NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / అంతర్జాతీయం వార్తలు / తుపాకీ కొనుగోలు కేసులో జో బైడెన్ కుమారుడు హంటర్‌ను దోషిగా తేల్చిన కోర్టు 
    తదుపరి వార్తా కథనం
    తుపాకీ కొనుగోలు కేసులో జో బైడెన్ కుమారుడు హంటర్‌ను దోషిగా తేల్చిన కోర్టు 
    తుపాకీ కొనుగోలు కేసులో జో బైడెన్ కుమారుడు హంటర్‌ను దోషిగా తేల్చిన కోర్టు

    తుపాకీ కొనుగోలు కేసులో జో బైడెన్ కుమారుడు హంటర్‌ను దోషిగా తేల్చిన కోర్టు 

    వ్రాసిన వారు Stalin
    Sep 15, 2023
    02:16 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ను వివాదాలు చుట్టుముడుతున్నాయి. ఐదేళ్ల క్రితం అక్రమంగా తుపాకీ కొనుగోలు చేసిన కేసులో జో బైడెన్ కుమారుడు హంటర్ బైడెన్‌ను డెలావేర్‌లోని ఫెడరల్ కోర్టు దోషిగా తేల్చింది.

    2018లో ఆయుధాలు కొనుగోలు చేసేందుకు జో బైడెన్ కుమారుడు హంటర్ బైడెన్‌ అబద్ధం చెప్పాడన్న ఆరోపణలపై బైడెన్‌పై సుదీర్ఘకాలంగా విచారణ కొనసాగింది.

    ఆయుధాన్ని విక్రయించేటప్పుడు హంటర్ తన మాదకద్రవ్యాల అలవాటు గురించి అబద్ధం చెప్పినట్లు అభియోగాలు మోపారు.

    విచారణలో అభియోగాలు నిజమని తేలడంతో కోర్టు అతన్ని దోషిగా తేల్చింది.

    అమెరికా చరిత్రలో అధ్యక్షుడి కొడుకు ఓ కేసులో దోషిగా తేలడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.

    అమెరికా

    బైడెన్‌పై అభిశంసన విచారణ

    హంటర్ బైడెన్ ప్రస్తుతం మూడు కేసుల్లో అభియోగాలను ఎదుర్కొంటున్నారు.

    ఒకటి ఆయుధాల కొనుగోలు కేసు కాగా, దీంట్లో ఆయన దోషిగా తేలారు.

    ఆర్థిక వ్యాపార లావాదేవీలపై కూడా హంటర్ బైడెన్‌పై విచారణ కొనసాగుతోంది.

    సకాలంలో పన్నులు చెల్లించలేదనే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ కేసు విషయంలో కాలిఫోర్నియా లేదా వాషింగ్టన్‌లో దావా వేయవచ్చని ప్రత్యేక న్యాయవాది సూచించారు.

    2024 అధ్యక్ష ఎన్నికల్లో పరిణామాలు బైడెన్‌కు ప్రతికూల అంశాలుగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి.

    మరోసారి అధ్యక్షుడిగా పోటీ చేయాలని భావిస్తున్న డొనాల్డ్ ట్రంప్‌ ప్రస్తుతం నాలుగు క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్నారు.

    హంటర్ వ్యాపార లావాదేవీల ఆరోపణల నేపథ్యంలో బిడెన్‌పై అభిశంసన విచారణను ప్రారంభించాలని సభను అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్ కెవిన్ మెక్‌కార్తీ ఆదేశించారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    అమెరికా
    జో బైడెన్
    తాజా వార్తలు

    తాజా

    Russia:ప్రత్యక్ష చర్చలు జరపాలి.. భారత్‌-పాక్‌లకు రష్యా కీలక సందేశం భారతదేశం
    Gaza-Israel: గాజాపై విరుచుకుపడిన ఇజ్రాయెల్‌.. ఒక్క రోజులో 146 మంది మృతి ఇజ్రాయెల్
    Asaduddin Owaisi: పాకిస్థాన్ మానవాళికి అతిపెద్ద ముప్పు: అసదుద్దీన్ ఓవైసీ ఫైర్ అసదుద్దీన్ ఒవైసీ
    Andhra Pradesh: మహిళలకు గుడ్ న్యూస్.. ఆ రోజు నుంచే ఉచిత బస్సు ప్రయాణం చంద్రబాబు నాయుడు

    అమెరికా

    డొనాల్డ్ ట్రంప్ కేసులో సంచలనం.. జడ్జీని చంపేస్తానన్న టెక్సాస్ మహిళ అరెస్ట్ డొనాల్డ్ ట్రంప్
    విమానంలో విషాదం.. ఫ్లైట్ గాల్లో ఉండగా బాత్రూమ్‌లో కుప్పకూలిన పైలట్‌ చిలీ
    అమెరికాలో మనిషి మాంసాన్ని తీనేస్తున్న బ్యాక్టీరియా.. ఇప్పటికే ముగ్గురు మృతి! ప్రపంచం
    హర్యానా ముస్లింలు భారత్​లోనే గౌరవంగా బతకాలని అనుకుంటున్నారు : యూఎస్ కాంగ్రెస్ రో ఖన్నా  హర్యానా

    జో బైడెన్

    అమెరికా అధ్యక్షుడు బైడెన్‌కు క్యాన్సర్ చికిత్స; ఛాతి నుంచి చర్మం తొలగింపు అమెరికా
    అమెరికాలో మరో బ్యాంకు మూసివేత; బాధ్యులను వదిలి పెట్టబోమని బైడెన్ ప్రకటన అమెరికా
    పుతిన్‌కు అరెస్ట్ వారెంట్ జారీ చేసిన అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు; సమర్థించిన బైడెన్ వ్లాదిమిర్ పుతిన్
    వేసవిలో ప్రధాని మోదీకి అమెరికా అధ్యక్షుడు బైడన్ ఆతిథ్యం; వైట్‌హౌస్ ఏర్పాట్లు నరేంద్ర మోదీ

    తాజా వార్తలు

    భారత్‌కు సౌదీ అత్యంత వ్యూహాత్మక భాగస్మామి: ద్వైపాక్షిక భేటీలో ప్రధాని మోదీ  నరేంద్ర మోదీ
    కేరళ: అయ్యప్ప మాల ధరించిన చర్చి ఫాదర్.. సభ్యత్వాన్ని రద్దు చేసిన క్రైస్తవ సంఘం  కేరళ
    సూడాన్ సంక్షోభం: డ్రోన్ దాడిలో 43మంది మృతి  సూడాన్
    పాకిస్థాన్: పెషావర్‌లో పేలుడు.. ఒకరు మృతి.. 8మందికి గాయాలు పాకిస్థాన్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025