
Dalai Lama: దలైలామా వారసుడిపై నిర్ణయం.. ఆయనకే అధికారం లేదంటున్న చైనా రాయబారి
ఈ వార్తాకథనం ఏంటి
దలైలామా వారసుడి ఎంపికలో తనకే తుది అధికారం ఉండదని బీజింగ్ మళ్లీ ప్రకటించింది. ఈ ప్రకటన భారత్లోని చైనా రాయబారి షూ ఫెయిహాంగ్ చేసిన ఎక్స్ పోస్టు ద్వారా వెలుగులోకి వచ్చింది. టిబెట్ బౌద్ధ గురువు పునర్జన్మ విధానాన్ని నిర్ణయించడానికి 14వ దలైలామాకు అధికారం లేదని ఆయన స్పష్టం చేశారు. దలైలామా పునర్జన్మ విధానంలో స్పష్టంగా తెలుసుకోవాల్సిన అంశాలు ఉన్నాయని షూ పేర్కొన్నారు. 14వ దలైలామా వారసత్వాన్ని కొనసాగుతుందని స్వయంగా ప్రకటించినా, టిబెట్ బౌద్ధంలో శతాబ్దాలుగా అమలులో ఉన్న 'లివింగ్ బుద్ధ' సంప్రదాయాన్ని అనుసరించాల్సిందేనన్నారు.
Details
వారసుడు ఎంపిక ప్రక్రియ ఎలా ఉంటుంది?
దలైలామా పునర్జన్మ ప్రక్రియ చాలా సంక్లిష్టమైనది. ఇప్పటి 14వ దలైలామా టెన్జిన్ గ్యాట్సోను గుర్తించేందుకు నాలుగేళ్ల సమయం పట్టింది. బౌద్ధ విశ్వాసం ప్రకారం, దలైలామా మరణించిన తర్వాత అత్యున్నత స్థాయి బౌద్ధులు లామో లాత్సో సరస్సు వద్ద తపస్సు చేస్తారు. దివ్యసన్నిధానంలో దలైలామా కొత్త రూపంలో వారికి దర్శనమిస్తారని నమ్మకం. అప్పటివరకు ఆయన వాడిన వస్తువులను చిన్నారులకు చూపి గుర్తించగలిగితే వారిని దలైలామా పునర్జన్మగా గుర్తిస్తారు. దలైలామా దేహాన్ని దహనం చేసినప్పుడు పొగ ఏ దిశగా వెళ్తుందో, ఆయన పార్థివ దేహం తల మలిచిన దిక్కు ఏదైతే ఉందో, ఆ దిశలోనే అన్వేషణ మొదలవుతుంది. పూర్వదలైలామాతో పోలికలున్న బాలుడిని చూసినపుడు, ఆయన్ని పరీక్షించే పలు ప్రమాణాల ద్వారా గుర్తింపు చేస్తారు.
Details
తుది ప్రక్రియపై వివాదం
అయితే, ఈ ప్రక్రియలో అత్యంత కీలకమైన పాత్ర పంచెన్ లామా దే. టిబెట్ మతపరమైన పరిపాలనా కేంద్రంగా ఉన్న తాషీ లున్పో మఠాధిపతిగా ఉండే పంచెన్ లామా, దలైలామా పునర్జన్మను గుర్తించడంలో కీలక అధికారిగా వ్యవహరిస్తారు. ఇప్పటికీ బీజింగ్ తాము నియంత్రించిన పంచెన్ లామాను మాత్రమే గుర్తిస్తామంటూ, తమకు అధికారముందని వాదిస్తోంది. కానీ దలైలామా అనుచరులు, టిబెట్ బౌద్ధులు మాత్రం సంప్రదాయ ప్రక్రియకు కట్టుబడి ఉన్నారు. ఇది చైనా టిబెట్ మత, రాజకీయం పరంగా మరింత తలెత్తే వివాదానికి దారి తీసే అవకాశముంది.