Page Loader
Sri Lanka: శ్రీలంకలో ఘోర ప్రమాదం.. కొండపై నుంచి బస్సు బోల్తా.. 21 మంది మృతి
శ్రీలంకలో ఘోర ప్రమాదం.. కొండపై నుంచి బస్సు బోల్తా.. 21 మంది మృతి

Sri Lanka: శ్రీలంకలో ఘోర ప్రమాదం.. కొండపై నుంచి బస్సు బోల్తా.. 21 మంది మృతి

వ్రాసిన వారు Jayachandra Akuri
May 11, 2025
03:58 pm

ఈ వార్తాకథనం ఏంటి

శ్రీలంకలో తేయాకు కొండల ప్రాంతంలో ఆదివారం ఉదయం ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. ఓ ప్రయాణికుల బస్సు కొండపై నుంచి బోల్తాపడటంతో 21 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో మరో 36 మంది గాయపడ్డారని స్థానిక అధికారులు తెలిపారు. ఈ దుర్ఘటన రాజధాని కొలంబోకు తూర్పు దిశగా 140 కిలోమీటర్ల దూరంలోని కోట్మలే పట్టణ సమీపంలో ఈ తెల్లవారుజామున చోటుచేసుకుంది. శ్రీలంక రహదారులు, రవాణా శాఖ డిప్యూటీ మంత్రి ప్రసన్న గుణసేన మీడియాతో మాట్లాడుతూ.. మృతుల సంఖ్యను 21గా ధృవీకరించారు. ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 77 మంది బౌద్ధ యాత్రికులు ఉన్నారని తెలిపారు.

Details

క్షతగాత్రులను ఆస్పత్రికి తరలింపు

బస్సు సామర్థ్యానికి మించి 25 మంది అదనంగా ప్రయాణించడమే ప్రమాదానికి కారణమై ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. డ్రైవర్ బస్సుపై నియంత్రణ కోల్పోవడంతోనే ఈ ఘటన జరిగిందని స్థానిక పోలీసులు పేర్కొన్నారు. ప్రమాదానికి గురైన బస్సు శ్రీలంక ప్రభుత్వ రవాణా సంస్థకు చెందినదని అధికారులు నిర్ధారించారు. బాధితులను సమీపంలోని ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నట్లు తెలుస్తోంది. ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది.