NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    NewsBytes Telugu
    English Hindi Tamil
    NewsBytes Telugu

    భారతదేశం బిజినెస్ అంతర్జాతీయం క్రీడలు టెక్నాలజీ సినిమా ఆటోమొబైల్స్ లైఫ్-స్టైల్ కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
     
    హోమ్ / వార్తలు / అంతర్జాతీయం వార్తలు / లండన్‌లో ఖలిస్థానీ మద్దతుదారుల వీరంగం; త్రివర్ణ పతాకాన్ని అగౌరవపర్చేందుకు విఫలయత్నం
    అంతర్జాతీయం

    లండన్‌లో ఖలిస్థానీ మద్దతుదారుల వీరంగం; త్రివర్ణ పతాకాన్ని అగౌరవపర్చేందుకు విఫలయత్నం

    లండన్‌లో ఖలిస్థానీ మద్దతుదారుల వీరంగం; త్రివర్ణ పతాకాన్ని అగౌరవపర్చేందుకు విఫలయత్నం
    వ్రాసిన వారు Naveen Stalin
    Mar 20, 2023, 12:57 pm 1 నిమి చదవండి
    లండన్‌లో ఖలిస్థానీ మద్దతుదారుల వీరంగం; త్రివర్ణ పతాకాన్ని అగౌరవపర్చేందుకు విఫలయత్నం
    భారత జాతీయ జెండాను అగౌరవపర్చేందుకు లండన్‌లో ఖలిస్థానీ మద్దతుదారులు విఫలయత్నం

    ఖలిస్థానీ సానుభూతిపరుడు, 'వారిస్ పంజాబ్ దే' చీఫ్ అమృతపాల్ సింగ్ అరెస్టు కోసం పంజాబ్ ప్రభుత్వం చేపట్టిన గాలింపునకు నిరసనగా లండన్‌లో ఆయన మద్దతుదారులు ఆందోళనకు దిగారు. లండన్‌లోని భారత హైకమిషన్ వద్ద ఖలిస్థానీ మద్దతుదారులు వీరంగం సృష్టించారు. లండన్‌లోని భారత హైకమిషన్‌పై ఎగురుతున్న త్రివర్ణ పతాకాన్ని ఓ నిరసనకారుడు తీసివేసి, దాన్ని విసిరేందుకు ప్రయత్నించాడు. ఇంతలో అప్రమత్తమైన హైకమిషన్‌లోని ఓ అధికారి భారత జాతీయ జెండాను నిరసనకారుడి నుంచి లాక్కున్నారు. అనంతరం ఆ జెండాను హైకమిషన్‌ కిటికి కట్టారు. ఆందోళనకారుల ప్రయత్నం విఫలమైనట్లు హైకమిషన్‌ అధికారులు పేర్కొన్నారు. ఈ క్రమంలో జాతీయ జెండాకు అవమానం జరగకుండా కాపాడిన అధికారిపై భారతీయులు ప్రశంసలు కురిపిస్తున్నారు.

    హైకమిషన్‌ వద్ద జరిగినపై భారత ప్రభుత్వం సీరియస్

    లండన్‌లోని భారత హైకమిషన్‌ వద్ద జరిగిన ఘటనను భారత ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. దిల్లీలోని బ్రిటన్ రాయబారికి విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సమన్లు జారీ చేసింది. భారత హైకమిషన్‌ వద్ద జరిగిన ఘటన పట్ల నిరసనను తెలిపింది. తగిన భద్రత లేకపోవడం వల్లే హైకమిషన్ ప్రాంగణంలోకి నిరసనకారులు వచ్చినట్లు దీనికి వివరణ ఇవ్వాలని బ్రిటన్ రాయబారిని డిమాండ్ చేసింది. బ్రిటన్‌లోని హైకమిషన్ ప్రాంగణం, సిబ్బంది భద్రత పట్ల యూకే ప్రభుత్వం ఉదాసీనతగా ఉండటం తగదని విదేశాంగ శాఖ ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది. నిరసనకారులను గుర్తించి, అరెస్టు చేసి, విచారించడానికి యూకే ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకుంటుందని, అలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూస్తందని ఆశిస్తున్నట్లు పేర్కొంది.

    ఈ టైమ్ లైన్ ని షేర్ చేయండి
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    భారతదేశం
    బ్రిటన్
    ఖలిస్థానీ

    భారతదేశం

    వీడియో: లేజర్ లైట్ల వెలుతురులో ధగధగ మెరిసిపోతున్న కొత్త పార్లమెంట్ బిల్డింగ్  భారతదేశం
    బరితెగిస్తున్న చైనా.. వాస్తవాధీన రేఖ వెంబడి రక్షణ గ్రామాల నిర్మాణం  చైనా
    వాతావరణ మార్పుల ఎఫెక్ట్: నీరు, విద్యుత్ సరఫరా తీవ్ర ప్రభావం; ప్రమాదంలో 16ఆసియా దేశాలు  వాతావరణ మార్పులు
    Zomato: 72% కస్టమర్లు రూ.2000 నోట్లతో చెల్లింపులు: జొమాటో  జొమాటో

    బ్రిటన్

    రిషి సునక్ అధికారిక నివాసం గేట్లను కారుతో ఢీకొట్టిన వ్యక్తి అరెస్టు  రిషి సునక్
    లండన్‌లో టిప్పు సుల్తాన్ కత్తి వేలం; రూ.143 కోట్లు పలికిన ఖడ్గం  ఇండియా లేటెస్ట్ న్యూస్
    జీ7 సదస్సు కోసం నేడు జపాన్‌కు మోదీ; ప్రధాని ఎజెండాలోని అంశాలు ఇవే  నరేంద్ర మోదీ
    ప్రధాని అత్తను అంటే ఇమ్మిగ్రేషన్ ఆఫీసర్లు నమ్మలేదు: సుధా మూర్తి  బెంగళూరు

    ఖలిస్థానీ

    అమృత్‌పాల్‌ను పట్టుకోవడంలో జప్యంపై ప్రతిపక్షాల విమర్శలు; పంజాబ్ సీఎం ఏం చెప్పారంటే! పంజాబ్
    అమృత్‌పాల్ సింగ్ లొంగిపోయాడా? పోలీసులు అరెస్టు చేశారా? ప్రత్యక్ష సాక్షి గురుద్వారా మతాధికారి ఏం చెప్పారు?  పంజాబ్
    ఎట్టకేలకు ఖలిస్థానీ నాయకుడు అమృత్‌పాల్ సింగ్‌ను అరెస్ట్  పంజాబ్
    లండన్‌కు పారిపోయేందుకు అమృత్‌పాల్ సింగ్ భార్య ప్రయత్నం; అదుపులోకి తీసుకున్న పోలీసులు పంజాబ్

    అంతర్జాతీయం వార్తలను ఇష్టపడుతున్నారా?

    అప్ డేట్ గా ఉండటానికి సబ్ స్క్రయిబ్ చేయండి.

    World Thumbnail
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2023