NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / అంతర్జాతీయం వార్తలు / పాకిస్థాన్ బాంబు దాడిలో 44కు చేరిన మృతల సంఖ్య; 10కిలోల పేలుడు పదార్థాల వినియోగం 
    తదుపరి వార్తా కథనం
    పాకిస్థాన్ బాంబు దాడిలో 44కు చేరిన మృతల సంఖ్య; 10కిలోల పేలుడు పదార్థాల వినియోగం 
    పాకిస్థాన్ బాంబు దాడిలో 44కు చేరిన మృతల సంఖ్య; 10కిలోల పేలుడు పదార్థాల వినియోగం

    పాకిస్థాన్ బాంబు దాడిలో 44కు చేరిన మృతల సంఖ్య; 10కిలోల పేలుడు పదార్థాల వినియోగం 

    వ్రాసిన వారు Stalin
    Jul 31, 2023
    12:10 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    పాకిస్థాన్‍‌లోని ఖైబర్ పఖ్తున్‌ఖ్వా (కేపీ) ప్రావిన్స్‌లో ఇస్లామిస్ట్ పార్టీ జమియాత్ ఉలేమా-ఇ-ఇస్లాం-ఎఫ్ (జేయూఐ-ఎఫ్) నిర్వహించిన రాజకీయ సభలో ఆత్మాహుతి దాడి జరిగింది.

    ఈ ఘటనలో 44 మంది మరణించారు. 200 మంది గాయపడ్డారు. పేలుడు జేయూఐ-ఎఫ్ పార్టీని లక్ష్యంగా చేసుకొని చేసినట్లు తెలుస్తోంది.

    పేలుడులో 10 కిలోగ్రాముల పేలుడు పదార్థాలను వినియోగించినట్లు, సంఘటనా స్థలం నుంచి పేలుడు పదార్థాలను సేకరించామని కేపీ ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ అక్తర్ హయత్ ఖాన్ తెలిపారు.

    ఆత్మాహుతి దాడి జరిగిన చోటు అంతటా రక్తపు మరకలే ఉన్నాయని ప్రత్యేక్ష సాక్షి ఒకరు చెప్పారు. గాయపడిన వారిలో ఎక్కువ మంది బజౌర్, పరిసర ప్రాంతాలలోని ఆసుపత్రుల్లో ఐసీయూలో చేర్పించారు.

    ఆత్మాహుతి దాడి

    ఆత్మాహుతి దాడి వెనుక ఇస్లామిక్ స్టేట్ గ్రూప్?

    తీవ్రంగా గాయపడిన వారిని బజౌర్ నుంచి మిలిటరీ హెలికాప్టర్ల ద్వారా ప్రావిన్షియల్ రాజధాని పెషావర్‌లోని ఆస్పత్రులకు తరలించారు.

    పార్టీకి సీనియర్ నేతలు కూర్చున్న వేదికకు సమీపంలోనే ఆత్మాహుతి బాంబర్ ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

    ఆఫ్ఘనిస్తాన్‌లో పనిచేస్తున్న, ఆఫ్ఘన్ తాలిబాన్‌కు శత్రువు అయిన ఇస్లామిక్ స్టేట్ గ్రూప్ ఈ దాడి వెనుక ఉండవచ్చన్న ప్రాథమిక అంచనాకు వచ్చినట్లు పోలీసులు చెబుతున్నారు.

    ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్, అధ్యక్షుడు ఆరిఫ్ అల్వీ దాడిని ఖండించారు. గాయపడిన, మృతుల కుటుంబాలకు అన్ని విధాలుగా సహాయం అందించాలని అధికారులను కోరారు.

    2014నుంచి వాయువ్య ప్రాంతంలో జరిగిన నాలుగు అత్యంత ఘోరమైన బాంబు దాడుల్లో ఇది ఒకటిగా చెబతున్నారు. ఇప్పటివరకు జరిగిన పలు బాంబు దాడుల్లో 147మంది మరించారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    పాకిస్థాన్
    తాజా వార్తలు

    తాజా

    Techie Suicide: 'అతను ముగ్గురు వ్యక్తుల పని చేసాడు'.. పని ఒత్తిడితో బెంగళూరులో టెక్కీ ఆత్మహత్య.. ఓలా
    Yusuf Pathan : కేంద్రాన్ని త‌ప్పుప‌ట్టిన తృణ‌మూల్ కాంగ్రెస్‌.. దౌత్య బృందం నుంచి తప్పుకున్న యూసుఫ్ ప‌ఠాన్  తృణమూల్ కాంగ్రెస్‌
    Systematic Investment Plan: తక్కువ జీతం.. పెద్ద సంపద? SIP పెట్టుబడితో సాధ్యమే! జీవనశైలి
    Haryana: హర్యానాలోని నుహ్‌లో పాకిస్తాన్ 'గూఢచారి' నెట్‌వర్క్ గుట్టురట్టు.. రెండు రోజుల్లో రెండో అరెస్టు హర్యానా

    పాకిస్థాన్

    ఆసియా కప్ విషయంలో పాక్ మళ్లీ లొల్లి.. కాబోయే పీసీబీ చైర్మన్ హాట్ కామెంట్స్! క్రికెట్
    పాకిస్థాన్‌కు మరోసారి షాకిచ్చిన ఐసీసీ .. పీసీబీ డిమాండ్‌కు వ్యతిరేకం!  ఐసీసీ
    విరాట్ కోహ్లీపై పాక్ వెటరన్ క్రికెటర్ ప్రశంసల జల్లు విరాట్ కోహ్లీ
    జమ్ముకశ్మీర్: కుప్వారాలో ఎన్‌కౌంటర్; నలుగురు ఉగ్రవాదులు హతం జమ్ముకశ్మీర్

    తాజా వార్తలు

    మిస్టర్ మోదీ, మణిపూర్‌లో భారతదేశ ఆలోచనను పునర్నిర్మిస్తాం: రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ
    INDIA: మోదీ ప్రభుత్వం పై అవిశ్వాస తీర్మానానికి రెడీ అవుతున్న ప్రతిపక్షాలు ప్రతిపక్షాలు
    పాకిస్థాన్: మసీదులో ఆత్మాహుతి దాడి; పోలీస్ ఆఫీసర్ మృతి  పాకిస్థాన్
    'ఆమె చనిపోయింది'.. పాకిస్థాన్ ప్రియుడిని పెళ్లి చేసుకున్న అంజుపై ఆమె తండ్రి సంచలన వ్యాఖ్యలు  పాకిస్థాన్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025