NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / అంతర్జాతీయం వార్తలు / ఐదుగురు పిల్లలను చంపిన తల్లికి కారుణ్య మరణం; 16 ఏళ్ల తర్వాత ఘటన
    తదుపరి వార్తా కథనం
    ఐదుగురు పిల్లలను చంపిన తల్లికి కారుణ్య మరణం; 16 ఏళ్ల తర్వాత ఘటన
    బెల్జియం: ఐదుగురు పిల్లలను చంపిన తల్లికి అనాయస మరణం

    ఐదుగురు పిల్లలను చంపిన తల్లికి కారుణ్య మరణం; 16 ఏళ్ల తర్వాత ఘటన

    వ్రాసిన వారు Stalin
    Mar 03, 2023
    12:15 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    జెనీవీవ్ లెర్మిట్ అనే మహిళ ఫిబ్రవరి 28, 2007న తన ఐదుగురు కన్న బిడ్డలను హత్య చేసిన ఘటన అప్పట్లో బెల్జియంలో సంచలనం రేపింది. దాదాపు 16ఏళ్ల ఆ మహిళ అనాయాసంగా(కారుణ్య) మరణించారని ఆమె తరఫు న్యాయవాది గురువారం వెల్లడించారు.

    నివెల్లెస్ పట్టణంలోని తమ ఇంట్లో తండ్రి లేని సమయంలో కుమారుడు, నలుగురు కుమార్తెల గొంతులు కోసి జెనీవీవ్ హత్య చేసారు. ఆ తర్వాత ఆమె ఉరేసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించింది, కానీ ప్రయత్నం విఫలమైంది.

    ఈ కేసులో కోర్టు జెనీవీవ్ లెర్మిట్‌కి 2008లో జీవిత ఖైదు విధించింది. 2019లో ఆరోగ్యం బాగాలేకపోవడంతో మానసిక ఆసుపత్రికి తరలించారు.

    బెల్జియం

    బెల్జియంలో భరించలేని మానసిక సమస్యతో బాధపడుతున్నట్లయితే 'అనాయాస' పద్ధతిని ఆశ్రయించొచ్చు

    జెనీవీవ్ లెర్మిట్ తీవ్రమైన మానసిక కుంగుబాటుకు గురైనట్లు, అందుకే మరణించడానికి అనాయాస(కారణ్య) పద్ధతిని ఎంచుకున్నట్లు న్యాయవాది నికోలస్ కోహెన్ చెప్పారు.

    భరించలేని మానసిక సమస్యతో బాధపడుతున్నారని భావించినట్లయితే చనిపోవడానికి అనాయాసంగా మార్గాన్ని ఆశ్రయించ‌వచ్చని బెల్జియన్ చట్టం చెబుతోంది. నయం కాని వ్యాధుల విషయంలోనే ఇది వర్తిస్తుంది.

    పిల్లలను హత్య చేసినప్పటి నుంచి ఆమె తన జీవితంపై ఆశగా లేదని న్యాయవాది చెప్పారు. హత్యలు చేసిన రోజే ఆమె ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నట్లు పేర్కొన్నారు.

    బెల్జియంలో గత సంవత్సరం 2,966 మంది అనాయాస(కారుణ్య) పద్ధతి ద్వారా మరణించారు. ఇది 2021తో పోలిస్తే 10 శాతం ఎక్కువ అని అధికారులు తెలిపారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    తల్లిపాలు

    తాజా

    Mini Kashmir: కశ్మీర్‌కు బదులుగా ఈ మినీ కశ్మీర్‌కెళ్లండి.. ఇదే రైట్ టైమ్! జమ్ముకశ్మీర్
    Ravindra Jadeja: జడేజాకు టెస్ట్ సారథ్య బాధ్యతలు ఇవ్వాలి : అశ్విన్ జడేజా
    P Chidambaram:: 'ఇండియా అలయన్స్ వేస్ట్'.. 2029 లో కూడా బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం  ఇండియా కూటమి
    TVS: 2025 టీవీఎస్ ఐక్యూబ్ లాంచ్.. ధర తగ్గింది.. రేంజ్ పెరిగింది! టీవీఎస్ మోటార్

    తల్లిపాలు

    కేరళ: దేశంలోనే తొలిసారిగా తల్లిదండ్రులు కాబోతున్న టాన్స్‌జెండర్ జంట కేరళ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025