Page Loader
khawaja asif: మన రక్షణ వ్యవస్థను భారత్ మట్టికరిపించింది: పాక్ రక్షణమంత్రి ఖవాజా ఆసిఫ్‌ వ్యాఖ్యలు
khawaja asif: మన రక్షణ వ్యవస్థను భారత్ మట్టికరిపించింది: ఖవాజా ఆసిఫ్‌

khawaja asif: మన రక్షణ వ్యవస్థను భారత్ మట్టికరిపించింది: పాక్ రక్షణమంత్రి ఖవాజా ఆసిఫ్‌ వ్యాఖ్యలు

వ్రాసిన వారు Sirish Praharaju
May 09, 2025
04:30 pm

ఈ వార్తాకథనం ఏంటి

లాహోర్, కరాచీ, రావల్పిండీతో పాటు పాకిస్తాన్‌లోని పలు ప్రాంతాలకు భారతదేశం పంపిన 25 డ్రోన్లను పాకిస్తాన్ అడ్డుకోలేకపోయిందని ఆ దేశ రక్షణమంత్రి ఖవాజా ఆసిఫ్‌ పార్లమెంట్‌లో తెలిపారు. భారతదేశం డ్రోన్లను పంపిన తర్వాత,వాటిని తమ సైన్యం గగనతలంలోనే గుర్తించి కూల్చివేసిందని పాక్ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించిన ఒక రోజు తర్వాతే రక్షణమంత్రి ఈ ప్రకటన చేశారు. అయితే అసలు వాస్తవాన్ని బయటపెట్టుతూ,భారత డ్రోన్లను అడ్డుకోలేకపోయామని స్వయంగా ఖవాజా ఆసిఫ్‌ పేర్కొన్నారు. "మన గగనతల రక్షణ వ్యవస్థ విఫలమైంది. భారత దాడులు మన రక్షణ వ్యవస్థను తునాతునకలు చేశాయి.మన రక్షణ శాఖ పూర్తిగా విఫలమైందని నిశ్చయంగా చెప్పగలను.ఇంతకంటే ఎక్కువ వివరాలు వెల్లడించలేను, ఎందుకంటే ఇది గోప్యత పరమైన అంశం,"అని ఆసిఫ్‌ పార్లమెంట్ సమావేశంలో ఉద్ఘాటించారు.

వివరాలు 

తెహ్రీక్-ఇ-తాలిబాన్‌ ఆధ్వర్యంలో 20 మంది పాక్ సైనికులు ప్రాణాలు కోల్పోయారు

ఈ వ్యాఖ్యలు వెల్లడి కావడంతో ప్రతిపక్ష పార్టీ,ముఖ్యంగా పాకిస్తాన్ తహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (PTI)నేతలు ప్రభుత్వం పై తీవ్రంగా మండిపడ్డారు. ప్రస్తుత పాలకులు అసమర్థులని, దేశ రక్షణ విషయంలో ఘోరంగా విఫలమయ్యారని ధ్వజమెత్తారు. ఇప్పటికే పాకిస్తాన్‌లో భద్రతా పరిస్థితులు తీవ్ర సంక్షోభంలో ఉన్నాయి. ఒకవైపు భారత సైన్యం దాడులతో దేశం అల్లకల్లోలంగా మారుతున్నదంటే, మరోవైపు బలూచిస్తాన్‌ లిబరేషన్‌ ఆర్మీ (BLA) దాడులతో సైన్యానికి ఊపిరి పోసుకోవడమే కష్టంగా మారింది. అలాగే తెహ్రీక్-ఇ-తాలిబాన్‌ ఆధ్వర్యంలో జరిగిన దాడుల్లో 20 మంది పాక్ సైనికులు ప్రాణాలు కోల్పోయారు. ఈ పరిస్థితుల నడుమ, దేశ ప్రధానిని కూడా సభ్యులు లక్ష్యంగా చేస్తున్నారు.

వివరాలు 

ప్రధాని నివాసానికి సమీపంలో భారత దళాలు దాడులు

పార్లమెంట్‌లో అనేక మంది ఎంపీలు షెహబాజ్‌ షరీఫ్‌పై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఆయన ఒక పిరికిపంద అని ఆగ్రహం వ్యక్తం చేశారు. భారత సైన్యం దాడుల నేపథ్యంలో పాక్‌లో సామాన్యులే కాదు,రాజకీయ నాయకులు కూడా భయంతో వణికిపోతున్నారు. మాజీ రిటైర్డ్‌ మేజర్‌, ప్రస్తుత సీనియర్ ఎంపీ తాహిర్‌ ఇక్బాల్‌ పార్లమెంట్‌లో మాట్లాడుతుండగా కంటతడి పెట్టిన దృశ్యం సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. అధికార పక్షానికి చెందిన ఆయన, భారత దాడులపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాకుండా,ఇస్లామాబాద్‌లోని ప్రధాని నివాసానికి సమీపంలో భారత దళాలు దాడులు జరిపినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌ తన నివాసాన్ని విడిచి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

పార్లమెంట్ లో మాట్లాడుతున్న పాక్ రక్షణమంత్రి ఖవాజా ఆసిఫ్‌