
Berlin: జర్మనీ రాజధాని బెర్లిన్ లో దారుణం.. పాఠశాలలో టియర్ గ్యాస్ ప్రయోగం
ఈ వార్తాకథనం ఏంటి
జర్మనీ రాజధాని బెర్లిన్లోని ఒక ప్రాథమిక పాఠశాలలో గుర్తుతెలియని వ్యక్తి టియర్ గ్యాస్ విడుదల చేయడంతో దాదాపు 22 మంది పిల్లలు ఆసుపత్రి పాలయ్యారు.
స్థానిక మీడియా కథనాల ప్రకారం, ఈ దాడిలో ఒక పిల్లవాడి పరిస్థితి గంభీరంగా ఉందని తెలుస్తోంది.
మొత్తం 43 మంది శ్వాస సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు. పాఠశాల పరిసర ప్రాంతంలో నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నట్లు తెలుస్తుంది.
ఉదయం, పాఠశాలలో అనవసరంగా గుర్తుతెలియని వ్యక్తులు విషవాయువును పిచికారీ చేసినట్లు పోలీసులు తెలిపారు.
గతంలో, ఈ దాడి చేసే వ్యక్తి యువకుడా లేక చిన్నాడా అనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదు.
అగ్నిమాపక శాఖ అధికారులు, క్లాస్రూమ్ డోర్ నుంచి టియర్ గ్యాస్ పిచికారీ చేసినట్లు అనుమానిస్తున్నారు.
వివరాలు
ఉక్రెయిన్ పర్యటనకు జర్మనీ ఛాన్సలర్
ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక శాఖ బృందం,పాఠశాలను పరిశీలించి గాలిలో ఉన్న టియర్ గ్యాస్ను తొలగించి,తరగతులను తిరిగి ప్రారంభించేందుకు అనుమతిచ్చారు.
మరోవైపు,పోలీసులు ఈ ఘటనపై లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.ఇటీవల నవంబరులో,చైనాలో ఓ పాఠశాలలో కత్తితో దాడి జరిగిన విషయం వెలుగులోకి వచ్చింది.
ఈ దాడిలో 8 మంది మరణించారు,17 మంది గాయపడ్డారు.చైనాలోని యిక్సింగ్ నగరంలో జరిగిన ఈ దాడి క్రమంలో పోలీసులు నిందితులను పట్టుకున్నారు.
అంతే కాకుండా, జర్మనీ ఛాన్సలర్ ఒలాఫ్ స్కోల్జ్, సోమవారం ఉక్రెయిన్ పర్యటనకు వెళ్లారు.
రెండు సంవత్సరాల తర్వాత, స్కోల్జ్ ఉక్రెయిన్ చేరుకున్నట్లు సమాచారం.
ఈ సందర్బంగా, కొద్ది వారాల క్రితం, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్తో ఫోన్లో మాట్లాడినందుకు ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ విమర్శలు చేశారు.