Congo: ఆగ్నేయ కాంగోలో రాగి గనిలో వంతెన కూలి .. 32 మంది మృతి
ఈ వార్తాకథనం ఏంటి
ఆఫ్రికాలోని కాంగో దేశంలో మరో భయానక ప్రమాదం సంభవించింది. రాగి గనిలో ఉన్న ఓ వంతెన కూలిపోవడంతో దాదాపు 32 మంది ప్రాణాలు కోల్పోయారని సమాచారం బయటకు వచ్చింది. వంతెన కూలిన దృశ్యాలు ఇప్పటికే సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతున్నాయి. లువాలాబా ప్రావిన్స్కు చెందిన కలాండో ప్రాంతంలోని మైనింగ్ సైట్లో శనివారం ఈ ఘటన చోటుచేసుకున్నట్లు అధికారులు ధృవీకరించారు. ఈ గనిలో ప్రతిరోజూ వందలాది మంది కార్మికులు పనిలో నిమగ్నమై ఉంటారు. మైనింగ్ ప్రాంతం వద్ద ఆకస్మికంగా కాల్పుల శబ్దం వినిపించడంతో, ఇరుకైన వంతెనపై ఉన్న కార్మికులు ఆందోళనతో పరుగులు తీశారు. వారి రద్దీతో వంతెన బరువు తట్టుకోలేక కూలిపోయిందని మైనింగ్ ఏజెన్సీ వెల్లడించింది.
వివరాలు
మైనింగ్ రంగం ద్వారా నేరుగా 15 నుంచి 20 లక్షల మంది ఉపాధి
కాంగోలోని పెద్ద సంఖ్యలో ప్రజల జీవనాధారం ఈ రాగి గనులపైనే ఆధారపడి ఉంటుంది. ఈ మైనింగ్ రంగం ద్వారా నేరుగా 15 నుంచి 20 లక్షల మంది ఉపాధి పొందుతున్నారు. పరోక్షంగా కూడా మరెన్నో లక్షల మంది దీనిపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. అయితే భద్రతా ప్రమాణాలు సరిగా లేకపోవడం వల్ల ఇంతకుముందు కూడా ఈ గనుల్లో పలు ప్రమాదాలు జరిగి, అనేక మంది ప్రాణాలు కోల్పోయారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
రాగి గనిలో వంతెన కూలి .. 32 మంది మృతి
At least 32 people have died after a collapse at a cobalt mine in southeastern DR Congo, authorities say.
— Cyrus (@Cyrus_In_The_X) November 16, 2025
A bridge at the site gave way, killing dozens of informal miners in Lualaba province.#DRC #Congo #Mining pic.twitter.com/bdcNrBndpI