Uzbekistan: ఉజ్బెకిస్తాన్లో మోదీకి ఘన స్వాగతం.. నాలుగోసారి పర్యటన
ఈ వార్తాకథనం ఏంటి
రెండు రోజుల పర్యటన నిమిత్తం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారం ఉజ్బెకిస్తాన్ చేరుకున్నారు. తాష్కెంట్ విమానాశ్రయానికి చేరుకున్న ప్రధాని మోదీకి ఉజ్బెకిస్తాన్ అధ్యక్షుడు మిర్జియోయేవ్ ఘన స్వాగతం పలికారు. ప్రధాని మోదీ ఉజ్బెకిస్తాన్లో పర్యటించడం ఇది నాలుగోసారి. ఈ పర్యటనలో భారత్, ఉజ్బెకిస్తాన్ మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసే దిశగా ప్రధాని మోదీ చర్చలు, కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా ఉజ్బెకిస్తాన్ అధ్యక్షుడు మిర్జియోయేవ్తో ప్రతినిధుల స్థాయి చర్చలు జరపనున్నారు.
వివరాలు
ఒకే కారులో ప్రయాణించిన మోదీ, మిర్జియోయేవ్
ఉజ్బెకిస్తాన్లో అడుగుపెట్టిన అనంతరం ప్రధాని మోదీ రాజధాని తాష్కెంట్లోని యాంగీ ఉజ్బెకిస్తాన్ పార్కును సందర్శించారు.
అక్కడి స్వాతంత్య్ర స్మారక చిహ్నం వద్ద పుష్పగుచ్ఛం ఉంచి నివాళులర్పించారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు మిర్జియోయేవ్ కూడా మోదీ వెంట ఉన్నారు.
అనంతరం మోదీ, మిర్జియోయేవ్ ఇద్దరూ ఒకే కారులో ప్రయాణించారు.