LOADING...
PM Modi: మోదీకి ఇథియోపియా అత్యున్నత పురస్కారం 
మోదీకి ఇథియోపియా అత్యున్నత పురస్కారం

PM Modi: మోదీకి ఇథియోపియా అత్యున్నత పురస్కారం 

వ్రాసిన వారు Sirish Praharaju
Dec 17, 2025
09:08 am

ఈ వార్తాకథనం ఏంటి

భారత ప్రధాని నరేంద్ర మోదీకి అంతర్జాతీయ వేదికపై అరుదైన, అత్యున్నత గౌరవం లభించింది. ఇథియోపియా దేశం అందించే అత్యున్నత పురస్కారం 'ది గ్రేట్ హానర్ నిషాన్ ఆఫ్ ఇథియోపియా'ను ప్రధాని మోదీకి ఇథియోపియా ప్రధానమంత్రి అబియ్ అహ్మద్ అలీ మంగళవారం ప్రదానం చేశారు. ఈ అవార్డును స్వీకరించిన తొలి ప్రపంచ ప్రభుత్వాధినేతగా మోదీ చరిత్రలో నిలిచారు. అడిస్ అబాబాలోని అంతర్జాతీయ కన్వెన్షన్ సెంటర్‌లో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ఈ పురస్కారాన్ని అధికారికంగా అందించారు.

వివరాలు 

ఈ గౌరవం 140కోట్ల మంది భారతీయ ప్రజలకు అంకితం

భారత్-ఇథియోపియా మధ్య ఉన్న భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడంలో ప్రధాని మోదీ పోషించిన కీలక పాత్రకు,అలాగే అంతర్జాతీయ స్థాయిలో ఆయన చూపిన దూరదృష్టి గల నాయకత్వానికి గుర్తింపుగా ఈ గౌరవాన్ని ప్రదానం చేసినట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ (MEA)ఒక ప్రకటనలో వెల్లడించింది. అవార్డు అందుకున్న అనంతరం ప్రధాని మోదీ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా స్పందిస్తూ,'ది గ్రేట్ హానర్ నిషాన్ ఆఫ్ ఇథియోపియా' పురస్కారం తనకు దక్కడం గర్వంగా ఉందని తెలిపారు. ఈ గౌరవాన్ని 140కోట్ల మంది భారతీయ ప్రజలకు అంకితం చేస్తున్నానని తన సందేశంలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన ప్రధాని మోదీ,ప్రపంచంలోనే అత్యంత ప్రాచీన నాగరికతలలో ఒకటైన ఇథియోపియా నుంచి ఈ ప్రతిష్ఠాత్మక పురస్కారం అందుకోవడం తనకు అదృష్టంగా భావిస్తున్నానని చెప్పారు.

వివరాలు 

అబియ్ అహ్మద్ అలీ తీసుకుంటున్న చర్యలను అభినందించిన మోదీ 

ఎంతో వినయంతో, కృతజ్ఞతతో ఈ గౌరవాన్ని స్వీకరిస్తున్నానని తెలిపారు. ద్వైపాక్షిక సంబంధాల అభివృద్ధిలో భాగంగా, శతాబ్దాలుగా ఇథియోపియా పురోగతికి తోడ్పడుతున్న భారతీయ ఉపాధ్యాయుల సేవలను ఆయన ప్రత్యేకంగా ప్రశంసించారు. అలాగే జాతీయ సమైక్యత, స్థిరత్వం, సమ్మిళిత అభివృద్ధి దిశగా ఇథియోపియా ప్రధాని అబియ్ అహ్మద్ అలీ తీసుకుంటున్న చర్యలను మోదీ అభినందించారు. ఈ అవార్డు ప్రదానం భారత్-ఇథియోపియా మధ్య బలమైన భాగస్వామ్యానికి ప్రతీకగా నిలవడమే కాకుండా, గ్లోబల్ సౌత్‌కు సంబంధించిన సానుకూల ఎజెండాను మరింత ముందుకు తీసుకెళ్లడంలో ఒక కీలక మైలురాయిగా నిలిచిందని విదేశాంగ శాఖ పేర్కొంది.

Advertisement

వివరాలు 

500 కోట్ల డాలర్ల స్థాయికి భారత్-జోర్డాన్ ద్వైపాక్షిక వాణిజ్యం

ఇదిలా ఉండగా, ఇథియోపియాకు వెళ్లే ముందు ప్రధాని మోదీ జోర్డాన్ రాజధాని అమ్మాన్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో ప్రసంగించారు. వచ్చే ఐదేళ్లలో భారత్-జోర్డాన్ ద్వైపాక్షిక వాణిజ్యం రెట్టింపై 500 కోట్ల డాలర్ల స్థాయికి చేరుతుందని తనకు నమ్మకం ఉందని ఆయన వెల్లడించారు. భారత ఆర్థిక వృద్ధిలో భాగస్వాములై లాభాలు పొందాలని జోర్డాన్ వాణిజ్య సంస్థలకు ప్రధాని మోదీ ఆహ్వానం పలికారు.

Advertisement