NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / అంతర్జాతీయం వార్తలు / Bangladesh: భారత్ లాంటి స్నేహితుడు ఉండటం మా అదృష్టం: బంగ్లాదేశ్ ప్రధాని హసీనా 
    తదుపరి వార్తా కథనం
    Bangladesh: భారత్ లాంటి స్నేహితుడు ఉండటం మా అదృష్టం: బంగ్లాదేశ్ ప్రధాని హసీనా 
    Bangladesh: భారత్ లాంటి స్నేహితుడు ఉండటం మా అదృష్టం: బంగ్లాదేశ్ ప్రధాని హసీనా

    Bangladesh: భారత్ లాంటి స్నేహితుడు ఉండటం మా అదృష్టం: బంగ్లాదేశ్ ప్రధాని హసీనా 

    వ్రాసిన వారు Stalin
    Jan 07, 2024
    09:47 am

    ఈ వార్తాకథనం ఏంటి

    బంగ్లాదేశ్‌లో ఆదివారం పార్లమెంట్ ఎన్నికల కోసం పోలింగ్ జరుగుతోంది.

    ఈ క్రమంలో తన ఓటు హక్కును వినియోగించుకున్న అనంతరం ప్రధాన మంత్రి షేక్ హసీనా భారత్‌ను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు.

    భారత్‌కు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. ఇండియా వంటి నమ్మకమైన స్నేహితుడిని కలిగి ఉండటం బంగ్లాదేశ్ అదృష్టమని అన్నారు.

    1971లో జరిగిన బంగ్లాదేశ్ విముక్తి యుద్ధంలో భారత్ ఇచ్చిన మద్దతును కూడా ఈ సందర్భంగా ఆమె గుర్తు చేసుకున్నారు.

    యుద్ధం సమయంలో తన కుటుంబం ఊచకోతకు గురైందని ఆవేదన వ్యక్తం చేశారు.

    ఆ సమయంలో అనేక ఏళ్లుగా భారతదేశంలో ఆశ్రయం పొందినట్లు పేర్కొన్నారు.

    ఇండియా నుంచి బంగ్లాదేశ్‌కు తిరిగి వచ్చిన షేక్ హసీనా.. అవామీ లీగ్‌ పార్టీ అధ్యక్ష బాధ్యతలను స్వీకరించారు.

    బంగ్లాదేశ్

    ప్రజాస్వామ్యం లేకుండా ఎటువంటి అభివృద్ధి చేయలేరు: షేక్ హసీనా 

    బంగ్లాదేశ్ దేశాభివృద్ధికి ప్రజాస్వామ్యం ప్రాముఖ్యతను షేక్ హసీనా నొక్కి చెప్పారు.

    గత సంవత్సరాల్లో తమ ప్రభుత్వం ప్రజల ప్రజాస్వామ్య హక్కులను స్థాపించిందని అన్నారు.

    ఈ దేశంలో ప్రజాస్వామ్యం కొనసాగాలని తాను కోరుకుంటున్నట్లు చెప్పారు.

    ప్రజాస్వామ్యం లేకుండా ఎటువంటి అభివృద్ధి చేయలేరని ప్రధాని అన్నారు.

    2009-2023 మధ్య కాలంలో బంగ్లాదేశ్ దీర్ఘకాలిక ప్రజాస్వామ్య వ్యవస్థను సాధించినట్లు పేర్కొన్నారు.

    ప్రజలు బయటకు వచ్చి ఓటు వేయగలిగే వాతావరణాన్ని తమ ప్రభుత్వం సృష్టించిందని హసీనా నొక్కిచెప్పారు.

    బంగ్లాదేశ్ ప్రతిపక్ష పార్టీ బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (బీఎన్‌పీ) దేశంలో హింసను ప్రేరేపిస్తోందని, వారు ప్రజల అభివృద్ధికి వ్యతిరేకమని ఆమె ఆరోపించారు.

    బంగ్లాదేశ్

    ప్రతిపక్షాలకు ప్రజాస్వామ్యంపై నమ్మకం లేదు: ప్రధాని

    బీఎన్‌పీ, జమాత్‌లు రైలు తగులబెట్టడం, వాహనాలను తగలబెట్టడం వంటి అనేక హింసాత్మక సంఘటనలకు పాల్పడ్డాయని, వారికి ప్రజాస్వామ్యంపై నమ్మకం లేదని ప్రధాని హసీనా అన్నారు.

    వారు దేశభక్తులు కాదని, ప్రజాస్వామ్యాన్ని వ్యతిరేకిస్తున్నారని ఆమె అన్నారు.

    ప్రజల అభివృద్ధి, ప్రజాస్వామ్యం కొనసాగడం వారికి ఇష్టం లేదని స్పష్టం చేసారు.

    హసీనా రాజీనామాను డిమాండ్ చేస్తూ ప్రధాన ప్రతిపక్షమైన బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ ఎన్నికలను బహిష్కరించింది.

    ఈ క్రమంలో బంగ్లాదేశ్‌లోని దాదాపు 170 మిలియన్ల మంది ప్రజలు 299 మంది శాసనసభ్యులను ఎన్నుకునేందుకు ఆదివారం ఓటు వేస్తున్నారు.

    ఆదివారం నాటి ఎన్నికల కోసం 42,000 కంటే ఎక్కువ పోలింగ్ స్టేషన్‌లు ఏర్పాటు చేశారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    బంగ్లాదేశ్
    పార్లమెంట్
    ఎన్నికలు
    తాజా వార్తలు

    తాజా

    Kiran Abbavaram : కిరణ్ అబ్బవరం కొత్త సినిమా గ్లింప్స్ రిలీజ్.. కిరణ్ అబ్బవరం
    Rajamouli: గెలుపు ఎవరిదైనా.. ఓటమి గుండెల్లో నిలిచిపోతుంది.. రాజమౌళి ట్వీట్ వైరల్ రాజమౌళి
    PM Modi: జూన్ 04న మంత్రులతో ప్రధాని మోదీ భేటీ.. ఆపరేషన్ సిందూర్ తర్వాత ఇదే మొదటి సమావేశం.. నరేంద్ర మోదీ
    IPL Prize Money: ఐపీఎల్ ఫైనల్ గెలిచిన జట్టుకు భారీగా నగదు.. ఆరెంజ్, పర్పుల్ క్యాప్ హోల్డర్లకు ఎంత తెలుసా? ఐపీఎల్

    బంగ్లాదేశ్

    ఎట్టకేలకు బంగ్లాదేశ్ పై ప్రతీకారం తీర్చుకున్న ఐర్లాండ్ క్రికెట్
    మార్చి నెల ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ద మంత్ ఎవరో తెలుసా? ఐసీసీ
    బంగ్లాదేశ్ తో అమీతుమీ తేల్చుకోనున్న ఐర్లాండ్ ఐర్లాండ్
    తుపానుకు 'మోచా' పేరు ఎలా పెట్టారు? అది ఎప్పుడు తీరాన్ని తాకుతుంది?  ఐఎండీ

    పార్లమెంట్

    Women's Reservation Bill: మహిళా రిజర్వేషన్ బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోదం  నరేంద్ర మోదీ
    పాత పార్లమెంట్ సెంట్రల్ హాల్‌‌కు 'సంవిధాన్‌ సదన్‌' పేరు.. ప్రధాని మోదీ ప్రతిపాదన  పార్లమెంట్ కొత్త భవనం
    పార్లమెంటులో నరేంద్ర మోదీతో విదేశాంగ మంత్రి జైశంకర్ భేటీ.. భారత్- కెనడా సంబంధాలపై కీలక చర్చ నరేంద్ర మోదీ
    అమెరికా పార్లమెంట్ స్పీకర్‌ తొలగింపు.. 234ఏళ్ల యూఎస్ కాంగ్రెస్ చరిత్రలో ఇదే తొలిసారి  అమెరికా

    ఎన్నికలు

    ఎన్డీఏ కూటమిలో చేరిన జేడీఎస్.. బీజేపీతో కుదిరిన ఒప్పందం  జనతాదళ్ (సెక్యులర్)
    తెలంగాణలో నేటి నుంచి మూడు రోజుల పాటు కేంద్ర ఎన్నికల బృందం పర్యటన తెలంగాణ
    LAHDC Election: లద్ధాఖ్‌లో కొనసాగుతున్నపోలింగ్.. జమ్ముకశ్మీర్ విడిపోయన తర్వాత ఇవే తొలి ఎన్నికలు  లద్దాఖ్
    LAHDC-Kargil Poll: కాంగ్రెస్ 5 సీట్లు, ఎన్‌సీ 3, బీజేపీ ఒక సీటు కైవసం.. కొనసాగుతున్న ఓట్ల లెక్కింపు  లద్దాఖ్

    తాజా వార్తలు

    David Warner: షాకింగ్ న్యూస్.. రిటైర్మెంట్ ప్రకటించిన స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్  డేవిడ్ వార్నర్
    OTT Movies Release : ఓటీటీల్లో ఈవారం ఏకంగా 25 సినిమాలు.. ఏ సినిమా ఎందులో స్ట్రీమింగ్ అంటే... టాలీవుడ్
    Family suicide: ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఆత్మహత్య.. కారణం ఇదే..  పంజాబ్
    YS Sharmila: కుమారుడి పెళ్లి, నిశ్చితార్ధం తేదీలను వెల్లడించిన షర్మిల  వైఎస్ షర్మిల
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025