
Iran: అమెరికా శాశ్వత గాయం మోసుకోవాల్సిందే : ఇరాన్ విదేశాంగ మంత్రి
ఈ వార్తాకథనం ఏంటి
తమ అణుకేంద్రాలపై అమెరికా జరిపిన దాడులను ఇరాన్ విదేశాంగ మంత్రి సయ్యద్ అబ్బాస్ అరఘ్చి తీవ్రంగా ఖండించారు. అమెరికా శాశ్వత గాయం మోసుకుపోవాల్సి ఉంటుందని వ్యాఖ్యానించారు. అమెరికా ఈ చర్యల ద్వారా అంతర్జాతీయ చట్టాలనూ, అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ఒప్పందం (NPT)ని ఉల్లంఘించిందని ఆయన ఆరోపించారు. అమెరికా శాంతియుత కేంద్రాలపై దాడి ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో శాశ్వత సభ్యదేశమైన అమెరికా, శాంతియుత విధానంలో పనిచేస్తున్న ఇరాన్ అణుకేంద్రాలపై నేరపూరిత ప్రవర్తన కనబరచిందని తెలిపారు. ఈ చర్యల వల్ల అమెరికా శాశ్వత ప్రభావాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు.
Details
యూఎన్ సభ్యులకు సూచన
యూఎన్ సభ్యదేశాలు అమెరికా నేరపూరిత ప్రవర్తనపై అప్రమత్తంగా ఉండాలని అబ్బాస్ సూచించారు. ఈ ఘటనపై ప్రపంచ దేశాలందరూ స్పందించాలని కోరారు. యూఎన్ చార్టర్ ప్రకారం, ఇరాన్ ఆత్మరక్షణ హక్కును వినియోగించుకుని తన సార్వభౌమత్వాన్ని, ప్రజలను రక్షించుకోవడానికి అవసరమైన అన్ని చర్యలూ తీసుకుంటుందని ఆయన తెలిపారు. టెల్అవీవ్పై టెహ్రాన్ భారీ స్థాయిలో ప్రతిదాడులకు సిద్ధమవుతోందని స్పష్టం చేశారు.
Details
ఫోర్డ్, నతాంజ్, ఇస్ఫాహన్ అణుకేంద్రాలపై అమెరికా దాడి
ఇరాన్లోని ఫోర్డ్, నతాంజ్, ఇస్ఫాహన్ అణుకేంద్రాలపై అమెరికా భీకర దాడులు జరిపింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్వయంగా ఈ విషయాన్ని ప్రకటించారు. విజయవంతంగా దాడులు జరిపినట్లు పేర్కొన్న ఆయన, ఇప్పుడు శాంతికి సమయం ఆసన్నమైందని పిలుపునిచ్చారు. ఈ దాడులను ఇరాన్ మీడియా కూడా ధ్రువీకరించింది. తమపై జరిగిన దాడులకు అమెరికా తగిన మూల్యం చెల్లించకతప్పదని ఇరాన్ స్పష్టం చేసింది. పశ్చిమాసియాలోని అమెరికా స్థావరాలు, పౌరులను లక్ష్యంగా చేసుకుని ప్రతిదాడులకు సిద్ధమవుతున్నట్లు పేర్కొంది.
Details
నెతన్యాహు స్పందన
అమెరికా దాడులను ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు స్వాగతించారు. ఇరాన్ అణుకేంద్రాలపై అద్భుతమైన, ధర్మబద్ధ శక్తిని ప్రదర్శించడం సాహసోపేత నిర్ణయమని కొనియాడారు. ట్రంప్ నిర్ణయం చరిత్రను మార్చేంత శక్తివంతమని నెతన్యాహు పేర్కొన్నారు.