NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / అంతర్జాతీయం వార్తలు / Combodia: మానవ అక్రమ రవాణా ద్వారా కంబోడియాకు చేరుకున్న 300 మంది భారతీయులు అరెస్టు 
    తదుపరి వార్తా కథనం
    Combodia: మానవ అక్రమ రవాణా ద్వారా కంబోడియాకు చేరుకున్న 300 మంది భారతీయులు అరెస్టు 
    మానవ అక్రమ రవాణా ద్వారా కంబోడియాకు చేరుకున్న 300 మంది భారతీయులు అరెస్టు

    Combodia: మానవ అక్రమ రవాణా ద్వారా కంబోడియాకు చేరుకున్న 300 మంది భారతీయులు అరెస్టు 

    వ్రాసిన వారు Sirish Praharaju
    May 22, 2024
    09:42 am

    ఈ వార్తాకథనం ఏంటి

    అక్రమంగా కంబోడియాకు తీసుకెళ్లిన 300 మంది భారతీయులు మే 20న తమ చైనా హ్యాండ్లర్లపై తిరుగుబాటు చేశారని ఆంధ్రప్రదేశ్ పోలీసులు మంగళవారం తెలిపారు.

    ఆ తర్వాత వారిలో చాలా మందిని అరెస్టు చేశారు. వీరిలో 150 మంది విశాఖపట్టణంకి చెందిన వారని, ఆగ్నేయాసియాలోని కంబోడియాలో గత ఏడాది కాలంగా చిక్కుకుపోయారని పోలీసులు తెలిపారు.

    అక్కడ సైబర్ క్రైమ్‌లు, పోంజీ స్కామ్‌లకు పాల్పడేలా చైనీస్ హ్యాండ్లర్లు బలవంతం చేస్తున్నారని తెలిపారు.

    విశాఖపట్నం పోలీస్ కమిషనర్ ఎ.రవిశంకర్ మానవ అక్రమ రవాణా ద్వారా కంబోడియాకు తీసుకెళ్లిన భారతీయులు సైబర్ నేరాలకు కేంద్రంగా భావిస్తున్న జిన్‌బీ, సిహనౌక్‌విల్లే కాంపౌండ్‌లో అల్లర్లు సృష్టించారని చెప్పారు.

    Details 

    ఏజెంట్ల ద్వారా దేశవ్యాప్తంగా సుమారు 5,000 మంది కంబోడియాకు

    చాలా మంది వాట్సాప్ ద్వారా విశాఖపట్నం పోలీసులను సంప్రదించారని, వీడియోలు పంపారని చెప్పారు.

    చిక్కుకుపోయిన వ్యక్తులను తిరిగి తీసుకురావడానికి విశాఖపట్నం పోలీసులు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, సంబంధిత విభాగాలను సంప్రదించారు.

    వివిధ ఏజెంట్ల ద్వారా దేశవ్యాప్తంగా సుమారు 5,000 మందిని కంబోడియాకు పంపించారు.

    విశాఖపట్నం పోలీసులు మే 18న చుక్కా రాజేష్, ఎస్ కొండల్ రావు, ఎం.జ్ఞానేశ్వర్‌రావును మానవ అక్రమ రవాణా ఆరోపణలపై అరెస్టు చేశారు.

    నిందితులు సింగపూర్‌లో డేటా ఎంట్రీ ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ భారత్‌లోని యువతను ఆకర్షిస్తూ సైబర్ నేరాలకు పాల్పడేందుకు కంబోడియాకు పంపేవారు.

    కంబోడియాకు చేరుకున్నతర్వాత యువకులను చైనా ఆపరేటర్లు బందీలుగా తీసుకున్నారు. వారు హింసించడమే కాకుండా ,గేమ్ మోసం,స్టాక్ మార్కెట్ మోసం,ఇతర నేరాలు చేయమని బలవంతం చేశారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    విశాఖపట్టణం

    తాజా

    Google Chrome: కంప్యూటర్‌లో క్రోమ్ వాడే వారికి కేంద్రం హెచ్చరిక  గూగుల్
    Bill Gates:టెక్నాలజీతో పాటు పాలనకు మార్గదర్శి చంద్రబాబు : బిల్ గేట్స్ ప్రశంసలు చంద్రబాబు నాయుడు
    Operation Sindoor: భారత్‌ పూర్తిస్థాయిలో దాడి చేస్తే పాక్‌కు పారిపోవడం తప్ప మరో అవకాశం లేదు: ఆర్మీ ఎయిర్‌డిఫెన్స్‌ డీజీ భారతదేశం
    Motivation: తలవంచిన రోజు ఉంటే.. తలెత్తే రోజు కూడా తప్పకుండా వస్తుంది! జీవనశైలి

    విశాఖపట్టణం

     వైజాగ్ స్టీల్ ప్లాంట్ కోసం కేఏ పాల్‌తో చేతులు కలిపిన లక్ష్మీనారాయణ  వైజాగ్
    పాస్‌పోర్ట్ ఆఫీస్‌లు శనివారం కూడా తెరిచే ఉంటాయ్  ఆంధ్రప్రదేశ్
     హై స్పీడ్‌తో హైదరాబాద్-విశాఖపట్నం రహదారి నిర్మాణం; 56 కి.మీ తగ్గనున్న దూరం హైదరాబాద్
    విశాఖ చరిత్ర తెలుసుకోవాలని ఉందా? అయితే ఇది చదివేయండి వైజాగ్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025