
Canada: భారత్తో సంబంధాల పునరుద్ధరణకు కెనడా ప్రయత్నాలు: అనితా ఆనంద్
ఈ వార్తాకథనం ఏంటి
ఇటీవలి కాలంలో ఉద్రిక్తతలతో క్షీణించిన భారత్-కెనడా సంబంధాలు మళ్లీ పునర్నిర్మాణ దశలోకి వెళ్తున్నాయి. ఈ నేపథ్యంలో, కెనడా విదేశీ వ్యవహారాల మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అనితా ఆనంద్ కీలక వ్యాఖ్యలు చేశారు.
న్యూఢిల్లీతో సంబంధాలను మెరుగుపర్చే దిశగా కెనడా చర్యలు తీసుకుంటోందని ఆమె స్పష్టం చేశారు. భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్తో ఆమె టెలిఫోన్ ద్వారా సంభాషించారు.
ఈ సందర్భంగా ద్వైపాక్షిక దౌత్య సంబంధాలు, పరస్పర సహకారం వంటి అంశాలపై చర్చ జరిగింది.
అనంతరం ఓ ఇంటర్వ్యూలో అనితా ఆనంద్ మాట్లాడుతూ, భారత్తో ఉన్న సంబంధాలను పునరుద్ధరించేందుకు కెనడా ముందడుగు వేస్తోందన్నారు.
ఈ దిశగా ఒక్కొక్క అడుగు వేస్తున్నాం. మేము సత్సంబంధాల కోసం ఎదురుచూస్తున్నామని తెలిపారు.
Details
చట్టబద్ధమైన పాలనపై తమ దేశం రాజీపడదు
ఈ సందర్భంలో, హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య కేసును ఆమె ప్రస్తావించారు. చట్టబద్ధమైన పాలనపై తమ దేశం ఎప్పుడూ రాజీ పడదని స్పష్టం చేశారు.
'ఈ కేసుపై విచారణ కొనసాగుతోంది. అది ఒక వైపు కొనసాగుతూనే, భారత్తో సంబంధాలను బలోపేతం చేయడంపై కూడా మేము దృష్టి పెడుతున్నామని చెప్పారు.
వివిధ దేశాలతో బలమైన సంబంధాలు కలిగి ఉండడమే కెనడా లక్ష్యమని పేర్కొన్నారు.
ఇక కెనడా ప్రధానిగా మార్క్ కార్నీ అధికారంలోకి వచ్చిన తర్వాత భారత్తో సంబంధాలను పునరుద్ధరించడంపై ఎక్కువగా దృష్టి సారిస్తున్నారు.
ఆయన ఇప్పటికే అనేకసార్లు భారత్ అనుకూలంగా మాట్లాడారు. 'కెనడియన్లు వ్యక్తిగతంగా, ఆర్థికంగా, వ్యూహాత్మకంగా భారతదేశంతో సుదీర్ఘ సంబంధాలను కలిగి ఉన్నారు.
Details
విభేదాలను పరిష్కరించేందుకు కృషి
గతంలో తలెత్తిన విభేదాలను పరిష్కరించేందుకు మేము కృషి చేస్తామని కార్నీ స్పష్టం చేశారు.
ముందు జస్టిన్ ట్రూడో నేతృత్వంలోని ప్రభుత్వం ఖలిస్థానీ ఉగ్రవాది హర్దీప్సింగ్ నిజ్జర్ హత్యపై భారత్ పాత్ర ఉందని అనుమానాలు వ్యక్తం చేయడం, భారత్ ఆ ఆరోపణలను తిప్పికొట్టడం వల్ల ఇరుదేశాల మధ్య సంబంధాలు తీవ్రంగా దెబ్బతిన్న సంగతి తెలిసిందే.
ఈ పరిణామాల నేపథ్యంలో, వాణిజ్య మరియు దౌత్య సంబంధాలు క్షీణించాయి.
అయితే తాజా ఎన్నికల్లో కార్నీ నాయకత్వంలోని లిబరల్స్ పార్టీ ఘన విజయం సాధించడంతో భారత్కు అనుకూలంగా ఉన్న ప్రభుత్వం ఏర్పడింది.
దీంతో భవిష్యత్తులో భారత్-కెనడా సంబంధాలు మెరుగయ్యే అవకాశాలు మెండుగా ఉన్నట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.