NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / అంతర్జాతీయం వార్తలు / Waker-uz-Zaman: మధ్యంతర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామన్న బంగ్లాదేశ్ ఆర్మీ చీఫ్ 
    తదుపరి వార్తా కథనం
    Waker-uz-Zaman: మధ్యంతర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామన్న బంగ్లాదేశ్ ఆర్మీ చీఫ్ 
    మధ్యంతర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామన్న బంగ్లాదేశ్ ఆర్మీ చీఫ్

    Waker-uz-Zaman: మధ్యంతర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామన్న బంగ్లాదేశ్ ఆర్మీ చీఫ్ 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Aug 05, 2024
    04:18 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా రాజీనామా చేసినట్లు బంగ్లాదేశ్ ఆర్మీ చీఫ్ వకార్ ఉజ్ జమాన్ తెలిపారు.

    ఇప్పుడు దేశంలో మధ్యంతర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు కసరత్తు జరగనుందని పేర్కొన్నారు.

    మధ్యంతర ప్రభుత్వం పాలనా పగ్గాలు చేపట్టనుంది. తాను రాజకీయ పార్టీల నేతలతో మాట్లాడానని, శాంతిభద్రతల బాధ్యతను సైన్యం తీసుకుంటుందని చెప్పానని ఆర్మీ చీఫ్ చెప్పారు.

    కాల్పులు జరపవద్దని ఆయన సైన్యాన్ని, పోలీసులను కోరారు.

    వివరాలు 

    దేశంలో శాంతిని తిరిగి తీసుకువస్తాం: ఆర్మీ చీఫ్ 

    దేశంలో శాంతిని నెలకొల్పుతామని చెప్పారు. హింసను ఆపాలని మేము పౌరులను కోరుతున్నామన్నారు.

    గత కొన్ని వారాలుగా జరిగిన అన్ని హత్యలను విచారిస్తామన్నారు. దేశంలో కర్ఫ్యూ లేదా ఎమర్జెన్సీ అవసరం లేదన్నారు.

    ఈ రాత్రికి సంక్షోభానికి పరిష్కారం కనుగొంటాం అని తెలిపారు. విద్యార్థులు ప్రశాంతంగా ఉండి ఇళ్లకు వెళ్లాలని కోరారు.

    వివారాలు 

    ఇప్పటి వరకు 106 మందికి పైగా మరణించారు 

    అంతకుముందు,బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా రాజీనామా చేసి దేశం విడిచిపెట్టి వెళ్లారు.

    మరోవైపు ప్రధాని హసీనా అధికారిక నివాసంలోకి ఆందోళనకారులు ప్రవేశించినట్లు వార్తలు వస్తున్నాయి. ఆదివారం నుంచి ప్రభుత్వ వ్యతిరేక నిరసనల్లో 106మందికి పైగా మరణించారు.

    వివాదాస్పద రిజర్వేషన్ వ్యవస్థపై హసీనా ప్రభుత్వంపై విస్తృత నిరసనలు వెల్లువెత్తడంతో ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేయాల్సి వచ్చిందని మీడియా కథనాల ద్వారా నివేదించబడింది.

    ఈ వివాదాస్పద రిజర్వేషన్ విధానంలో,1971లో బంగ్లాదేశ్ విమోచన యుద్ధంలో పాల్గొన్న వ్యక్తుల బంధువులకు ప్రభుత్వ ఉద్యోగాల్లో 30 శాతం రిజర్వేషన్ కల్పించే నిబంధన ఉంది.

    అంతకుముందు,లాంగ్ మార్చ్ టు ఢాకా'లో పాల్గొనాలని నిరసనకారులు సాధారణ ప్రజలకు పిలుపునిచ్చిన తరువాత బంగ్లాదేశ్ ప్రభుత్వం ఇంటర్నెట్‌ను పూర్తిగా నిలిపివేయాలని ఆదేశించింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    బంగ్లాదేశ్

    తాజా

    Beating Retreat: 10 రోజుల కాల్పుల విరమణ త‌ర్వాత‌.. నేటి నుంచి బీటింగ్ రిట్రీట్ సెర్మ‌నీ భారతదేశం
    BAN vs UAE: యూఏఈ సంచలనం.. బంగ్లాదేశ్‌పై విజయం.. ఒక్క మ్యాచ్‌తో ఐదు రికార్డులు బంగ్లాదేశ్
    Gold prices: తెలుగు రాష్ట్రాల్లో దిగొచ్చిన బంగారం ధరలు.. ఇవాళ్టి ధరలు ఎలా ఉన్నాయంటే?  బంగారం
    Vande Bharat: ప్రయాణికులకు గుడ్ న్యూస్.. త్వరలో విజయవాడ-బెంగళూరు మధ్య వందేభారత్‌! వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ రైలు

    బంగ్లాదేశ్

    World Cup 2023 : ఇంగ్లండ్ చేతిలో ఓడిన బంగ్లాదేశ్‌కు మరో షాక్ ఇంగ్లండ్
    NZ Vs BAN : టాస్ గెలిచిన న్యూజిలాండ్.. కేన్ విలియమ్సన్ వచ్చేశాడు న్యూజిలాండ్
    NZ Vs BAN: న్యూజిలాండ్ హ్యాట్రిక్ విజయం న్యూజిలాండ్
    IND Vs BAN : టీమిండియాతో మ్యాచుకు ముందు బంగ్లాదేశ్‌కు బిగ్ షాక్! వన్డే వరల్డ్ కప్ 2023
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025