Volcanic Eruption: ఇండోనేషియాలో అగ్నిపర్వత విస్ఫోటనం.. 11 మంది పర్వతారోహకులు మృతి
ద్వీప దేశంలో ఆదివారం అగ్నిపర్వత విస్ఫోటనం సంభవించిన తరువాత ఇండోనేషియాలో సోమవారం పదకొండు మంది అధిరోహకులు మరణించినట్లు ఒక అధికారి తెలిపారు. ఆ సమయంలో ఆ ప్రాంతంలో ఉన్న 75 మంది అధిరోహకుల బృందాన్ని కనుగొనడానికి విస్ఫోటనం తరువాత వారిని వెతకటం ప్రారంభించారు. అయితే భద్రతా కారణాల వల్ల వెతకటం తాత్కాలికంగా నిలిపేసినట్లు , రాయిటర్స్ నివేదించింది. సోమవారం, 11 మంది పర్వతారోహకుల మృతదేహంతో పాటు ముగ్గురు ప్రాణాలతో బయటపడినట్లు రెస్క్యూ టీమ్ ప్రతినిధి జోడి హర్యవాన్ తెలిపారు.
రెండవ అత్యధిక స్థాయికి హెచ్చరిక
2,891 మీటర్ల ఎత్తులో ఉన్న మరాపి అగ్నిపర్వతం ఆదివారం 3 కి.మీ (9,843 అడుగులు) ఎత్తులో బూడిదను గాలిలోకి వెదజల్లింది. నివేదిక ప్రకారం అధికారులు రెండవ అత్యధిక స్థాయికి హెచ్చరికను పెంచారు. బిలం 3 కి.మీ.లోపలికి నివాసితులు వెళ్లకుండా నిషేధించారు. ఇండోనేషియా పసిఫిక్ "రింగ్ ఆఫ్ ఫైర్" అని పిలవబడేది. ఇది 127 క్రియాశీల అగ్నిపర్వతాలను కలిగి ఉంది.