NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / అంతర్జాతీయం వార్తలు / China: కిండర్ గార్టెన్‌లో కత్తిదాడి; ముగ్గురు విద్యార్థులు సహా ఆరుగురు మృతి
    తదుపరి వార్తా కథనం
    China: కిండర్ గార్టెన్‌లో కత్తిదాడి; ముగ్గురు విద్యార్థులు సహా ఆరుగురు మృతి
    కిండర్ గార్టెన్‌లో కత్తిదాడి; ముగ్గురు విద్యార్థులు సహా ఆరుగురు మృతి

    China: కిండర్ గార్టెన్‌లో కత్తిదాడి; ముగ్గురు విద్యార్థులు సహా ఆరుగురు మృతి

    వ్రాసిన వారు Stalin
    Jul 10, 2023
    11:48 am

    ఈ వార్తాకథనం ఏంటి

    చైనాలోని గ్వాంగ్‌డాంగ్ ప్రావిన్స్‌లోని కిండర్ గార్టెన్‌లో సోమవారం జరిగిన కత్తి దాడిలో ఆరుగురు మరణించారు. ఒకరు గాయపడినట్లు స్థానిక పోలీసులు తెలిపారు.

    చనిపోయిన వారిలో ఒక టీచర్, ఇద్దరు తల్లిదండ్రులు, ముగ్గురు విద్యార్థులు ఉన్నారు.

    దక్షిణ చైనాలోని లియాన్‌జియాంగ్‌ సిటీలోని హెంగ్‌షాన్‌ పట్టణంలో ఈ ఘటన జరిగింది.

    స్థానిక పోలీసులు నిందితుడిని వెంటనే గుర్తించి అరెస్టు చేశారు. దాడి చేసిన వ్యక్తిని వూ మౌజీ(25)గా అధికారులు పేర్కొన్నారు. ఈ సంఘటన ఉదయం 7:40 గంటలకు జరిగింది.

    చైనా పౌరులు తుపాకీలను కలిగి ఉండడాన్ని అక్కడి ప్రభుత్వం నిషేధిస్తుంది. ఈ క్రమంలో ఆ దేశంలో ఇటీవలి సంవత్సరాలలో కత్తిపోట్లు ఎక్కువగా జరుగుతున్నాయి.

    ప్రత్యేకంగా పాఠశాలలను లక్ష్యంగా చేసుకుని ఇలాంటి ఘోరమైన దాడులు జరుగుతున్నాయి.

    చైనా

    పాఠశాలల్లో విద్యార్థులు, ఉపాధ్యాయుల భద్రతపై ప్రభుత్వం ఫోకస్

    గత ఏడాది ఆగస్టులో ఆగ్నేయ జియాంగ్జి ప్రావిన్స్‌లోని కిండర్ గార్టెన్‌పై కత్తిదాడి జరిగింది. ఈ దాడిలో ముగ్గురు వ్యక్తులు మృతి చెందగా, మరో ఆరుగురికి గాయాలయ్యాయి.

    ఏప్రిల్ 2021లో, గ్వాంగ్జీ జువాంగ్ స్వయంప్రతిపత్త ప్రాంతంలోని బెయిలియు నగరంలో జరిగిన సామూహిక కత్తిపోటులో ఇద్దరు పిల్లలు మరణించగా, మరో 16మంది గాయపడ్డారు.

    అక్టోబర్ 2018లో నైరుతి చైనాలోని చాంగ్‌కింగ్‌లోని కిండర్ గార్టెన్‌లో కత్తి దాడిలో 14మంది పిల్లలు గాయపడ్డారు.

    చైనా ప్రభుత్వం కూడా 2010 నుంచి పాఠశాలల చుట్టూ భద్రతను పెంచింది. ఈ దాడుల నేపథ్యంలో పాఠశాలలకు ప్రత్యేక భద్రతను ఏర్పాటు చేసేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.

    ఏప్రిల్ 2021 దాడి తరువాత, పాఠశాలల్లో అంబులెన్స్ సేవలను విద్యా మంత్రిత్వ శాఖ తప్పనిసరి చేసింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    చైనా
    పాఠశాల
    తాజా వార్తలు

    తాజా

    Vikram Misri: యుద్ధానికి ఫుల్‌స్టాప్.. భారత్ సంచలన ప్రకటన భారతదేశం
    Donald Trump: భారత్-పాక్ కాల్పుల విరమణను అంగీకరించాయంటూ డొనాల్డ్ ట్రంప్ పోస్టు డొనాల్డ్ ట్రంప్
    IPL 2025: బెంగళూరు, చెన్నై, హైదరాబాద్‌ కేంద్రంగా ఐపీఎల్‌ మిగిలిన మ్యాచ్‌లు? ఐపీఎల్
    BLA: పాక్‌కు మరో ఎదురు దెబ్బ.. 39 ప్రాంతాల్లో బలూచిస్థాన్ మెరుపుదాడులు పాకిస్థాన్

    చైనా

    వరుస భూకంపాలతో అల్లాడిపోయిన తజికిస్థాన్‌; విరిగిపడ్డ కొండచరియలు భూకంపం
    రష్యాకు వ్యతిరేకంగా ఐక్యరాజ్యసమితిలో ఓటింగ్‌; భారత్, చైనా దూరం ఉక్రెయిన్-రష్యా యుద్ధం
    The Wall Street Journal: చైనా ల్యాబ్‌ నుంచే కరోనా వ్యాప్తి; అమెరికా ఎనర్జీ డిపార్ట్‌మెంట్ నివేదిక కోవిడ్
    దిల్లీలో జరిగే జీ20 సమావేశానికి చైనా హాజరు భారతదేశం

    పాఠశాల

    ఏపీ సర్కార్ కీలక నిర్ణయం.. విద్యార్థులకు ఒంటిపూట బడులు  ఆంధ్రప్రదేశ్

    తాజా వార్తలు

    భారత్‌లో మే నెలలో 27% ఫిర్యాదులపై చర్యలు తీసుకున్న ఫేస్‌బుక్; నివేదిక వెల్లడి ఫేస్ బుక్
    నేడు ప్రధాని మోదీ అధ్యక్షతన ఎస్ఈఓ శిఖరాగ్ర సమావేశం; పుతిన్, జిన్‌పింగ్‌, షెహబాజ్ హాజరు  నరేంద్ర మోదీ
    డీఈఆర్‌సీ చైర్‌పర్సన్‌ ప్రమాణ స్వీకారం వాయిదా వేసిన సుప్రీంకోర్టు; కేంద్రం, ఎల్‌జీకి నోటీసులు  సుప్రీంకోర్టు
    బీజేపీతో పొత్తుపై 2022లోనే ఎన్సీపీలో చర్చ; తిరుగుబాటు నేత ప్రఫుల్ పటేల్ సంచలన వ్యాఖ్యలు  మహారాష్ట్ర
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025