NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / అంతర్జాతీయం వార్తలు / Bangladesh : హోటల్‌కు నిప్పు.. 24 మంది సజీవ దహనం.. హిందువుల ఇళ్లే టార్గెట్
    తదుపరి వార్తా కథనం
    Bangladesh : హోటల్‌కు నిప్పు.. 24 మంది సజీవ దహనం.. హిందువుల ఇళ్లే టార్గెట్
    హోటల్‌కు నిప్పు.. 24 మంది సజీవ దహనం.. హిందువుల ఇళ్లే టార్గెట్

    Bangladesh : హోటల్‌కు నిప్పు.. 24 మంది సజీవ దహనం.. హిందువుల ఇళ్లే టార్గెట్

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Aug 07, 2024
    09:31 am

    ఈ వార్తాకథనం ఏంటి

    బంగ్లాదేశ్‌లో హింస ముదురుతోంది. షేక్ హసీనా ప్రధాని పదవికి రాజీనామా చేసి దేశం విడిచి వెళ్లిన తర్వాత కూడా నిరసనకారులు వీధుల్లోనే ఉన్నారు.

    ఈ క్రమంలో దేశంలోని హిందువుల ఇళ్లు, వ్యాపార సంస్థలపై దాడులకు తెగబడుతున్నారు.

    అదే విధంగా నాలుగు దేవాలయాలను ధ్వంసం చేశారు.

    మరోవైపు జషోర్ జిల్లాలలోని జబీర్ ఇంటర్నేషన్ హోటల్‌కు ఆందోళనకారులు నిప్పు పెట్టారు.

    ఇప్పటికే ఈ ఘటనలో 24 మంది సజీవ దహనమయ్యారని అధికార వర్గాలు తెలిపారు.

    ఈ హోటల్ అవామీ లీగ్ ప్రధాన కార్యదర్శి షాహిన్ చక్లాదర్‌కు చెందినది.

    Details

    బంగ్లాదేశ్ తాత్కలిక ప్రభుత్వ సారథిగా మహ్మద్ యూనస్

    ఇప్పటివరకూ బంగ్లాదేశ్‌లో జరిగిన అల్లర్ల కారణంగా 440కి పైగా మృతి చెందారు.

    బంగ్లాదేశ్‌లో తాత్కాలిక ప్రభుత్వానికి మహమ్మద్ యూనస్ నాయకత్వం వహించనున్నారు.

    బంగ్లాదేశ్‌లో మధ్యంతర ప్రభుత్వానికి నాయకత్వం వహించడానికి నోబెల్ శాంతి బహుమతి గ్రహీత, ఆర్థికవేత్త ముహమ్మద్ యూనస్‌ను మంగళవారం రాత్రి ఎన్నుకున్నారు.

    మాజీ ప్రధాని ఖలీదా జియా జైలు నుండి విడుదలైన తర్వాత, విద్యార్థుల తిరుగుబాటు మధ్య దేశవ్యాప్తంగా హింస, విధ్వంసం జరుగుతోందని ఢాకా ట్రిబ్యూన్ నివేదించింది.

    Details

    బంగ్లాదేశ్ జనాభాలో 8శాతం మంది హిందువులు

    బంగ్లాదేశ్‌లోని 170 మిలియన్ల జనాభాలో 8 శాతం మంది హిందువులున్నారు. లౌకికవాదానికి మద్దతు పలికే హసీనా అవామీ లీగ్ పార్టీకి ఎక్కువగా మద్దతు ఇచ్చారు.

    షేక్ హసీనా రాబోయే రెండు రోజులు భారతదేశం నుండి బయటకు వెళ్లే అవకాశం లేదని మీడియా నివేదికలు పేర్కొన్నాయి.

    ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేసిన కొన్ని గంటల తర్వాత సి-130జె సైనిక విమానంలో సోమవారం హిండన్ ఎయిర్‌బేస్‌లో దిగిన హసీనాను కట్టుదిట్టమైన భద్రతతో సురక్షిత ప్రదేశానికి తరలించారు.

    ఇక హతిబంధ ఉపజిల్లాలోని పుర్బో సర్దుబీ గ్రామంలో గత రాత్రి 12 హిందువుల ఇళ్లను ఆందోళన కారులు తగలబెట్టారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    బంగ్లాదేశ్
    భారతదేశం

    తాజా

    KTR: బీఆర్ఎస్ నేత కేటీఆర్‌కు సుప్రీంకోర్టు నోటీసులు కల్వకుంట్ల తారక రామరావు (కేటీఆర్)
    CIRCADIAN APP: 7 సెకన్లలో గుండె సమస్యలను గుర్తించే యాప్‌.. 14 ఏళ్ల బాలుడి ఆవిష్కరణ గుండె
    #NewsBytesExplainer: డోనాల్డ్ ట్రంప్,ఎలాన్ మస్క్ స్నేహ బంధం ఎక్కడ చెడింది? డొనాల్డ్ ట్రంప్
    Starlink: ఎలాన్‌ మస్క్‌ స్టార్‌ లింక్‌కు సేవలకు గ్రీన్‌ సిగ్నల్‌  స్టార్‌లింక్‌

    బంగ్లాదేశ్

    IND Vs BAN : టాస్ గెలిచిన బంగ్లాదేశ్.. గాయంతో బంగ్లా కెప్టెన్ దూరం!  టీమిండియా
    Train Accident: బంగ్లాదేశ్‌లో రైలు ప్రమాదం.. 13 మంది మృతి, పలువురికి గాయాలు  రైలు ప్రమాదం
    BAN Vs PAK : టాస్ గెలిచిన బంగ్లాదేశ్.. ఏ జట్టులో మార్పులు జరిగాయంటే..  పాకిస్థాన్
    PAK Vs BAN : బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన పాకిస్థాన్ పాకిస్థాన్

    భారతదేశం

    Zambia: కలరాతో 600మంది మృతి.. భారత్ మానవతా సాయం జాంబియా
    Houthi rebels: ఎర్ర సముద్రంలో రెచ్చిపోయిన 'హౌతీ'లు.. రెండు నౌకలపై డ్రోన్ దాడులు హౌతీ రెబెల్స్
    US Citizenship: 2023లో 59,100 మంది భారతీయులకు అమెరికా పౌరసత్వం అమెరికా
    భారత్‌లో 6,500 యూనిట్ల రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్ 450 అమ్మకాలు  రాయల్ ఎన్‌ఫీల్డ్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025