NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / అంతర్జాతీయం వార్తలు / Zuckerberg:ఫేస్‌బుక్‌లో పోస్టు..పాకిస్థాన్‌లో జుకర్‌ బర్గ్‌ కి మరణశిక్ష..?
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    Zuckerberg:ఫేస్‌బుక్‌లో పోస్టు..పాకిస్థాన్‌లో జుకర్‌ బర్గ్‌ కి మరణశిక్ష..?
    ఫేస్‌బుక్‌లో పోస్టు..పాకిస్థాన్‌లో జుకర్‌ బర్గ్‌ కి మరణశిక్ష..?

    Zuckerberg:ఫేస్‌బుక్‌లో పోస్టు..పాకిస్థాన్‌లో జుకర్‌ బర్గ్‌ కి మరణశిక్ష..?

    వ్రాసిన వారు Sirish Praharaju
    Feb 12, 2025
    02:41 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    మెటా (Meta) సీఈఓ మార్క్ జూకర్ బర్గ్ (Mark Zuckerberg) తనకు పాకిస్థాన్‌లో (Pakistan) మరణశిక్ష విధించాలని చూస్తున్నారని వెల్లడించారు.

    ఎవరో వ్యక్తి ఫేస్‌బుక్‌లో పెట్టిన పోస్టు కారణంగా ఈ పరిస్థితి ఏర్పడిందని ఆయన తెలిపారు.

    ఇటీవల జో రోగన్‌ పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్న జుకర్‌బర్గ్‌ ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ సందర్భంగా, ఫేస్‌బుక్‌పై పాకిస్థాన్‌లో నమోదైన కేసు గురించి కూడా వివరించారు.

    వివరాలు 

    యాప్‌లోని కొంత కంటెంట్‌ను అణచివేయాల్సిన పరిస్థితి 

    "ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలలో మనం అంగీకరించని వివిధ చట్టాలు ఉన్నాయి.ఉదాహరణకు, పాకిస్థాన్‌లో ఎవరో నాపై మరణశిక్ష విధించాలని కేసు వేశారు.ఫేస్‌బుక్‌లో ఎవరో దేవుడిని అవమానించేలా ఉన్న చిత్రాలను పోస్ట్‌ చేయడమే దీని కారణం.ఇది ఎటువైపుకి దారి తీస్తుందో తెలియదు.నాకు ఆదేశానికి వెళ్లాల్సిన అవసరం లేదు కాబట్టి చాలా ఎక్కువగా ఆందోళన చెందను. భావప్రకటన స్వేచ్ఛకు తోడు,వివిధదేశాలలో పాటించే సాంస్కృతిక విలువలకు అనుగుణంగా కొన్ని నిబంధనలు కూడా అమల్లో ఉంటాయి.అందువల్ల,యాప్‌లోని కొంత కంటెంట్‌ను అణచివేయాల్సిన పరిస్థితి వస్తోంది.కొన్ని దేశ ప్రభుత్వాలు అమలు చేసే నిబంధనలు చాలా కఠినంగా ఉండటంతో,అవి మమ్మల్ని జైలుకు పంపించగల సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి.అమెరికా ప్రభుత్వం విదేశాలలో పనిచేస్తున్న అమెరికన్ టెక్ కంపెనీలకు రక్షణ కల్పించాలని నేను భావిస్తున్నాను,"అని జుకర్‌బర్గ్‌ పేర్కొన్నారు.

    వివరాలు 

    ఈ మాధ్యమాలను ఉపయోగిస్తున్న బలూచిస్తాన్‌ లిబరేషన్ ఆర్మీ ఉగ్రవాదులు

    గతేడాది ప్రారంభంలో జాతీయ భద్రతా కారణాల నేపథ్యంలో పాకిస్థాన్‌ ఎక్స్‌ (X), ఫేస్‌బుక్‌ (Facebook) సహా కొన్ని ప్రముఖ సామాజిక మాధ్యమాలను నిషేధించింది.

    బలూచిస్తాన్‌ లిబరేషన్ ఆర్మీ ఉగ్రవాదులు తమ దేశ వ్యతిరేక కార్యకలాపాలను విస్తరించేందుకు ఈ మాధ్యమాలను ఉపయోగిస్తున్నారని ఆ దేశ ప్రభుత్వం ఆరోపించింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    మార్క్ జూకర్ బర్గ్

    తాజా

    Prof S Mahendra Dev: ప్రధానికి ఆర్థిక సలహామండలి ఛైర్మన్‌గా సూర్యదేవర మహేంద్రదేవ్‌    కేంద్ర ప్రభుత్వం
    #NewsBytesExplainer: పెద్దధన్వాడలో 9 నెలలుగా కొనసాగుతున్న ఉద్రిక్తత వెనక అసలు కారణం ఏంటి ?అక్కడేం జరుగుతోంది? గద్వాల
    MLA Gopinath: బీఆర్ఎస్ జూబ్లీహిల్స్‌ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్‌ తీవ్ర అస్వస్థత.. AIG ఆసుపత్రిలో చికిత్స తెలంగాణ
    Kannappa: మా అమ్మే నాకు 'కన్నప్ప'.. ప్రత్యేక వీడియో షేర్‌ చేసిన నటుడు మోహన్ బాబు  మోహన్‌ బాబు

    మార్క్ జూకర్ బర్గ్

    మెటాలో మరిన్ని ఉద్యోగ కోతలు జరిగే అవకాశం, జూకర్ బర్గ్ అసంతృప్తే కారణం మెటా
    మరిన్ని ఉద్యోగ కోతలను సంస్థ పునర్నిర్మాణంలో భాగమని సమర్ధించుకుంటున్న మెటా మెటా
    మెటాలో మరిన్ని ఉద్యోగ కోతలు ఉండే అవకాశం మెటా
    డీ సెంట్రలైజ్డ్ సామాజిక యాప్‌లపై ఆసక్తి చూపుతున్న బిలియనీర్లు సోషల్ మీడియా
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025