Trump: ట్రంప్ అనుమానాల మధ్య ఖమేనీ సందేశం.. నిజంగా బ్రతికే ఉన్నారా?
ఈ వార్తాకథనం ఏంటి
పశ్చిమాసియా ప్రాంతంలో కొనసాగుతున్న యుద్ధం 30వ రోజుకు చేరుకున్న నేపథ్యంలో, ఇరాన్ అగ్రనేత మొజ్తబా ఖమేనీ చుట్టూ ఉన్న అనిశ్చితి మరింత పెరిగింది. గత కొద్ది రోజులుగా ఆయన ప్రజల ముందుకు రాకపోవడం వల్ల, ఆయన ఆరోగ్యం, ప్రాణాల గురించి అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇదిలా ఉండగా, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ విషయంపై వ్యాఖ్యానిస్తూ, మొజ్తబా ఖమేనీ పరిస్థితి సందేహాస్పదంగా ఉందని అన్నారు. "ఆయన మరణించి ఉండవచ్చు లేదా తీవ్ర అనారోగ్య పరిస్థితిలో ఉండొచ్చు. ఎందుకంటే ఇప్పటివరకు ఆయన కనిపించలేదు, ఆయన నుంచి ఎలాంటి స్పందన కూడా లేదు," అని ట్రంప్ తెలిపారు. అలాగే, ఇరాన్ నాయకత్వం ప్రస్తుతం బలహీన స్థితిలో ఉందని కూడా పేర్కొన్నారు.
వివరాలు
ఇరాన్ నుంచి తాజా ప్రకటన
ట్రంప్ వ్యాఖ్యల తర్వాత, ఇరాన్ ప్రభుత్వ మీడియా మొజ్తబా ఖమేనీ పేరుతో ఒక లిఖితపూర్వక సందేశాన్ని విడుదల చేసింది. ఆ సందేశంలో, అమెరికా,ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలో ఇరాన్కు మద్దతుగా నిలిచిన ప్రజలకు, మతపెద్దలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. అయితే, ఈ ప్రకటన కేవలం వ్రాతపూర్వకంగానే ఉండటం గమనార్హం. ఆయన మాట్లాడిన వీడియో లేదా ఆడియో ఎలాంటి ఆధారాలు బయటకు రాకపోవడంతో, ఆయన ఆరోగ్యం గురించి సందేహాలు ఇంకా కొనసాగుతున్నాయి. ఆయన సురక్షితంగా ఉన్నారా లేదా తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్నారా అనే అంశంపై స్పష్టత రాకపోవడం ఉత్కంఠను మరింత పెంచుతోంది.