NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / అంతర్జాతీయం వార్తలు / Indian UPI In Maldives: మాల్దీవుల్లో ఇండియన్ UPI ప్రవేశం.. అధ్యక్షుడు ముయిజ్జూ కీలక నిర్ణయం
    తదుపరి వార్తా కథనం
    Indian UPI In Maldives: మాల్దీవుల్లో ఇండియన్ UPI ప్రవేశం.. అధ్యక్షుడు ముయిజ్జూ కీలక నిర్ణయం
    మాల్దీవుల్లో ఇండియన్ UPI ప్రవేశం.. అధ్యక్షుడు ముయిజ్జూ కీలక నిర్ణయం

    Indian UPI In Maldives: మాల్దీవుల్లో ఇండియన్ UPI ప్రవేశం.. అధ్యక్షుడు ముయిజ్జూ కీలక నిర్ణయం

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Oct 21, 2024
    10:12 am

    ఈ వార్తాకథనం ఏంటి

    మాల్దీవుల అధ్యక్షుడు మహమ్మద్ ముయిజ్జూ క్యాబినెట్ సిఫార్సుల ఆధారంగా, భారతదేశం యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్‌ఫేస్ (UPI)ను ప్రారంభించేందుకు సిద్ధమయ్యారు.

    ఈ సందర్భంగా ముయిజ్జూ ఆదేశాలు జారీ చేసి, మాల్దీవుల్లో UPIని ప్రారంభించడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.

    ఈ నిర్ణయం దేశ ఆర్థిక వ్యవస్థను మెరుగుపరుస్తుందని, ఆర్థిక, లావాదేవీల సామర్థ్యం పెరిగే అవకాశాలున్నాయని అధ్యక్ష కార్యాలయం ఓ ప్రకటనలో పేర్కొంది.

    దీనివల్ల డిజిటల్ మౌలిక సదుపాయాల అభివృద్ధి మరింత వేగంగా జరగనున్నట్లు అంచనా వేస్తున్నారు. UPIని ప్రారంభించేందుకు ముయిజ్జూ ఒక ప్రత్యేక ఏజెన్సీని ఏర్పాటు చేయాలని ప్రకటించారు.

    మాల్దీవుల బ్యాంకులు, టెలికమ్యూనికేషన్ కంపెనీలు, ప్రభుత్వ యాజమాన్యంలోని సంస్థలు, ఫిన్‌టెక్ కంపెనీలను ఈ కన్సార్టియంలో చేర్చాలని ఆయన సూచించారు.

    Details

    జై శంకర్ మాల్దీవుల పర్యటనలో కీలక ఒప్పందాలు 

    ఈ ఏడాది ఆగస్టులో, భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ మాల్దీవులు పర్యటన సమయంలో UPIకి సంబంధించిన ఒప్పందంపై సంతకాలు చేశారు.

    ఈ ఒప్పందం ప్రకారం, మాల్దీవులు డిజిటల్ చెల్లింపుల వ్యవస్థను ప్రారంభించడానికి నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, మాల్దీవుల ఆర్థిక అభివృద్ధి మంత్రిత్వ శాఖ మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది.

    UPIని మాల్దీవుల్లో ప్రవేశపెట్టడానికి నిర్ణయం తీసుకునే ముందు, దేశ జాతీయ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ మాల్దీవ్స్ (BML) భారతదేశానికి సంబంధించిన ఒక ముఖ్యమైన ప్రకటన చేసింది.

    భారతదేశంలోని రూపే కార్డ్ ఇప్పుడు BML ATMలు, POS మెషీన్లలో అంగీకరిస్తున్నట్లు ఈ నెల 7న ప్రకటించింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    మాల్దీవులు
    ఇండియా

    తాజా

    SRH vs LSH: సన్ రైజర్స్ చేతిలో ఓటమి.. ఫ్లే ఆఫ్స్ రేసు నుంచి లక్నో నిష్క్రమణ సన్ రైజర్స్ హైదరాబాద్
    Harshal Patel: లెజెండరీ బౌలర్లను వెనక్కి నెట్టిన హర్షల్ పటేల్.. ఐపీఎల్‌లో తొలి బౌలర్‌గా రికార్డు ఐపీఎల్
    Honda Rebel 500: హోండా రెబెల్ 500 బైక్ భారత్‌లో విడుదల.. ప్రారంభ ధర రూ. 5.12 లక్షలు ఆటో మొబైల్
    BCCI: ఆసియా టోర్నీల బహిష్కరణ.. క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ బీసీసీఐ

    మాల్దీవులు

    మాల్దీవుల్లో భారత హైకమిషన్‌పై దాడికి కుట్ర.. స్పందించిన విదేశాంగ శాఖ విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి
    #Boycott Maldives: భారత్‌పై మాల్దీవ్స్ నేతల అక్కసు.. ట్రెండింగ్‌లో బాయ్‌కాట్ మాల్దీవ్స్ హ్యాష్‌ట్యాగ్  తాజా వార్తలు
    Maldives: ప్రధాని మోదీపై అభ్యంతరకర వ్యాఖ్యలు.. ఇద్దరు మంత్రులను సస్పెండ్ చేసిన మాల్దీవులు సర్కార్  తాజా వార్తలు
    Lakshadweep MP: మోదీ భారత పర్యాటకంపై స్పందిస్తే మాల్దీవులకు వచ్చిన సమస్య ఏంటి?: లక్షద్వీప్ ఎంపీ లక్షదీవులు

    ఇండియా

    Paracetamol: సీడీఎస్సీఓ హెచ్చరిక.. భారతదేశంలో పారాసెటమాల్ సహా 52 మందులు నాణ్యతలో విఫలం  ప్రపంచం
    Delhi Tragedy: నలుగురు దివ్యాంగ కుమార్తెలతో కలిసి తండ్రి ఆత్మహత్య దిల్లీ
    Mumbai: ముంబయిలో ఉగ్ర ముప్పు కలకలం.. అప్రమత్తమైన పోలీసులు  ముంబై
    RG Kar ex-principal: సందీప్ ఘోష్‌కి భారీ షాకిచ్చిన కోర్టు.. నేరం రుజువైతే మరణశిక్ష..?  కోల్‌కతా
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025