NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / అంతర్జాతీయం వార్తలు / Earthquake: పాకిస్తాన్‌లో 5.8 తీవ్రతతో భూకంపం.. వణికిన ఢిల్లీ-ఎన్‌సిఆర్‌ 
    తదుపరి వార్తా కథనం
    Earthquake: పాకిస్తాన్‌లో 5.8 తీవ్రతతో భూకంపం.. వణికిన ఢిల్లీ-ఎన్‌సిఆర్‌ 

    Earthquake: పాకిస్తాన్‌లో 5.8 తీవ్రతతో భూకంపం.. వణికిన ఢిల్లీ-ఎన్‌సిఆర్‌ 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Sep 11, 2024
    02:08 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    పాకిస్థాన్‌లో భూకంపం సంభవించింది. ఈ భూకంపం దేశంలోని ఉత్తర ప్రాంతాలను తీవ్రంగా వణికించింది.

    ఈ విపత్తు వల్ల ఇప్పటి వరకు ప్రాణ నష్టం గురించి ఎలాంటి సమాచారం అందలేదు, కానీ భారీ ఆస్తి నష్టం జరిగి ఉంటుందని భావిస్తున్నారు.

    ఈ భూకంపం ప్రభావం భారత్‌లోనూ కనిపించింది, అక్కడి ఉత్తరాది రాష్ట్రాల్లో స్వల్ప భూకంపాలు నమోదయ్యాయి.

    పాకిస్తాన్‌లో నమోదైన భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.8గా నమోదు అయింది.

    ఈ భూకంపం మధ్యాహ్నం 12:58 నిమిషాలకు సంభవించినట్లు నేషనల్ సెస్మాలజీ సెంటర్, యునైటెడ్ స్టేట్స్ జియాలాజికల్ సర్వే తెలిపాయి.

    31.25 అక్షాంశం, 70.52 రేఖాంశం వద్ద ప్రకంపనలు నమోదైనట్లు వివరించాయి.

    వివరాలు 

    ప్రాణ నష్టం జరిగినట్లు సమాచారం లేదు 

    ఈ భూకంపం పాకిస్తాన్‌లోని ముల్తాన్ సిటీకి ఈశాన్య దిశలో 148 కిలోమీటర్ల దూరంలో ఉన్న కరోర్ లాల్ ఈసాన్ ప్రాంతాన్ని కేంద్రంగా కలిగింది.

    భూమి ఉపరితలానికి 10కిలోమీటర్ల లోతులో ఫలక కదలికల కారణంగా ఈ భూకంపం సంభవించిందని నేషనల్ సెస్మాలజీ సెంటర్ వివరించింది.

    ఇప్పటివరకు ప్రాణ నష్టం జరిగినట్లు ఎలాంటి సమాచారం లేకపోయినా,ఆస్తి నష్టం జరిగిందని సమాచారం.

    కరోర్ లాల్,లెయ్యా,డేరా ఇస్మాయిల్ ఖాన్, ఫతేపూర్, ఖాజియాబాద్, బస్తీ సర్ఘాని వంటి ప్రాంతాల్లో కొన్ని ఇళ్ళు దెబ్బతిన్నట్లు సమాచారం.

    భూకంపం సమయంలో స్థానికులు తమ నివాసాలు, కార్యాలయాలు, షాపులను ఖాళీ చేసి భయంతో బయటకు పరుగులు తీశారు.

    భూకంపం తరువాత కూడా స్వల్ప ప్రకంపనలు కొనసాగడంతో ప్రజలు తిరిగి లోనికి వెళ్లడానికి భయపడ్డారు.

    వివరాలు 

    భూకంపం ప్రభావం భారత్‌లో..

    ఈ భూకంపం ప్రభావం భారత్‌లో కూడా కనిపించింది. జమ్మూ కాశ్మీర్, ఢిల్లీ-ఎన్‌సీఆర్, ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్, నొయిడా, హర్యానాలోని గుర్గావ్, పంజాబ్, రాజస్థాన్‌లలో స్వల్ప ప్రకంపనలు నమోదయ్యాయి.

    ఈ ప్రాంతాల ప్రజలు కూడా భయాందోళనకు గురయ్యారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    భూకంపం
    పాకిస్థాన్

    తాజా

    ChatGPT: చాట్‌జీపీటీలో నిమిషాల్లో కోడింగ్‌, బగ్స్‌ ఫిక్స్‌ చేసే ఏఐ టూల్ చాట్‌జీపీటీ
    IPL 2025: నేటి నుంచే ఐపీఎల్ పునఃప్రారంభం.. ఆర్సీబీ, కేకేఆర్ మధ్య హోరాహోరీ పోటీ! ఐపీఎల్
    Rains: నేడు ఏపీలో అక్కడక్కడ భారీ వర్షాలు.. వాతావరణ శాఖ హెచ్చరిక ఆంధ్రప్రదేశ్
    Gayatri : ప్రముఖ గాయని కన్నుమూత అస్సాం/అసోం

    భూకంపం

    Earthquake : లద్దాఖ్ లో భూకంపం..రిక్టర్ స్కేల్ పై 4.4గా నమోదు భారతదేశం
    Earthquake: ఫిలిప్పీన్స్‌లో 6.7 తీవ్రతతో భారీ భూకంపం..ఊగిపోయిన బిల్డింగ్స్ ప్రపంచం
    Earthquake: మహారాష్ట్రలో భారీ భూకంపం.. తెలంగాణ, కర్ణాటకలో ప్రకంపనలు  మహారాష్ట్ర
    Earthquake: ఫిలిప్పీన్స్‌లో 7.5తీవ్రతతో భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ  ఫిలిప్పీన్స్

    పాకిస్థాన్

    Pakistan Elections: పాకిస్థాన్ ఎన్నికల్లో రిగ్గింగ్.. రీ పోలింగ్‌కు ఎన్నికల సంఘం నిర్ణయం తాజా వార్తలు
    Pakistan election: నవాజ్ షరీఫ్‌, బిలావల్ భుట్టో మధ్య కుదిరిన ఒప్పందం.. ప్రభుత్వ ఏర్పాటుకు ప్రయత్నాలు  ఎన్నికలు
    Pakistan new PM: పాకిస్థాన్ కొత్త ప్రధానిగా నవాజ్ తమ్ముడు షాబాజ్ షరీఫ్ ప్రధాన మంత్రి
    Pakistan: పాకిస్థాన్‌లో అండర్ వరల్డ్ డాన్ అమీర్ బాలాజ్ టిప్పు హతం  హత్య
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025