NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / అంతర్జాతీయం వార్తలు / సముద్రంలో మునిగిన ఇండోనేషియా నౌక.. 15 మంది మృతి, 19 మంది గల్లంతు
    తదుపరి వార్తా కథనం
    సముద్రంలో మునిగిన ఇండోనేషియా నౌక.. 15 మంది మృతి, 19 మంది గల్లంతు
    సముద్రంలో మునిగిన ఇండోనేషియా నౌక.. 15 మంది మృతి, 19 మంది గల్లంతు

    సముద్రంలో మునిగిన ఇండోనేషియా నౌక.. 15 మంది మృతి, 19 మంది గల్లంతు

    వ్రాసిన వారు TEJAVYAS BESTHA
    Jul 24, 2023
    11:55 am

    ఈ వార్తాకథనం ఏంటి

    ఇండోనేషియాలో వేలాది ద్వీపాలు ఉన్నాయి. కొన్నిసార్లు భద్రతా ప్రమాణాలు సరిగ్గా లేక, మరికొన్ని సార్లు నౌకలో సాంకేతిక కారణాల రీత్యా ఆ దేశ జలాల్లో ఎన్నో ప్రమాదాలు జరుగుతుంటాయి.

    ఈ క్రమంలోనే సోమవారం సులవేసి ద్వీపంలోని సముద్రంలో ఘోర ప్రమాదం జరిగింది. సముద్రంలో నౌక మునిగిన ఘటనలో 15 మంది ప్రయాణికులు చనిపోయారు. మరో 19 మంది గల్లంతయ్యారు.

    ఆగ్నేయ సులవేసి ప్రావిన్స్ రాజధానికి దక్షిణ వైపున దాదాపు 200 కిలోమీటర్ల దూరంలో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. మునా ద్వీపం గుండా ప్రయాణికులతో వెళ్తుండగా ఈ ప్రమాదం సంభవించింది.

    ప్రమాద సమయంలో నౌకలో 40 మంది ప్రయాణికులు ఉన్నట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి.

    DETAILS

    ఇండోనేషియా జలాల్లో 17 వేల కంటే ఎక్కువ ద్వీపాలు ఉండటం వల్లే ప్రమాదాలు

    అయితే ఘటన తర్వాత వారిలో ఆరుగురు ప్రాణాలతో బయటపడ్డట్లు ఇండోనేషియా అధికారులు ప్రకటించారు. రాత్రి సమయంలో సదరు నౌక ఎలా మునిగిపోయిందో పూర్తి వివరాలు తెలియరాలేదని ప్రాథమికంగా అభిప్రాయపడుతున్నారు.

    వివిధ ఆస్పత్రుల్లో ప్రమాద బాధితులు చికిత్స పొందుతున్నట్లు సెర్చ్ అండ్ రెస్క్యూ ఏజెన్సీ అధికారి ముహమ్మద్ అరాఫా వెల్లడించారు. మరోవైపు 15 మృతదేహాలను గుర్తించామని, ఈ మేరకు బాధిత కుటుంబాలకు అప్పగించామన్నారు.

    ఇండోనేషియాలో 17 వేల కంటే ఎక్కువ ద్వీపాలు ఉన్నాయి. వీటి గుండానే నౌకలు ప్రయాణిస్తుంటాయి. ఈ క్రమంలోనేే ప్రమాదాలు సంభవిస్తున్నాయి.

    నౌక ప్రయాణాల్లో భద్రతా ప్రమాణాలను నిర్లక్ష్యం చేయడంతోనే ఇలాంటి దుర్ఘటనలు తరచుగా జరుగుతున్నాయని ప్రయాణికుల కుటుంబాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఇండోనేషియా

    తాజా

    Kiran Abbavaram : కిరణ్ అబ్బవరం కొత్త సినిమా గ్లింప్స్ రిలీజ్.. కిరణ్ అబ్బవరం
    Rajamouli: గెలుపు ఎవరిదైనా.. ఓటమి గుండెల్లో నిలిచిపోతుంది.. రాజమౌళి ట్వీట్ వైరల్ రాజమౌళి
    PM Modi: జూన్ 04న మంత్రులతో ప్రధాని మోదీ భేటీ.. ఆపరేషన్ సిందూర్ తర్వాత ఇదే మొదటి సమావేశం.. నరేంద్ర మోదీ
    IPL Prize Money: ఐపీఎల్ ఫైనల్ గెలిచిన జట్టుకు భారీగా నగదు.. ఆరెంజ్, పర్పుల్ క్యాప్ హోల్డర్లకు ఎంత తెలుసా? ఐపీఎల్

    ఇండోనేషియా

    ఇండోనేషియాలో భారీ భూకంపం, రిక్టర్ స్కేలుపై 6.0 తీవ్రత నమోదు అంతర్జాతీయం
    కలుషిత మందులపై తక్షణమే చర్యలు తీసుకోండి: డబ్ల్యూహెచ్ఓ ప్రపంచ ఆరోగ్య సంస్థ
    ఇండోనేషియాలో 7.3 తీవ్రతతో భారీ భూకంపం; సునామీ హెచ్చరికలు  భూకంపం
    హనీమాన్ కి ఇండోనేషియా వెళ్లిన తమిళ వైద్యజంట.. ప్రమాదవశాత్తు సముద్రంలో పడి మృతి తమిళనాడు
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025