NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / అంతర్జాతీయం వార్తలు / టర్కీ, సిరియాలో ప్రకృతి విలయం: వరుస భూకంపాల ధాటికి 4300మందికిపైగా దుర్మరణం
    తదుపరి వార్తా కథనం
    టర్కీ, సిరియాలో ప్రకృతి విలయం: వరుస భూకంపాల ధాటికి 4300మందికిపైగా దుర్మరణం
    టర్కీ, సిరియాలో వరుస భూకంపాల ధాటికి 4300మందికిపైగా దుర్మరణం

    టర్కీ, సిరియాలో ప్రకృతి విలయం: వరుస భూకంపాల ధాటికి 4300మందికిపైగా దుర్మరణం

    వ్రాసిన వారు Stalin
    Feb 07, 2023
    10:18 am

    ఈ వార్తాకథనం ఏంటి

    టర్కీ, సిరియాలో భూకంపం ప్రళయం సృష్టించింది. శక్తిమంతమైన భూకంపాల ధాటికి 4300మందికిపైగా మృతి చెందినట్లు వాషింగ్టన్ పోస్ట్ నివేదించింది.

    టర్కీ, సిరియాలలో సోమవారం 7.8, 7.6, 6.0 తీవ్రతతో మూడు వరుస విధ్వంసక భూకంపాలు సంభవించాయి.

    సోమవారం తెల్లవారుజామున సిరియా సరిహద్దుకు సమీపంలో టర్కీలోని గాజియాంటెప్ ప్రావిన్స్‌లో 7.8తీవ్రతతో భూకంపం సంభవించింది.

    తర్వాత గాజియాంటెప్‌కు ఉత్తరాన 130కిలోమీటర్ల దూరంలో 7.5 తీవ్రతతో మరో భూకంపం సంభవించింది. దీని భూకంప కేంద్రం టర్కీలోని కహ్రామన్‌మరాస్ ప్రావిన్స్‌లోని ఎల్బిస్తాన్ జిల్లాలో ఉన్నట్లు యూఎస్ జియోలాజికల్ సర్వే తెలిపింది.

    రిక్టర్ స్కేలుపై 6.0 తీవ్రతతో మూడో భూకంపం సోమవారం టర్కీలోని గోక్సన్‌ను తాకింది. సిరియా సరిహద్దుకు సమీపంలో ఉన్న గాజియాంటెప్‌కు ఉత్తరాన ఉన్న కహ్రామన్మరాస్ ప్రావిన్స్‌లో సంభవించింది.

    భూకంపం

    మృతుల సంఖ్య 20వేలకు చేరే అవకాశం

    భూకంపం కారణంగా టర్కీ,సిరియాలో 4,372 మంది చనిపోయినట్లు, ఈ సంఖ్య 20వేలకు చేరొచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనా వేస్తోంది.

    మంగళవారం ఉదయం నాటికి టర్కీలో మృతుల సంఖ్య 2,921కి చేరినట్లు టర్కీ విపత్తు సేవల అధిపతి యూనస్ సెజర్ తెలిపారు. మొత్తం 15,834 మంది గాయపడినట్లు వెల్లడించారు.

    సిరియాలో 1,451 మరణాలు సంభవించగా, 3,531 మంది గాయపడినట్లు సీఎన్ఎన్ నివేదించింది.

    ఈభూకంపాల వల్ల ఎక్కువ ఆస్తి, ప్రాణ నష్టం దక్షిణ టర్కీ, ఉత్తర, మధ్య సిరియాలో జరిగనట్లు వార్తా సంస్థలు చెబుతున్నాయి. గత 80 ఏళ్లలో టర్కీని తాకిన బలమైన భూకంపం ఇదే.

    భూకంపాల ధాటికి రెండు దేశాలలో వేలాది భవనాలు కూలిపోయాయి. వేలాదిమంది భవనాల కింద చిక్కుకొని సాయంకోసం అర్జిస్తున్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    టర్కీ
    భూమి

    తాజా

    Ajith: పని చేసుకుంటూ రేసింగ్‌లో పాల్గొన్నా.. చిన్ననాటి కష్టాలు గుర్తు చేసుకున్న అజిత్ అజిత్ కుమార్
    Jr.NTR Birthday: లంబోర్గినీ నుంచి పోర్షే వరకు తారక్ గ్యారేజ్'లో కార్లు ఇవే..  జూనియర్ ఎన్టీఆర్
    WAR 2: 'వార్ 2' టీజర్‌ వచ్చేసింది.. ఎన్టీఆర్ పవర్‌ లుక్‌కు ఫ్యాన్స్ ఫిదా! జూనియర్ ఎన్టీఆర్
    shehbaz sharif: అసత్య ప్రచారంతో ప్రజలను మభ్య పెడుతున్న పాక్ ప్రధాని..భారత్ ఐఎస్ఎస్ విక్రాంత్ ని ధ్వంసం చేశామంటూ గొప్పలు..! పాకిస్థాన్

    టర్కీ

    ఎనిమిదో నిజాం ముకరం జా కన్నుమూత, సీఎం కేసీఆర్ సంతాపం హైదరాబాద్
    టర్కీలో 7.8 తీవ్రతతో భారీ భూకంకం, భవనాలు నేలకూలి 90 మంది మృతి భూమి

    భూమి

    భూమికి దగ్గరగా వస్తున్న వస్తున్న 50,000 సంవత్సరాల తోకచుక్క నాసా
    2022లో అంతరిక్షంలో మూడు ప్రమాదాలను నివారించిన ISS నాసా
    30 సంవత్సరాల తర్వాత నిలిచిపోయిన నాసా జియోటైల్ మిషన్ నాసా
    ఫిబ్రవరి 2023లో వచ్చే స్నో మూన్ ప్రత్యేకత గురించి తెలుసుకుందాం చంద్రుడు
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025