NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / అంతర్జాతీయం వార్తలు / Alabama: అలబామాలో ముగ్గురిని చంపిన వ్యక్తి.. నైట్రోజన్ గ్యాస్ తో మరణశిక్ష.. దేశంలోని రెండోసారి   
    తదుపరి వార్తా కథనం
    Alabama: అలబామాలో ముగ్గురిని చంపిన వ్యక్తి.. నైట్రోజన్ గ్యాస్ తో మరణశిక్ష.. దేశంలోని రెండోసారి   
    అలబామాలో ముగ్గురిని చంపిన వ్యక్తి.. నైట్రోజన్ గ్యాస్ తో మరణశిక్ష

    Alabama: అలబామాలో ముగ్గురిని చంపిన వ్యక్తి.. నైట్రోజన్ గ్యాస్ తో మరణశిక్ష.. దేశంలోని రెండోసారి   

    వ్రాసిన వారు Sirish Praharaju
    Sep 27, 2024
    09:37 am

    ఈ వార్తాకథనం ఏంటి

    అమెరికాలో నైట్రోజన్‌ గ్యాస్‌ ద్వారా మరణశిక్ష అమలు చేయడం ఇటీవల పెద్ద చర్చగా మారిన విషయం తెలిసిందే.

    తాజాగా, ఈ పద్ధతిలో రెండోసారి మరణశిక్ష అమలుచేశారు. పని ప్రదేశంలో ముగ్గురిని హత్య చేసిన కేసులో నేరస్తుడిగా తేలిన మిల్లర్‌ అనే వ్యక్తికి, గురువారం (అమెరికా కాలమానం ప్రకారం) అలబామా (Alabama)లో నైట్రోజన్‌ గ్యాస్‌ ద్వారా ఈ శిక్షను అమలు చేశారు.

    అలబామాలోని దక్షిణ జైలులో మిల్లర్‌ (59) ముఖానికి అధికారులు మాస్క్‌ బిగించి, నైట్రోజన్‌ గ్యాస్‌ ప్రవేశపెట్టడం ప్రారంభించారు.

    కేవలం రెండు నిమిషాల్లోనే మిల్లర్‌ కింద పడిపోయి, ఆరు నిమిషాల తర్వాత శ్వాస విడిచాడని అధికారులు తెలిపారు. మొత్తం 8 నిమిషాల్లో ఈ శిక్ష పూర్తయిందని వెల్లడించారు.

    వివరాలు 

    కెన్నెత్‌ స్మిత్‌ పై ఈ శిక్ష అమలు

    అలబామాలో ఇదే పద్ధతిలో మరణశిక్ష అమలు చేయడం ఇది రెండోసారి. ఈ ఏడాది జనవరిలో కూడా హత్య కేసులో నేరస్తుడిగా ఉన్న కెన్నెత్‌ స్మిత్‌ (58)కి ఇదే విధానాన్ని అమలు చేశారు.

    అయితే, ఈ పద్ధతి పై పెద్ద ఎత్తున చర్చ కొనసాగుతోంది. కెన్నెత్‌ శిక్ష అమలు ముందు అతని తరఫు న్యాయవాదులు దీని వ్యతిరేకంగా పోరాడారు, కానీ కోర్టులో విజయం సాధించలేకపోయారు.

    అంతేకాక, శిక్ష అమలు అప్పుడు అతడు తీవ్రమైన నరకయాతన అనుభవించాడని మృతుడి కుటుంబ సభ్యులు ఆరోపించారు.

    వివరాలు 

    ఏంటీ మిల్లర్‌ కేసు.. 

    మిల్లర్‌ కేసు విషయంలో, 1999లో మూడు హత్యలకు పాల్పడినందుకు అతడికి మరణశిక్ష విధించారు.

    డెలివరీ ట్రక్కు డ్రైవర్‌గా పనిచేస్తున్న మిల్లర్‌ 1999 ఆగస్టు 5న తన సహచర ఉద్యోగులైన హోల్డ్‌బ్రూక్స్‌, యాన్సీలను విచక్షణారహితంగా కాల్చి చంపాడు.

    అనంతరం, అతను పూర్వ ఉద్యోగి అయిన జార్విస్‌ను కూడా హత్య చేశాడు. అతడి మానసిక స్థితి సరిగా లేకపోవడం, సహోద్యోగులు తనపై వదంతులు సృష్టిస్తున్నారని అనుమానంతో ఈ హత్యలకు పాల్పడినట్లు దర్యాప్తులో తేలింది.

    2022లో విషపూరిత ఇంజెక్షన్‌ ద్వారా మరణశిక్ష అమలు చేయాలని ప్రయత్నించగా, అతని అధిక బరువు కారణంగా నరాలు దొరక్కపోవడంతో అది విఫలమైంది. చివరికి నైట్రోజన్‌ గ్యాస్‌ ద్వారా శిక్షను అమలు చేశారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    అమెరికా

    తాజా

    Akanda 2 : అఖండ 2 విడుదలపై ఉత్కంఠ.. సంక్రాంతి కంటే ముందుగానే ప్లాన్? బాలకృష్ణ
    Apple: ఆపిల్‌కు భారత్ ఓకే.. కానీ అమెరికాలో సుంకాలు తప్పవన్న ట్రంప్ ఆపిల్
    Pak spy: పాక్‌కు సమాచారం లీక్‌.. రాజస్థాన్‌లో వ్యక్తి ఆరెస్టు రాజస్థాన్
    PBKS vs DC : పంజాబ్ కింగ్స్‌పై ఢిల్లీ క్యాపిటల్స్ విజయం ఢిల్లీ క్యాపిటల్స్

    అమెరికా

    Donald Trump: డొనాల్డ్ ట్రంప్‌ విమానం అత్యవసర ల్యాండింగ్.. త్రుటిలో తప్పిన ముప్పు డొనాల్డ్ ట్రంప్
    Donald Trump: ఈ-మెయిళ్లు హ్యాకయ్యాయి.. ఇదంతా ఇరానే పనే : ట్రంప్ ప్రచార బృందం ఇరాన్
    America: 'పెద్ద దాడికి ఇరాన్ సిద్ధమవుతోంది'... ఇజ్రాయెల్‌ను అప్రమత్తం చేసిన అమెరికా అంతర్జాతీయం
    Earthquake: అమెరికాలోని లాస్ ఏంజెల్స్‌లో భూకంపం.. రెక్టర్ స్కేల్‌పై 4.4గా నమోదు భూకంపం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025