NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / అంతర్జాతీయం వార్తలు / Jaish-e-Mohammed Base Camp: జైషే మహమ్మద్ కేంద్రాలను మట్టుబెట్టిన ఇండియన్ ఆర్మీ
    తదుపరి వార్తా కథనం
    Jaish-e-Mohammed Base Camp: జైషే మహమ్మద్ కేంద్రాలను మట్టుబెట్టిన ఇండియన్ ఆర్మీ
    జైషే మహమ్మద్ కేంద్రాలను మట్టుబెట్టిన ఇండియన్ ఆర్మీ

    Jaish-e-Mohammed Base Camp: జైషే మహమ్మద్ కేంద్రాలను మట్టుబెట్టిన ఇండియన్ ఆర్మీ

    వ్రాసిన వారు Jayachandra Akuri
    May 07, 2025
    09:25 am

    ఈ వార్తాకథనం ఏంటి

    పహల్గాం ఉగ్రదాడికి ప్రతిగా భారత్‌ పాకిస్తాన్‌కు గట్టి సమాధానం చెప్పింది. భారత రక్షణ శాఖ ఆధ్వర్యంలో 'ఆపరేషన్ సింధూర్' పేరిట పాక్‌తో పాటు పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోని (పీఓకే) ఉగ్రవాద స్థావరాలపై వైమానిక దాడులు నిర్వహించింది.

    ఈ దాడుల్లో మొత్తం తొమ్మిది ఉగ్ర స్థావరాలను గుర్తించి ధ్వంసం చేసినట్టు భారత సైన్యం ప్రకటించింది. ఈ దాడుల్లో జైషే మహ్మద్‌కు చెందిన నలుగురు కీలక శిబిరాలు నేలమట్టమయ్యాయి.

    ప్రత్యేకంగా బహావల్పూర్‌లోని మర్కజ్ సుభాన్ అల్లా ప్రాంతంలోని ప్రధాన హెడ్‌క్వార్టర్‌ను లక్ష్యంగా చేసుకుంది ఇండియన్ ఆర్మీ. ఈ కేంద్రం సుమారు 15 ఎకరాల్లో విస్తరించి ఉంది.

    గతంలో 2019లో జరిగిన పుల్వామా ఉగ్రదాడికి సంబంధించి ఉగ్రవాదులు ఇక్కడే శిక్షణ పొందినట్టు గుర్తించారు.

    Details

    30 ఉగ్రవాదులను మృతి

    మసూద్ అజార్ ఆధ్వర్యంలోని ఈ టెర్రర్ క్యాంప్‌ భారత సైన్యం టార్గెట్ చేయగా, భారీగా విరుచుకుపడింది.

    ఈ నేపథ్యంలో మసూద్ అజార్ ఉన్న ప్రాంతాలను ప్రధాన లక్ష్యంగా చేసుకుని భారత్ మిస్సైల్ దాడులు జరిపింది.

    బహావల్పూర్‌లోని శిబిరంపై మొదట దాడి చేసి, 30 మంది ఉగ్రవాదులను మట్టుబెట్టినట్టు సమాచారం. అంతేకాకుండా లష్కరే తోయిబా శిబిరాలపైనా భారత్ మిస్సైల్ దాడులు చేసింది.

    మొత్తం ఆరు ప్రాంతాల్లో నిర్వహించిన ఈ దాడుల్లో భారత్ 24 క్షిపణులను ప్రయోగించినట్టు పాకిస్తాన్ ఆరోపించింది.

    ఇక, మౌలానా మసూద్ అజార్, ముఫ్తీ అబ్దుల్ రవూఫ్ అస్గర్‌తో కలిసి ఈ శిబిరాల నుంచే ఉగ్ర కార్యకలాపాలను నడిపిస్తున్నట్టూ భారత రక్షణ శాఖ అభిప్రాయపడింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    భారత సైన్యం

    తాజా

    CSK vs RR : చైన్నై సూపర్ కింగ్స్‌పై రాజస్థాన్ విజయం రాజస్థాన్ రాయల్స్
    Andhra Pradesh: ఏపీలో వైద్య విప్లవానికి రంగం సిద్ధం.. బీమా ద్వారా ప్రతి కుటుంబానికి ఉచిత వైద్య సేవలు! ఆంధ్రప్రదేశ్
    Tata Harrier EV: జూన్ 3న హారియర్ EV ఆవిష్కరణ.. టాటా నుండి మరో ఎలక్ట్రిక్ మాస్టర్‌పీస్! టాటా మోటార్స్
    Turkey: టర్కీ,అజర్‌బైజాన్‌లకు షాక్ ఇస్తున్న భారతీయులు.. 42% తగ్గిన వీసా అప్లికేషన్స్..  టర్కీ

    భారత సైన్యం

    Poonch Border : కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిన పాకిస్తాన్.. భారత సైన్యం ధీటైన సమాధానం పాకిస్థాన్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025