NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / అంతర్జాతీయం వార్తలు / South Korea: దక్షిణ కొరియాలో రోడ్డు దాటుతున్న వారిపై వేగంగా వెళ్లిన కారు.. 9 మంది మృతి.. నలుగురికి గాయలు 
    తదుపరి వార్తా కథనం
    South Korea: దక్షిణ కొరియాలో రోడ్డు దాటుతున్న వారిపై వేగంగా వెళ్లిన కారు.. 9 మంది మృతి.. నలుగురికి గాయలు 
    రోడ్డు దాటుతున్న వారిపై వేగంగా వెళ్లిన కారు.. 9 మంది మృతి.. నలుగురికి గాయలు

    South Korea: దక్షిణ కొరియాలో రోడ్డు దాటుతున్న వారిపై వేగంగా వెళ్లిన కారు.. 9 మంది మృతి.. నలుగురికి గాయలు 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Jul 02, 2024
    12:10 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    దక్షిణ కొరియా రాజధాని సియోల్‌లో వేగంగా వెళ్తున్న కారు రోడ్డు దాటేందుకు నిలబడి ఉన్న వ్యక్తులపైకి దూసుకెళ్లడంతో 9 మంది మృతి చెందగా, నలుగురికి గాయాలయ్యాయి.

    స్థానిక కాలమానం ప్రకారం సోమవారం రాత్రి 21:30 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది.

    Yonhap వార్తా సంస్థ నివేదిక ప్రకారం, 60 ఏళ్ల వ్యక్తి తన వాహనాన్ని ట్రాఫిక్ స్టాప్ వద్ద వేచి ఉన్న పాదచారులపైకి నడిపాడు.

    ఈ ఘటనపై విచారణ జరుపుతున్నామని, మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని పోలీసులు చెబుతున్నారు.

    స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం,కారు రాంగ్ సైడ్‌లో వెళ్తూ మరో రెండు వాహనాలను ఢీకొని పాదచారులను చితక్కొట్టింది.

    వివరాలు 

    ముగ్గురు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి 

    సియోల్ సిటీ హాల్ సమీపంలోని కూడలి వద్ద ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు.

    కారు అకస్మాత్తుగా వేగవంతమైందని అక్కడికక్కడే అదుపులోకి తీసుకున్న డ్రైవర్ పోలీసులకు తెలిపాడు.

    ఈ ఘటనలో ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ముగ్గురు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు.

    దక్షిణ కొరియాలో సాధారణ పట్టణ రహదారులపై వేగ పరిమితి 50 km/h (31 mph), నివాస ప్రాంతాలలో 30 km/h.

    సెంట్రల్ సియోల్‌లోని జాంగ్-గు జిల్లాలో పబ్లిక్ సేఫ్టీ అధికారి కిమ్ సియోంగ్-హక్ మాట్లాడుతూ, పోలీసులు కారు డ్రైవర్‌ను విచారిస్తున్నట్లు తెలిపారు.

    డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నాడా లేక డ్రగ్స్ మత్తులో ఉన్నాడా అనే కోణంలో అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.

    వివరాలు 

    2022లో దక్షిణ కొరియా రోడ్డు మరణాలలో 35% పాదచారులు

    జంగ్బు ఫైర్ స్టేషన్ ఫైర్ సేఫ్టీ చీఫ్ కిమ్ చున్-సు ప్రకారం, ప్రమాదంలో 13 మంది గాయపడ్డారు,

    వారిలో 9 మంది మరణించారు. ఒకరికి తీవ్రగాయాలు కాగా, ముగ్గురికి స్వల్ప గాయాలయ్యాయి.

    ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కో-ఆపరేషన్ అండ్ డెవలప్‌మెంట్ (OECD) నివేదిక ప్రకారం, 2022లో దక్షిణ కొరియాలో జరిగిన రోడ్డు మరణాలలో 35% పాదచారులు - ఇతర దేశాల కంటే చాలా ఎక్కువ.

    కానీ అదే నివేదికలో, OECD ఇటీవలి సంవత్సరాలలో దేశంలో రోడ్డు మరణాల రేటు తగ్గిందని హైలైట్ చేసింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    దక్షిణ కొరియా

    తాజా

    Covid 19 : హాంకాంగ్, సింగపూర్ లో మళ్ళీ పెరుగుతున్న కోవిడ్ కేసులు కోవిడ్
    India Womens Squad : హర్మన్ ప్రీత్ సారథ్యంలో ఇంగ్లండ్ టూర్ కు వెళ్తున్న వుమెన్స్ జట్టు ఇదే.. బీసీసీఐ
    Turkey: టర్కీపై దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహం.. ఒప్పందాలు రద్దు చేసుకుంటున్న భారత యూనివర్సిటీలు.. బాయ్‌కాట్‌ టర్కీ
    India Turkey: టర్కీకి బిగ్ షాక్ ఇచ్చిన భారత్.. విమానయాన సంస్థతో ఒప్పందం రద్దు.. కేంద్ర ప్రభుత్వం

    దక్షిణ కొరియా

    'మెదడు తినే అమీబా'తో దక్షిణ కొరియాలో తొలి మరణం.. ప్రపంచ దేశాలు అలర్ట్ ప్రపంచం
    దక్షిణ కొరియాలో సెక్స్ బొమ్మల దిగుమతిపై నిషేధం ఎత్తివేత.. పిల్లల ఆకారంలోని డాల్స్ పై మాత్రం..!! అంతర్జాతీయం
    ఆ ఆరు దేశాల మీదుగా ప్రయాణిస్తున్నారా ? అయితే ఈ కొత్త రూల్స్ తెలుసుకోండి కరోనా కొత్త మార్గదర్శకాలు
    ఈ దేశాల్లో మన రూపాయి వీలువ చాలా ఎక్కువ, అవేంటో తెలుసా? జీవనశైలి
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025