NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / అంతర్జాతీయం వార్తలు / సింగపూర్‌లో 20 ఏళ్ల తర్వాత తొలిసారి మహిళకు ఉరిశిక్ష
    తదుపరి వార్తా కథనం
    సింగపూర్‌లో 20 ఏళ్ల తర్వాత తొలిసారి మహిళకు ఉరిశిక్ష
    సింగపూర్‌లో 20 ఏళ్ల తర్వాత తొలిసారి మహిళకు ఉరిశిక్ష

    సింగపూర్‌లో 20 ఏళ్ల తర్వాత తొలిసారి మహిళకు ఉరిశిక్ష

    వ్రాసిన వారు Stalin
    Jul 27, 2023
    06:10 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    సింగపూర్‌లో అక్రమంగా డ్రగ్స్ సరఫరా చేస్తున్న ఇద్దరికి ఉరిశిక్ష పడినట్లు ఆ దేశ మానవ హక్కుల సంస్థ వెల్లడించింది.

    ఉరిశిక్ష పడినవారిలో ఒకరు మహిళ కాగా, మరొకొరు పురుషుడు.

    విశేషమేమిటంటే సింగపూర్‌లో 20ఏళ్ల తర్వాత ఓ మహిళకు ఉరిశిక్ష పడటం ఇదే తొలిసారి.

    ఉరిశిక్ష పడిన మహిళ పేరు సరిదేవీ జమానీ(45) కాగా, పురుషుడి పేరు మొహమ్మద్ అజీజ్ బిన్ హుస్సేన్ (56).

    50 గ్రాముల (1.76 ఔన్సుల)హెరాయిన్ అక్రమ రవాణాకు పాల్పడిన కేసులో మొహమ్మద్ అజీజ్ బిన్ హుస్సేన్‌ను కోర్టు దోషిగా తేల్చింది.

    దాదాపు 30 గ్రాముల హెరాయిన్‌ స్మగ్లింగ్ కేసులో దోషిగా తేలడంతో 2018లో సరిదేవీ జమానీకి మరణశిక్ష పడింది.

    సింగపూర్

    సరిదేవీ జమానీకి రేపు ఉరి

    అజీజ్ హుస్సేన్‌ను సింగపూర్‌లోని చాంగి జైలులో బుధవారం ఉరి తీశారు. అతని మృతదేహాన్ని ఖననం కూడా చేసినట్లు ట్రాన్స్‌ఫార్మేటివ్ జస్టిస్ కలెక్టివ్ కార్యకర్త కిర్‌స్టెన్ హాన్ చెప్పారు.

    సరిదేవీ జమానీని శుక్రవారం(జులై 28) ఉరి తీయనున్నారు.

    సింగపూర్‌లో చివరి సారిగా 2004లో మాదకద్రవ్యాల అక్రమ రవాణా కేసులో 36ఏళ్ల యెన్ మే వోన్ అనే మహిళను ఉరి తీశారు.

    ఆ తర్వాత ఒక మహిళను ఉరి తీయడం ఇదే మొదటిసారి కానుంది.

    సింగపూర్‌లో ప్రపంచంలోనే అత్యంత కఠినమైన మాదక ద్రవ్యాల వ్యతిరేక చట్టాలు ఉన్నాయి. డ్రగ్స్ కేసులో దోషిగా తేలితే అక్కడ మరణ శిక్షే శరణ్యం.

    డ్రగ్స్ నుంచి సమాజాన్ని రక్షించడానికి ఇలాంటి కఠినమైన చట్టాలు అవసరమని అక్కడి ప్రభుత్వం సమర్థించుకుంటోంది.

    సింగపూర్

    2022నుంచి ఆ దేశంలో 15మందికి ఉరి

    సింగపూర్ చట్టం ప్రకారం, 15 గ్రాముల కంటే ఎక్కువ హెరాయిన్, 500 గ్రాముల కంటే ఎక్కువ గంజాయి అక్రమ రవాణాకు పాల్పడినట్లు నేరం రుజువైతే మరణశిక్ష పడుతుంది.

    సింగపూర్ మార్చి 2022లో ఉరిశిక్ష అమలును తిరిగి ప్రారంభించారు. అప్పటి నుంచి మాదకద్రవ్యాల నేరాలకు సంబంధించి కేసుల్లో 15 మందిని ఉరి తీసింది.

    ప్రతి నెల సగటున ఒక ఉరిశిక్ష అమలు చేయబడుతుందని ట్రాన్స్‌ఫర్మేటివ్ జస్టిస్ కలెక్టివ్, ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ లాంటి మానవ హక్కుల సంస్థలు చెబుతున్నాయి.

    కఠినమైన మాదకద్రవ్యాల చట్టాలు సింగపూర్‌ను ప్రపంచంలోనే అత్యంత సురక్షితమైన ప్రదేశాల్లో ఒకటిగా ఉంచడంలో సహాయపడతాయని అక్కడి అధికారులు వాదిస్తున్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    సింగపూర్
    తాజా వార్తలు

    తాజా

    RCB vs PBKS : ఐపీఎల్ 2025 విజేతగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్ బెంగళూర్ రాయల్ ఛాలెంజర్స్
    Virat Kohli: ఐపీఎల్ హిస్టరీలో విరాట్ కోహ్లీ అద్భుత రికార్డు విరాట్ కోహ్లీ
    Shreyas Iyer: ఐపీఎల్‌ ఫైనల్స్‌ స్పెషలిస్ట్‌ అయ్యర్‌? పంజాబ్‌ ట్రోఫీ కల సాకారమవుతుందా?  శ్రేయస్ అయ్యర్
    Tata Harrier ev: ఫ్లాగ్‌షిప్‌ ఎస్‌యూవీ హారియర్‌ ఈవీని లాంచ్‌ చేసిన టాటా.. ఒక్కసారి ఛార్జి చేస్తే 627 కిలోమీటర్ల ప్రయాణం  టాటా హారియర్

    సింగపూర్

    సింగపూర్ కార్యాలయ సిబ్బందిని ఇంటి నుండి పనిచేయమని కోరిన ట్విట్టర్ ట్విట్టర్
    సింగపూర్: భారతీయ సంతతి మహిళ ఛాతిపై తన్ని, జాతి వివక్ష వ్యాఖ్యలు అంతర్జాతీయం
    సింగపూర్ PayNow భాగస్వామ్యంతో గ్లోబల్ ఎంట్రీ ఇచ్చిన భారతదేశం UPI వ్యాపారం
    ఢిల్లీని క్రమశిక్షణ లేని నగరమంటున్న ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి భారతదేశం

    తాజా వార్తలు

    చైనాలో స్కూల్ జిమ్ పైకప్పు కూలి 11మంది దుర్మరణం  చైనా
    Bigg Boss 7: 'బిగ్ బాస్ 7' ఎలా ఉంటుందో చెప్పిసిన నాగార్జున బిగ్ బాస్ తెలుగు
    Gyanvapi mosque Case: జ్ఞానవాపి మసీదులో ఏఎస్ఐ సర్వేపై సుప్రీంకోర్టు స్టే జ్ఞానవాపి మసీదు
    భార్య, మేనల్లుడిని కాల్చి, తర్వాత తానూ ఆత్మహత్య చేసుకున్న అమరావతి ఏసీపీ మహారాష్ట్ర
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025