NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / అంతర్జాతీయం వార్తలు / 'నేను అధ్యక్షుడిగా ఎన్నికైతే భారత్‌పై అధిక పన్నులు విధిస్తా'; డొనాల్డ్ ట్రంప్ హెచ్చరిక
    తదుపరి వార్తా కథనం
    'నేను అధ్యక్షుడిగా ఎన్నికైతే భారత్‌పై అధిక పన్నులు విధిస్తా'; డొనాల్డ్ ట్రంప్ హెచ్చరిక
    'నేను అధ్యక్షుడిగా ఎన్నికైతే భారత్‌పై అధిక పన్నులు విధిస్తా'; డొనాల్డ్ ట్రంప్ హెచ్చరిక

    'నేను అధ్యక్షుడిగా ఎన్నికైతే భారత్‌పై అధిక పన్నులు విధిస్తా'; డొనాల్డ్ ట్రంప్ హెచ్చరిక

    వ్రాసిన వారు Stalin
    Aug 21, 2023
    12:55 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    2024లో జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో మరోసారి గెలవాలని ఉవ్విళ్లూరుతున్న డొనాల్డ్ ట్రంప్ భారత్‌పై కీలక వ్యాఖ్యలు చేశారు.

    తాను అధికారంలోకి వస్తే భారత్‌పై పరస్పర పన్ను విధానాన్ని అమలు చేస్తామని హెచ్చరించారు.

    అమెరికన్ ఉత్పత్తులపై ప్రత్యేకించి ప్రఖ్యాత హార్లే-డేవిడ్‌సన్ మోటార్‌సైకిళ్లపై భారతదేశం అధిక పన్ను విధించే అంశాన్ని ట్రంప్ మరోసారి లేవనెత్తారు.

    ఫాక్స్ బిజినెస్ న్యూస్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్ భారతదేశం ఎలివేటెడ్ పన్ను రేట్ల విధానాన్ని విమర్శించారు. భారత్ చాలా ఎక్కువగా టారీఫ్ వసూలు చేస్తోందని చేప్పారు.

    ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు 2018లో భారతదేశాన్ని 'టారిఫ్ కింగ్'గా ట్రంప్ అభివర్ణించారు.

    పన్ను

    ట్రంప్ హయాంలో భారత్ రీజనబుల్ మార్కెట్ యాక్సెస్‌ రద్దు 

    మే 2019లో అమెరికాకు భారత్ సరసమైన మార్కెట్ యాక్సెస్‌ను మంజూరు చేయడంలో భారత్ విఫలమైందని పేర్కొన్నారు.

    అంతేకాదు నాడు సిస్టం ఆఫ్ ప్రిఫరెన్సెస్ (జీఎస్‌పీ) కింద భారతదేశ రీజనబుల్ మార్కెట్ యాక్సెస్‌ను ట్రంప్ రద్దు చేశారు.

    ఆనాడు ట్రంప్ విమర్శల తర్వాత భారత్ దిగొచ్చింది. దిగుమతి చేసుకున్న బైక్‌లపై కస్టమ్స్ సుంకాన్ని 75శాతం నుంచి 50శాతానికి తగ్గించింది.

    అయితే ఇప్పుడు ట్రంప్ మరోసారి భారత్ విధిస్తున్న సుంకాలపై ప్రశ్నలను లేవనెత్తారు.

    అమెరికా ఉత్పత్తులపై భారత్ గణనీయమైన సుంకాన్ని విధిస్తోందని చెప్పారు. అమెరికా కూడా భారత ఉత్పత్తులపై అదే స్థాయిలో పన్నులు విధించాలన్నదే తన అభిప్రాయం అని ట్రంప్ పేర్కొన్నారు. దీనికి హార్లే-డేవిడ్‌సన్ బైక్‌పై విధించే సుంకాన్ని ట్రంప్ ఉదాహరణగా చెప్పారు.

    ట్రంప్

    అమెరికా ప్రయోజనాలకు విరుద్ధంగా భారత్ పన్ను విధానం: ట్రంప్

    హార్లే-డేవిడ్‌సన్ బైక్‌లపై భారత్ 200శాతం టారీఫ్‌లను విధిస్తోందని ట్రంప్ స్పష్టం చేశారు. కానీ భారత్‌లో తయారైన మోటార్‌సైకిళ్లు ఎలాంటి పన్ను లేదా సుంకం లేకుండా అమెరికాకు వస్తాయని అన్నారు.

    దీని తాము ఆరా తీస్తే, భారతదేశంలో ప్లాంట్‌ని స్థాపించడం కోసమే ఇలా అధిక సుంకాలను విధిస్తున్నట్లు తెలిసిందని ట్రంప్ అన్నారు. ఇది అమెరికా ప్రయోజనాలకు విరుద్ధంగా ఉన్నందున తాను దీన్ని వ్యతిరేకించినట్లు చెప్పారు.

    అమెరికాపై భారతదేశం 200 శాతం ఛార్జీ విధించినప్పుడు వారి ఉత్పత్తులపై ఎటువంటి సుంకాలను విధించకపోతే ఎలా? అని ప్రశ్నించారు. స్వేచ్ఛా వాణిజ్యానికి విరుద్ధంగా భారత పన్ను విధానం ఉన్నట్లు ట్రంప్ నొక్కి చెప్పారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    డొనాల్డ్ ట్రంప్
    అమెరికా
    భారతదేశం
    పన్ను

    తాజా

    IPL 2025 Recap: ఐపీఎల్‌ 2025 హైలైట్స్‌.. 14ఏళ్ల క్రికెటర్‌ నుంచి చాహల్‌ హ్యాట్రిక్‌ దాకా! ఐపీఎల్
    #NewsBytesExplainer: సిక్కిం భారతదేశంలో ఒక రాష్ట్రంగా ఎలా మారింది?   సిక్కిం
    Kaleshwaram: కాళేశ్వరం రిపోర్ట్‌ సిద్ధం.. కీలక నేతల విచారణ అవసరం లేదన్న కమిషన్ తెలంగాణ
    IMD: వచ్చే వారం కేరళలో అతి భారీ వర్షాలు.. ఆ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ కేరళ

    డొనాల్డ్ ట్రంప్

    'క్యాపిటల్‌'పై దాడి చేసిన నిరసనకారులకు మద్దతుగా పాట పాడిన డొనాల్డ్ ట్రంప్ అమెరికా
    'హష్ మనీ' కేసులో ట్రంప్‌ను అరెస్టు చేస్తారా? తర్వాత ఏం జరుగుతుందో తెలుసుకోండి అమెరికా
    స్టార్మీ డేనియల్స్ ఎవరు? ఈ పోర్ట్న్ స్టార్‌తో డొనాల్డ్ ట్రంప్‌కు ఉన్న సంబంధం ఏంటి? అమెరికా
    Hush money case: న్యూయార్క్ జడ్జి నన్ను ద్వేషిస్తున్నారు: డొనాల్డ్ ట్రంప్ అమెరికా

    అమెరికా

    US Earthquake: అలస్కా ద్వీపకల్ప ప్రాంతంలో భారీ భూకంపం; సునామీ హెచ్చరికలు జారీ  భూకంపం
    అమెరికాలో భారీ వర్షాలు.. 2600 విమానాలు రద్దు భారీ వర్షాలు
    అమెరికాలో విషాదం.. ఆడుకుంటూ చెల్లిని తుపాకీతో కాల్చిన అక్క ప్రపంచం
    ఒక్క అక్షర దోషంతో అగ్రరాజ్యం లక్షలాది మిలిటరీ ఈమెయిల్స్, రహస్యాలు లీక్  ఆర్మీ

    భారతదేశం

    భారత్‌లో గత 15ఏళ్లలో 41.5కోట్ల మంది పేదరికాన్ని జయించారు: ఐక్యరాజ్య సమితి ఐక్యరాజ్య సమితి
    వివేకానంద, రామకృష్ణ పరమహంసపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సన్యాసిపై ఇస్కాన్ నిషేధం  ఇస్కాన్
    India-France-UAE: 'భారత్-ఫ్రాన్స్- యూఏఈ' త్రైపాక్షిక ప్రణాళిక సహకారం దిశగా మోదీ; ఈనెల 15న అబుదాబికి ప్రధాని నరేంద్ర మోదీ
    Tesla : త్వరలో భారత మార్కెట్లోకి టెస్లా.. రూ.20 లక్షలతో ధర ప్రారంభం టెస్లా

    పన్ను

    ద్రవ రూపంలో ఉండే బెల్లం, పెన్సిల్ షార్పనర్‌లపై పన్ను తగ్గించిన జిఎస్‌టి కౌన్సిల్ జీఎస్టీ
    అధిక ద్రవ్యోల్బణం కారణంగా 4.4% క్షీణించిన భారతదేశ మూడవ త్రైమాసిక GDP వృద్ధి వ్యాపారం
    మార్చి 31లోపు పన్ను చెల్లింపుదారులు చేయాల్సిన 5 పనులు ప్రకటన
    ముడి చమురు ఉత్పత్తిపై విండ్ ఫాల్ పన్ను టన్నుకు రూ.3,500 తగ్గింపు ప్రకటన
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025