NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / అంతర్జాతీయం వార్తలు / టర్కీలో 5.4 తీవ్రతతో మరో భూకంపం, 5,000 దాటిన మరణాలు
    తదుపరి వార్తా కథనం
    టర్కీలో 5.4 తీవ్రతతో మరో భూకంపం, 5,000 దాటిన మరణాలు
    టర్కీలో మరో శక్తివంతమైన భూకంపం సంభవించింది

    టర్కీలో 5.4 తీవ్రతతో మరో భూకంపం, 5,000 దాటిన మరణాలు

    వ్రాసిన వారు Stalin
    Feb 07, 2023
    04:24 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    టర్కీలో మరో శక్తివంతమైన భూకంపం సంభవించింది. ఇది రిక్టర్ స్కేలుపై 5.4గా నమోదైందని యూఎస్ జియోలాజికల్ సర్వే (యూఎస్‌జీఎస్) తెలిపింది.

    సోమవారం నుంచి టర్కీ, సిరియా వరుస భూకంపాలతో అల్లాడిపోతున్నాయి. ఇప్పటికే నాలుగు భూకంపాలు నమోదు కాగా, తాజాగా ఐదోవసారి శక్తివంతమైన భూకంపం సంభవించినట్లు యూఎస్‌జీఎస్ పేర్కొంది.

    భారీ భూకంపాలు వేలాది మందిని పొట్టనపెట్టుకున్నాయి. లక్షలాది మందిని నిరాశ్రయులను చేశాయి. భూకంపాలు సృష్టించిన విధ్వంసాల వల్ల టర్కీ, సిరియాలో మరణాల సంఖ్య 5,000 కు పెరిగింది.

    టర్కీ

    ధ్వంసమైన జైలు, పారిపోయిన ఉగ్రవాదులు

    భూకంపాలు లక్షలాది మంది ప్రజలకు విషాధాన్ని మిగిల్చితే.. ఉగ్రవాదులకు మాత్రం ఉపశమనాన్ని కలిగించింది. సిరియాలో సంభవించిన భూకంపానికి ఓ జైలు కూడా ధ్వంసమైంది. ఈ క్రమంలో అందులో ఉన్న ఉగ్రవాదులు పారిపోయినట్లు మీడియా కథనాలు చెబుతున్నాయి.

    సోమవారం తెల్లవారుజామున సిరియా సరిహద్దుకు సమీపంలో టర్కీలోని గాజియాంటెప్ ప్రావిన్స్‌లో 7.8తీవ్రతతో భూకంపం సంభవించింది.

    తర్వాత గాజియాంటెప్‌కు ఉత్తరాన 130కిలోమీటర్ల దూరంలో 7.5 తీవ్రతతో మరో భూకంపం సంభవించింది. దీని భూకంప కేంద్రం టర్కీలోని కహ్రామన్‌మరాస్ ప్రావిన్స్‌లోని ఎల్బిస్తాన్ జిల్లాలో ఉన్నట్లు యూఎస్ జియోలాజికల్ సర్వే తెలిపింది.

    రిక్టర్ స్కేలుపై 6.0 తీవ్రతతో మూడో భూకంపం సోమవారం టర్కీలోని గోక్సన్‌ను తాకింది. సిరియా సరిహద్దుకు సమీపంలో ఉన్న గాజియాంటెప్‌కు ఉత్తరాన ఉన్న కహ్రామన్మరాస్ ప్రావిన్స్‌లో సంభవించింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    టర్కీ
    భూమి

    తాజా

    CBSE Class 12 results: సీబీఎస్‌ఈ 12వ తరగతి ఫలితాలు విడుదల.. అధికారిక వెబ్‌సైట్‌లో చెక్‌ చేసుకొండి ఇలా.. సీబీఎస్‌ఈ
    China: వేధింపులు, ఆధిపత్య ధోరణితో ప్రపంచవ్యాప్తంగా ఒంటరి అవుతారు: జిన్‌పింగ్‌ జిన్‌పింగ్
    Bhatti vikramarka: వాణిజ్య పన్నుల వసూళ్లలో 6 శాతం పురోగతి.. వెల్లడించిన ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు భట్టి విక్రమార్క
    Mangalagiri AIIMS: మంగళగిరి ఎయిమ్స్‌లో గుండె శస్త్రచికిత్స విభాగం ప్రారంభం  మంగళగిరి

    టర్కీ

    ఎనిమిదో నిజాం ముకరం జా కన్నుమూత, సీఎం కేసీఆర్ సంతాపం హైదరాబాద్
    టర్కీలో 7.8 తీవ్రతతో భారీ భూకంకం, భవనాలు నేలకూలి 90 మంది మృతి భూమి
    టర్కీ, సిరియాలో ప్రకృతి విలయం: వరుస భూకంపాల ధాటికి 4300మందికిపైగా దుర్మరణం సిరియా
    టర్కీకి ఆపన్నహస్తం: మొదటి విడతగా ఎన్టీఆర్ఎఫ్ సిబ్బంది, భూకంప సహాయక సామగ్రిని పంపిన భారత్ భారతదేశం

    భూమి

    భూమికి దగ్గరగా వస్తున్న వస్తున్న 50,000 సంవత్సరాల తోకచుక్క నాసా
    2022లో అంతరిక్షంలో మూడు ప్రమాదాలను నివారించిన ISS నాసా
    30 సంవత్సరాల తర్వాత నిలిచిపోయిన నాసా జియోటైల్ మిషన్ నాసా
    ఫిబ్రవరి 2023లో వచ్చే స్నో మూన్ ప్రత్యేకత గురించి తెలుసుకుందాం చంద్రుడు
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025