LOADING...
Sheikh Hasina: హసీనా అప్పగింతపై ఇంటర్‌పోల్‌ను ఆశ్రయించనున్న బంగ్లాదేశ్‌ 
హసీనా అప్పగింతపై ఇంటర్‌పోల్‌ను ఆశ్రయించనున్న బంగ్లాదేశ్

Sheikh Hasina: హసీనా అప్పగింతపై ఇంటర్‌పోల్‌ను ఆశ్రయించనున్న బంగ్లాదేశ్‌ 

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 19, 2025
03:56 pm

ఈ వార్తాకథనం ఏంటి

మానవత్వాన్ని తాకట్టు పెట్టి ఘోర నేరాలు చేశారన్న ఆరోపణలపై మాజీ ప్రధానమంత్రి షేక్‌ హసీనాకు బంగ్లాదేశ్‌ ప్రభుత్వం మరణదండన విధించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఆమెను తమకు అప్పగించాలని యూనస్‌ ప్రభుత్వం కోరుతున్నప్పటికీ భారత్‌ విముఖత చూపిస్తోంది. భారతదేశంలోనే ప్రస్తుతం హసీనా, మాజీ హోంమంత్రి అసదుజ్జమాన్‌ ఖాన్‌ ఆశ్రయం పొందుతుండటంతో... ఈ ఇద్దరినీ భారత్‌ నుంచి రప్పించేందుకు ఇంటర్‌పోల్‌ సహాయాన్ని తీసుకునే ఆలోచనలో తాత్కాలిక బంగ్లాదేశ్‌ ప్రభుత్వం ఉందని తెలుస్తోంది. దీనికి సంబంధించిన ప్రాథమిక చర్యలను అక్కడి విదేశాంగ శాఖ ఇప్పటికే ప్రారంభించినట్టు బంగ్లాదేశ్‌ మీడియా తెలిపింది.

వివరాలు 

ఇంటర్‌పోల్‌ను అభ్యర్థించేందుకు ప్రాసిక్యూటర్‌ గాజీ తమీమ్‌ సన్నాహాలు 

దేశం విడిచి పారిపోయిన హసీనా, అసదుజ్జమాన్‌ ఖాన్‌లపై రెడ్‌ నోటీసులు జారీ చేయాలని ఇంటర్‌పోల్‌ను అభ్యర్థించేందుకు ప్రాసిక్యూటర్‌ గాజీ తమీమ్‌ సన్నాహాలు చేస్తున్నారని ది ఫైనాన్షియల్‌ ఎక్స్‌ప్రెస్ రాసింది. పరారీలో ఉన్న ఈ ఇద్దరిపై చర్యలు తీసుకునేలా ఇంటర్నేషనల్‌ క్రైమ్స్‌ ట్రైబ్యునల్‌ ఇప్పటికే అరెస్ట్‌వారెంట్‌తో పాటు అధికారిక అభ్యర్థనను ఇంటర్‌పోల్‌కు సమర్పించినట్టు కూడా ఆ మీడియా వెల్లడించింది.

వివరాలు 

బంగ్లాదేశ్‌ ప్రభుత్వానికి అప్పగించే అవకాశాలు చాలా తక్కువ

బంగ్లాదేశ్‌ నుంచి తప్పించుకుని భారత్‌లో ఆశ్రయం పొందుతున్న షేక్‌ హసీనాను తమకు అప్పగించాలని మహమ్మద్‌ యూనస్‌ ఆధ్వర్యంలోని తాత్కాలిక ప్రభుత్వం పలువుర్తరాల్లో భారత్‌ను కోరింది. హసీనా నేరారోపణలు ఎదుర్కొంటున్న నిందితురాలని, అందుకే అంతర్జాతీయ ట్రైబ్యునల్‌ ఆమెకు మరణశిక్ష విధించిందని పేర్కొంటూ ఆమె అప్పగింతపై బంగ్లా విదేశాంగ శాఖ నిరంతరం ఒత్తిడి చేస్తున్నది. కానీ హసీనాపై వచ్చిన అభియోగాలు రాజకీయ ప్రేరేపితమైనవేనని న్యూఢిల్లీ భావిస్తోందన్న విశ్లేషకుల అంచనాతో... ఆమెను ఏ పరిస్థితుల్లోనూ బంగ్లాదేశ్‌ ప్రభుత్వానికి అప్పగించే అవకాశాలు చాలా తక్కువగా కనిపిస్తున్నాయి.