Page Loader
ఖైబర్-పఖ్తుంఖ్వా ప్రావిన్స్‌లోని పోలీస్ స్టేషన్‌పై దాడి..10 మంది పాకిస్తానీ పోలీసులు మృతి 
ఖైబర్-పఖ్తుంఖ్వా ప్రావిన్స్‌లోని పోలీస్ స్టేషన్‌పై దాడి

ఖైబర్-పఖ్తుంఖ్వా ప్రావిన్స్‌లోని పోలీస్ స్టేషన్‌పై దాడి..10 మంది పాకిస్తానీ పోలీసులు మృతి 

వ్రాసిన వారు Sirish Praharaju
Feb 05, 2024
11:04 am

ఈ వార్తాకథనం ఏంటి

వాయువ్య పాకిస్థాన్‌లోని పోలీస్ స్టేషన్‌పై సోమవారం ఉగ్రవాదులు జరిపిన దాడిలో కనీసం 10మంది పోలీసులు మరణించగా,మరో ఆరుగురు గాయపడినట్లు పోలీసులు తెలిపారు. పాకిస్తాన్ తాలిబాన్,ప్రభుత్వం మధ్య కాల్పుల విరమణ 2022 నుండి విచ్ఛిన్నమైనప్పటి నుండి, ఇస్లామిస్ట్ మిలిటెంట్లు,భద్రతా సిబ్బందిని లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తోంది. సోమవారం నాటి దాడి స్థానిక కాలమానం ప్రకారం తెల్లవారుజామున 3 గంటలకు(2200 GMT)జరిగింది. ఉగ్రవాదులు స్నిపర్లను ఉపయోగించి కానిస్టేబుళ్లను లక్ష్యంగా చేసుకుని,ఆపై పోలీసు స్టేషన్‌లోకి ప్రవేశించినట్లు పాకిస్తాన్‌లోని డ్రాబన్ ప్రాంతంలోని పోలీసు అధికారులు తెలిపారు. డిసెంబర్‌లో వాయువ్య పాకిస్థాన్‌లోని పోలీస్ స్టేషన్ కాంప్లెక్స్‌లో ఏర్పాటు చేసిన సైనిక శిబిరంలోకి ఆరుగురు వ్యక్తుల ఆత్మాహుతిదళం పేలుడు పదార్థాలతో కూడిన ట్రక్కును నడపడంతో కనీసం 23 మంది సైనికులు మరణించారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

ఖైబర్-పఖ్తుంఖ్వా ప్రావిన్స్‌లోని పోలీస్ స్టేషన్‌పై దాడి