NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / అంతర్జాతీయం వార్తలు / Nigeria :నైజీరియాలో ట్రక్కును ఢీకొన్న ఇంధన ట్యాంకర్.. 48 మంది మృతి 
    తదుపరి వార్తా కథనం
    Nigeria :నైజీరియాలో ట్రక్కును ఢీకొన్న ఇంధన ట్యాంకర్.. 48 మంది మృతి 
    నైజీరియాలో ట్రక్కును ఢీకొన్న ఇంధన ట్యాంకర్.. 48 మంది మృతి

    Nigeria :నైజీరియాలో ట్రక్కును ఢీకొన్న ఇంధన ట్యాంకర్.. 48 మంది మృతి 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Sep 09, 2024
    08:38 am

    ఈ వార్తాకథనం ఏంటి

    నైజీరియాలో ఆదివారం ఇంధన ట్యాంకర్ ప్రమాదం సంభవించి 48 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ వివరాలను నైజర్ స్టేట్ అత్యవసర సేవల ఏజెన్సీ వెల్లడించింది.

    ఏజెన్సీ డైరెక్టర్ జనరల్ అబ్దుల్లాహి బాబా-అరబ్ మాట్లాడుతూ, ఈ ప్రమాదం ఉత్తర-మధ్య నైజర్ రాష్ట్రంలోని అగాయ్ ప్రాంతంలో చోటు చేసుకుంది. ఇంధన ట్యాంకర్ ఒక ట్రక్కును ఢీకొనడంతో భారీ పేలుడు సంభవించి, ఆ ప్రాంతంలో కనీసం 50 పశువులు సజీవ దహనం అయ్యాయి. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు.

    మొత్తం 50 పశువులు సజీవ దహనం కావడాన్ని బాబా-అరబ్ ధృవీకరించారు. ఘటనా స్థలంలో సెర్చ్ అండ్ రెస్క్యూ చర్యలు కొనసాగుతున్నాయని చెప్పారు.

    వివరాలు 

    ప్రమాదంతో ప్రజలలో ఆందోళన

    మొదట 30 మృతదేహాలు బయటకు తీశామని, ఆ తరువాత మరో 18 మృతదేహాలు బయటపడినట్లు పేర్కొన్నారు.

    మృతులను సామూహికంగా ఖననం చేసినట్లు తెలిపారు. ఈ ప్రమాదంతో ప్రజలలో ఆందోళన పెరగడంతో నైజర్ గవర్నర్ మహమ్మద్ బాగో, ప్రజలను ప్రశాంతంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు.

    ట్రాఫిక్ నియమాలను కచ్చితంగా పాటించి, భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు.

    నైజీరియాలో ఇటువంటి ప్రమాదాలు తరచూ జరుగుతుండటం ఆందోళనకరం. రవాణా కోసం సమర్థవంతమైన రైల్వే వ్యవస్థ లేకపోవడంతో, ఆఫ్రికాలో అత్యధిక జనాభా కలిగిన ఈ దేశంలో ప్రాణాంతక ట్రక్కు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి.

    2020లో నైజీరియాలో 1531 గ్యాసోలిన్ ట్యాంకర్ ప్రమాదాలు నమోదయ్యాయి, వీటిలో 535 మంది మరణించగా, 1142 మంది గాయపడ్డారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    నైజీరియా

    తాజా

    Google Chrome: కంప్యూటర్‌లో క్రోమ్ వాడే వారికి కేంద్రం హెచ్చరిక  గూగుల్
    Bill Gates:టెక్నాలజీతో పాటు పాలనకు మార్గదర్శి చంద్రబాబు : బిల్ గేట్స్ ప్రశంసలు చంద్రబాబు నాయుడు
    Operation Sindoor: భారత్‌ పూర్తిస్థాయిలో దాడి చేస్తే పాక్‌కు పారిపోవడం తప్ప మరో అవకాశం లేదు: ఆర్మీ ఎయిర్‌డిఫెన్స్‌ డీజీ భారతదేశం
    Motivation: తలవంచిన రోజు ఉంటే.. తలెత్తే రోజు కూడా తప్పకుండా వస్తుంది! జీవనశైలి

    నైజీరియా

    నైజీరియా: నదిలో పడవ బోల్తా పడి 103 మంది మృతి  తాజా వార్తలు
    నైజీరియా: బందిపోట్ల ఆకస్మిక దాడిలో 26 మంది సైనికులు మృతి  ఆర్మీ
    Nigeria Attack News : నైజీరియాలో ముష్కరుల దాడి: 40 మంది హత్య  అంతర్జాతీయం
    Nigeria: నైజీరియాలో ఆత్మాహుతి దాడులు.. 19 మంది దుర్మరణం.. మహిళా ఆత్మాహుతి దళాల పనే  అంతర్జాతీయం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025