NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / అంతర్జాతీయం వార్తలు / వివాదాస్పద మ్యాప్ పై భారత్ తీవ్ర స్పందనకు బదులిచ్చిన డ్రాగన్ దేశం  
    తదుపరి వార్తా కథనం
    వివాదాస్పద మ్యాప్ పై భారత్ తీవ్ర స్పందనకు బదులిచ్చిన డ్రాగన్ దేశం  
    వివాదాస్పద మ్యాప్ పై భారత్ తీవ్ర స్పందనకు బదులిచ్చిన డ్రాగన్ దేశం

    వివాదాస్పద మ్యాప్ పై భారత్ తీవ్ర స్పందనకు బదులిచ్చిన డ్రాగన్ దేశం  

    వ్రాసిన వారు TEJAVYAS BESTHA
    Aug 30, 2023
    05:58 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    చైనా మరోసారి కయ్యానికి కాలు దువ్వుతోంది.ఈ మేరకు భారతదేశంలోని భూభాగాలను తమ ప్రాంతాలుగా చూపిస్తూ సోమవారం చైనా అధికారికంగా ఓ మ్యాప్‌ను విడుదల చేసింది.

    అయితే దీనిపై భారత్ తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. భారత భూభాగాలను చైనా మ్యాప్‌లో పొందుపర్చడాన్ని ఖండించింది.ఈ అంశంపై బుధవారం చైనా స్పందించింది.

    చట్ట ప్రకారమే మ్యాప్ ప్రకటించామని మళ్లీ పాత పాటే పాడింది. డ్రాగన్ దేశం తన దుశ్చర్యలను సమర్థించుకుంది. 2023కి సంబంధించి చైనా సోమవారం విడుదల చేసిన ఓ స్టాండర్డ్‌ మ్యాప్‌ (standard map) తీవ్ర దుమారం రేపింది.

    సరిహద్దుల్లోని వివాదాస్పద ప్రాంతాలు సహా అరుణాచల్‌ ప్రదేశ్‌, అక్సాయ్‌ చిన్‌, తైవాన్‌, దక్షిణ చైనా సముద్రాలను తమ దేశంలోని భూభాగాలుగా ఆ మ్యాప్‌లో వివరించింది.

    DETAILS

    వివాదాస్పద చేష్టలతో సరిహద్దు వివాదాలను మరింత రగల్చడమే చైనా పని : భారత్ 

    అరుణాచల్‌ ప్రదేశ్‌ను దక్షిణ టిబెట్‌గా పేర్కొనడంపై భారత్‌ భగ్గుమంది. ఇలాంటి చేష్టలతో సరిహద్దు వివాదాలను మరింత రగల్చడమేనని మండిపడింది.

    ఎటువంటి ప్రామాణికం లేకుండా, ఆధారరహితంగా సదరు మ్యాప్‌ను చైనా రూపొందించిందని ఆగ్రహం వ్యక్తం చేసింది.

    ఈ మేరకు దౌత్యపరమైన మార్గాల్లో చైనాకు గట్టి నిరసన వ్యక్తం చేశామని భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అరీందర్‌ బాగ్చి తెలిపారు.

    చైనా విడుదల చేసిన ప్రామాణిక మ్యాప్ ను విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ తోసిపుచ్చారు.అసంబద్ధమైన వాదనలతో ఇతరుల భూభాగాలు తమ(చైనా)కు చెందినని కావని చురకలు అంటించారు.

    1950 దశకాల నుంచి చైనా ఇదే రీతిలో ప్రవర్తిస్తోందని, వారికిది కొత్తేమీ కాదని ఆయన ఎద్దేవా చేశారు. మ్యాప్‌లో ప్రాంతాలను మార్చడం వల్ల ఉపయోగం ఏమీ ఉండదన్నారు,

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    చైనా
    భారతదేశం
    అరుణాచల్ ప్రదేశ్

    తాజా

    Honda Rebel 500: హోండా రెబెల్ 500 బైక్ భారత్‌లో విడుదల.. ప్రారంభ ధర రూ. 5.12 లక్షలు ఆటో మొబైల్
    BCCI: ఆసియా టోర్నీల బహిష్కరణ.. క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ బీసీసీఐ
    The Paradise: 'ది ప్యారడైజ్‌'లో నానికి విలన్‌గా బాలీవుడ్‌ యాక్టర్! నాని
    Hyderabad: దేశంలో మొదటి ఏఐ బేస్డ్ డయాగ్నస్టిక్ టూల్.. నిలోఫర్ లో అందుబాటులోకి..  హైదరాబాద్

    చైనా

    ఈ ఏడాది 6,500 మంది మిలియనీర్లు భారత్ విడిచి వెళ్లిపోతారట  భారతదేశం
    అలీబాబాకు కొత్త ఛైర్మన్, సీఈఓ నియామకం.. షేర్ల పతనం, పోస్ట్ కొవిడ్ నష్టాలే కారణం బిజినెస్
    మా అభివృద్ధిని అడ్డుకునేందుకు అమెరికా ప్రయత్నం: మోదీ యూఎస్ పర్యటనపై చైనా కామెంట్స్  అమెరికా
    జిన్‌పింగ్‌ ఓ నియంత: చైనా అధ్యక్షుడిపై బైడెన్ సంచలన వ్యాఖ్యలు జో బైడెన్

    భారతదేశం

    గోల్డ్ మెడల్ గెలిచిన భారత జట్టు.. ప్రపంచ ఆర్చరీ ఛాంపియన్‌షిప్‌ కైవసం టీమిండియా
    Happy Friendship Day 2023: విలసిల్లుతున్న ఆన్‌లైన్ స్నేహం స్నేహితుల దినోత్సవం
    కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం.. 6.4 లక్షల గ్రామాలకు ఇంటర్నెట్ అనుసంధానం ప్రధాన మంత్రి
    ఉక్రెయిన్‌ విషయంలో అదే జరిగితే భారత్‌ సంతోషానికి అవధులుండవు: దోవల్  రష్యా

    అరుణాచల్ ప్రదేశ్

    అరుణాచల్‌ప్రదేశ్‌లో రాజ్‌నాథ్ పర్యటన.. సరిహద్దులో వ్యూహాత్మక ప్రాజెక్టుల ప్రారంభం రాజ్‌నాథ్ సింగ్
    Assembly Election 2023: మేఘాలయ, నాగాలాండ్‌లో ఓటింగ్; 4రాష్ట్రాల్లో అసెంబ్సీ బై పోల్ అసెంబ్లీ ఎన్నికలు
    'భారతదేశంలో అరుణాచల్ అంతర్భాగం'; చైనా సరిహద్దును మెక్‌మహన్ రేఖగా గుర్తిస్తూ అమెరికా తీర్మానం అమెరికా
    అరుణాచల్ ప్రదేశ్: కుప్పకూలిన ఆర్మీ హెలికాప్టర్; పైలట్ల కోసం గాలింపు యుద్ధ విమానాలు
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025