NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / అంతర్జాతీయం వార్తలు / మసీదులో ఆత్మాహుతి పేలుళ్ల వెనుక భారత్ ప్రమేయం: పాకిస్థాన్ వింత ఆరోపణలు 
    తదుపరి వార్తా కథనం
    మసీదులో ఆత్మాహుతి పేలుళ్ల వెనుక భారత్ ప్రమేయం: పాకిస్థాన్ వింత ఆరోపణలు 

    మసీదులో ఆత్మాహుతి పేలుళ్ల వెనుక భారత్ ప్రమేయం: పాకిస్థాన్ వింత ఆరోపణలు 

    వ్రాసిన వారు Stalin
    Oct 01, 2023
    11:05 am

    ఈ వార్తాకథనం ఏంటి

    పాకిస్థాన్ మసీదులో జరిగిన జంట ఆత్మాహుతి పేలుళ్లలో మృతి చెందిన వారి సంఖ్య 65కి చేరుకుంది.

    ఈ పేలుళ్లపై పాకిస్థాన్ వింత ఆరోపణలు చేస్తోంది. దీని వెనుక భారత గూఢచార సంస్థ ప్రమేయం ఉన్నట్లు పొంతనలేని వాదనలు చేస్తోంది.

    బలూచిస్తాన్‌లోని మస్తుంగ్ జిల్లాలో శుక్రవారం ఒక మసీదు సమీపంలో మహమ్మద్ ప్రవక్త జన్మదినాన్ని పురస్కరించుకుని ఊరేగింపులో ఆత్మాహుతి దాడి జరిగింది.

    కొన్ని గంటల తర్వాత, ఖైబర్ పఖ్తున్ఖ్వాలోని హంగూ నగరంలోని మసీదులో మరో పేలుడు సంభవించి కనీసం 5 మంది మరణించారు.

    అయితే పేలుళ్ల వెనుక భారత గూఢచార సంస్థ 'రా' ప్రమేయం ఉన్నట్లు పాక్ అంతర్గత మంత్రి సర్ఫరాజ్ బుగ్తీ ఆరోపించారు.

    పాక్

    ఆత్మాహుతికి పాల్పడిన వ్యక్తి డీఎన్‌ఎను పరీక్షకు పంపాం: పాక్ మంత్రి

    ఆత్మాహుతి బాంబు దాడి చేసిన వ్యక్తి నుంచి డీఎన్‌ఎను విశ్లేషించడానికి పంపినట్లు మంత్రి సర్ఫరాజ్ బుగ్తీ చెప్పారు.

    బలూచిస్తాన్‌లోని మదీనా మసీదు సమీపంలోని మస్తుంగ్ అనే ప్రదేశంలో జరిగిన ఘోర ఆత్మాహుతి పేలుడులో మొత్తం 65మంది మరణించారు. 60 మందికి పైగా గాయపడ్డారు.

    ఖైబర్ పఖ్తున్‌ఖ్వాలోని హంగూలో పోలీస్ స్టేషన్ మసీదును లక్ష్యంగా చేసుకుని జరిగిన రెండో బాంబు దాడిలో ఐదుగురు మరణించారు. 12 మంది గాయపడ్డారు.

    ఈ దాడిపై ఇప్పటివరకు ఏ గ్రూపు బాధ్యత వహించలేదు.

    పాకిస్థాన్‌లో జరిగిన కొన్ని రక్తపాత దాడులకు కారణమైన నిషేధిత తెహ్రీక్-ఇ-తాలిబాన్ పాకిస్థాన్ సంస్థ ఇందులో తమ ప్రమేయం లేదని చెప్పింది.

    ఈ ఘటనపై విచారణ కొనసాగుతోందని, ఇప్పటివరకు ఎవరినీ అరెస్టు చేయలేదని సీటీడీ తెలిపింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    పాకిస్థాన్
    భారతదేశం
    తాజా వార్తలు

    తాజా

    Russia:ప్రత్యక్ష చర్చలు జరపాలి.. భారత్‌-పాక్‌లకు రష్యా కీలక సందేశం భారతదేశం
    Gaza-Israel: గాజాపై విరుచుకుపడిన ఇజ్రాయెల్‌.. ఒక్క రోజులో 146 మంది మృతి ఇజ్రాయెల్
    Asaduddin Owaisi: పాకిస్థాన్ మానవాళికి అతిపెద్ద ముప్పు: అసదుద్దీన్ ఓవైసీ ఫైర్ అసదుద్దీన్ ఒవైసీ
    Andhra Pradesh: మహిళలకు గుడ్ న్యూస్.. ఆ రోజు నుంచే ఉచిత బస్సు ప్రయాణం చంద్రబాబు నాయుడు

    పాకిస్థాన్

    ప్రధాని మోదీకి పాక్ సోదరి రక్షాబంధన్ శుభాకాంక్షలు.. 31వసారి రాఖీ కట్టనున్న మొహిసిన్ నరేంద్ర మోదీ
    చంద్రయాన్-3పై పాక్ నేత కీలక వ్యాఖ్యలు.. ప్రత్యేక్ష ప్రసారం చేయాలని సూచన ఇస్రో
    PAK Vs AFG: పోరాడి పాక్ జట్టుకు విజయాన్ని అందించిన షాబాద్ ఖాన్ క్రికెట్
    ఆసియా గడ్డపై ఇమామ్-ఉల్-హక్ సాధించిన రికార్డులివే! క్రికెట్

    భారతదేశం

    G20 summit delhi: దిల్లీలో అట్టహాసంగా జీ20 సదస్సు.. దేశాధినేతలకు స్వాగతం పలికిన ప్రధాని మోదీ   జీ20 సమావేశం
     G20 summit 2023: ప్రధాని మోదీ సీటు ముందు నేమ్ ప్లేట్‌పై  'భార‌త్‌' పేరు జో బైడెన్
    Modi-Biden bilateral meet: ద్వైపాక్షిక సమావేశంలో మోదీ, బైడెన్ చర్చించిన అంశాలు ఇవే..  నరేంద్ర మోదీ
    India-Middle East-Europe corridor: 'భారత్-మిడిల్ ఈస్ట్-యూరప్' కనెక్టివిటీ కారిడార్ ప్రారంభం  జీ20 సదస్సు

    తాజా వార్తలు

    భారత్‌లో గణనీయంగా పెరిగిన ఉద్యోగం చేసే మహిళలు.. కారణం భర్తలే అట భారతదేశం
    బలూచిస్థాన్ కార్యకర్త 'కరీమా బలోచ్' మరణంపై ట్రూడో మౌనం ఎందుకు?  కెనడా
    'ఒకరు దోపిడీదారు.. మరొకరు దొంగ'.. అన్నాడీఎంకే, బీజేపీపై ఉదయనిధి స్టాలిన్ కామెంట్స్ ఉదయనిధి స్టాలిన్
    మణిపూర్‌లో ఘోరం.. అదృశ్యమైన ఇద్దరు విద్యార్థులు హత్య.. ఫొటోలు వైరల్  మణిపూర్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025