిల్లీ రెండు రోజుల వ్యవధిలో రెండుసార్లు అమెరికా రాయబార కార్యాలయ ప్రతినిధిని పిలిపించి, పౌర నౌకలపై "ప్రాణాంతక శక్తి" వినియోగించడంపై తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. ముగ్గురు భారతీయ నావికుల మరణంతో, గల్ఫ్ ప్రాంతంలో అమెరికా సైనిక చర్యల సందర్భంగా దశాబ్దాలుగా వినిపిస్తున్న ఒక ప్రశ్న మళ్లీ ముందుకు వచ్చింది. అమాయక పౌరుల ప్రాణాలు బలైతే దానికి బాధ్యత ఎవరిది?

Advertisement

వివరాలు

యుద్ధ నౌక కూల్చివేత..

చాలా మంది ఇరానీయులకు ఆ ప్రశ్నకు సమాధానం 1988 జూలై 3న లభించింది. టెహ్రాన్ నుంచి దుబాయ్‌కు వెళ్తున్న ఇరాన్ ఎయిర్ ఫ్లైట్ 655, బందర్ అబ్బాస్‌లో ఆగిన తర్వాత బయలుదేరగా, అమెరికా నౌకాదళంలోని అత్యాధునిక యుద్ధ నౌకల్లో ఒకటి దానిని కూల్చివేసింది. ఆ విమానంలో ఉన్న 274 మంది ప్రయాణికులు, 16 మంది సిబ్బంది సహా మొత్తం 290 మంది మరణించారు. అది ఇరాన్‌లోని బందర్ అబ్బాస్ నుంచి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లోని దుబాయ్‌కు షెడ్యూల్ ప్రకారం నడిచే సాధారణ పౌర విమానం. ఎయిర్‌బస్ ఏ300 విమానం ఆ సర్వీస్‌ను నిర్వహిస్తోంది.

Advertisement

వివరాలు

మరోసారి ఆ ఘటనపై చర్చ..

సైనిక చర్యల కారణంగా పౌర విమానం పొరపాటున కూల్చివేయబడిన ఘటనల్లో ఇది అత్యంత ఘోరమైన వాటిలో ఒకటిగా నిలిచింది. అలాగే ఆధునిక అమెరికా సైనిక చరిత్రలో అత్యంత వివాదాస్పద ఘటనలలో ఇదొకటిగా ఇప్పటికీ గుర్తించబడుతోంది. ఇప్పుడు ఒమన్ సమీపంలో అమెరికా సైనిక చర్యల్లో ముగ్గురు భారతీయులు మరణించిన ఘటనపై భారత్ సమాధానాలు కోరుతున్న వేళ, ఇరాన్ ఎయిర్ ఫ్లైట్ 655 ఘటన మరోసారి చర్చనీయాంశంగా మారింది.

వివరాలు

భారత్ తీవ్ర నిరసన..

గల్ఫ్ ఆఫ్ ఒమన్ ప్రాంతంలో భారతీయ నావికులతో ప్రయాణిస్తున్న వాణిజ్య నౌకలపై అమెరికా నౌకాదళం వరుస దాడులు కొనసాగిస్తోందని పేర్కొన్నారు. దానిని చెబుతూ విదేశాంగ మంత్రిత్వ శాఖ శుక్రవారం అమెరికా ఛార్జ్ డి అఫైర్స్ జేసన్ మీక్స్ ను పిలిపించింది. ఈ అంశంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఇప్పటికే ఈ దాడుల కారణంగా ముగ్గురు భారతీయులు ప్రాణాలు కోల్పోయారని పేర్కొన్న మంత్రిత్వ శాఖ, ఈ ఘటనలపై గట్టి నిరసన నమోదు చేసినట్లు తెలిపింది. పౌర నౌకలపై ప్రాణాంతక శక్తి వినియోగం అంగీకారయోగ్యం కాదని స్పష్టం చేసింది. ఇలాంటి చర్యలు అంతర్జాతీయ సముద్ర వాణిజ్య భద్రతకు, స్థిరత్వానికి ముప్పుగా మారతాయని హెచ్చరించింది.

వివరాలు

ఆ నౌకలపై దాడి..

కేంద్ర ప్రభుత్వం వెల్లడించిన వివరాల ప్రకారం, ఈ వారం భారతీయ సిబ్బందితో ప్రయాణిస్తున్న మూడు నౌకలు దాడులకు గురయ్యాయి. మొదటి నౌక పలావు జెండాతో ప్రయాణిస్తున్న మారివెక్స్ ట్యాంకర్. ఇందులో 24 మంది భారతీయ నావికులు ఉన్నారు. జూన్ 8న అమెరికా బలగాల చర్యల వల్ల నౌక పనిచేయకుండా పోయింది. అయితే సిబ్బంది అంతా సురక్షితంగా బయటపడ్డారు. రెండో నౌక పలావు జెండాతోనే ప్రయాణిస్తున్న సెట్టెబెల్లో ట్యాంకర్. జూన్ 10న దీనిపై దాడి జరిగింది. ఇందులో ఉన్న 24 మంది భారతీయ నావికుల్లో ముగ్గురు మరణించారు. మూడో నౌక జలవీర్. గినియా-బిస్సావు జెండాతో ప్రయాణిస్తున్న ఈ ట్యాంకర్‌లో 20 మంది భారతీయ సిబ్బంది ఉన్నారు. గురువారం ఈ నౌక కూడా దాడికి గురైంది.

Advertisement